సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది. రేపు థియేటర్లలో అడుగు పెట్టనుంది. అయితే తెలుగు వెర్షన్ రిలీజ్ కావడం లేదు. థియేటర్ల కొరత, స్ట్రెయిట్ సినిమాల పోటీ, సెన్సార్ ఆలస్యం తదితర కారణాల వల్ల ఏపీ తెలంగాణ విడుదల వాయిదా వేసుకున్నారు.
సరే ఇది ఒక రకంగా మంచి నిర్ణయమే కానీ డబ్బింగ్ వెర్షన్ లేట్ కావడం వల్ల మన ఆడియన్స్ కి పరాశక్తి తమిళ టాక్, రివ్యూలు ముందుగానే తెలుసుకునే అవకాశం దక్కుతుంది. హిట్టయితే సంతోషమే కానీ ఏమాత్రం అటుఇటు అయినా ఇక్కడ ఓపెనింగ్స్ ఆశించడం కష్టమవుతుంది.
దర్శకురాలు సుధా కొంగర కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఒకప్పుడు తమిళనాడుని ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకోవడం వల్ల పొలిటికల్ గా ఇందులో కొన్ని కాంట్రవర్సిలు పెట్టారు. వాటిని కుదించడంతో పాటు పాతిక దాకా కట్స్ కి అంగీకారం తెలిపి టీమ్ ముందుకు వెళ్తోంది.
కీలకమైన పొంగల్ పండక్కు సరైన సినిమా లేదని అక్కడి మూవీ లవర్స్ బాధ పడుతున్న టైంలో పరాశక్తికి క్లియరెన్స్ రావడం జాక్ పాట్ అనే చెప్పాలి. ఎందుకంటే కాంపిటీషన్ లేకపోవడం వల్ల అనుకున్న దానికన్నా రెట్టింపు నెంబర్లతో వసూళ్లు రాబోతున్నాయనేది వాస్తవం.
హీరోయిన్ శ్రీలీల మాత్రం తెగ ఫీలైపోతోంది. ఎందుకంటే రెగ్యులర్ హీరోయిన్ కాకుండా నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇందులో చేసింది. కానీ తెలుగు ఫ్యాన్స్ ని చూసే అవకాశం లేకపోవడం వల్ల మన రెస్పాన్స్ తెలుసుకునే ఛాన్స్ ఉండదు. హైదరాబాద్ లో కూడా తమిళ వెర్షన్ రిలీజ్ చేయడం లేదు.
కోలీవుడ్ లో యునానిమస్ టాక్ వస్తేనే పరాశక్తికి ఇక్కడ బజ్ సంపాదించుకోవచ్చు. రెండేళ్ల క్రితం శివ కార్తికేయన్ అయలన్ వాయిదా పడి చివరికి థియేటర్లకు రాకుండానే ఇటీవల ఓటిటి ప్రీమియర్ జరుపుకుంది. పరాశక్తికి అలాంటి పరిస్థితి రాకూడదని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. రేపీపాటికి ఫుల్ రిపోర్ట్స్ వచ్చేసి ఉంటాయి.
This post was last modified on January 9, 2026 5:20 pm
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…