Political News

జ‌గ‌న్ ఫ్లెక్సీల‌కు ర‌క్తాభిషేకం చేసిన వాళ్ళు అరెస్ట్

వైసీపీ అధినేత జ‌గ‌న్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఈ నెల 21న వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే. అనంత‌పురం, శ్రీస‌త్య‌సాయి జిల్లాల్లో కొంద‌రు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. జ‌గ‌న్ ఫ్లెక్సీల‌కు ర‌క్తాభిషేకం చేశారు.

గొర్రెలు, పొట్టేళ్ల‌ను న‌డిరోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గానే.. వికృతంగా త‌ల‌లు న‌రికి.. ఆయా మూగ‌జీవాల క‌ళేబ‌రాల నుంచి ఉబికి వ‌చ్చిన ర‌క్తంతో జ‌గ‌న్ ఫ్లెక్సీల‌కు ర‌క్తాభిషేకం చేసి.. పైశాచిక ఆనందం పొందారు.

పైగా.. ఆయా ఘ‌ట‌న‌ల‌ను వీడియోలు, ఫొటోలు తీసి.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ప‌రిణామాల‌పై స్థానికంగా ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అడ‌వుల్లో జంతువుల మాదిరిగా వ్య‌వ‌హ‌రించారంటూ.. ప‌లువురు స్థానికులు వైసీపీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు.

అయినా.. ఆయా ఘ‌ట‌న‌ల‌ను వైసీపీ నాయ‌కులు స‌మ‌ర్థించుకున్నారు. ఇక‌, పార్టీ కార్యాల‌యం కానీ, పార్టీ అధినేత జ‌గ‌న్ కానీ.. ఆయా ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి స్పందించ‌లేదు. మ‌రోవైపు.. ఈ వికృత ప‌రిణామాల‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించిన ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు ఆదేశించింది.

మ‌రోవైపు.. జంతు బ‌లులు, ర‌క్తాభిషేకాలు జ‌రిగిన ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు కూడా పోలీసుల‌ను ఆశ్ర‌యించి ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా మంగ‌ళ‌వారం ఉద‌యం ఆయా ఘ‌ట‌న‌ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేశారు.

ఘ‌ట‌న‌ల‌కు బాధ్యులైన ఆరుగురు వైసీపీ నాయ‌కులు, 15 మందికి పైగా కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు. వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు తెలిపారు. స‌మాజాన్ని భ‌య‌పెట్ట‌డం, సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను భ‌య‌కంపితుల‌ను చేయ‌డం, జంతు బ‌లుల నిషేధ చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేసిన‌ట్టు చెప్పారు.

This post was last modified on December 23, 2025 5:04 pm

Share
Show comments
Published by
Kumar
Tags: YCP cadre

Recent Posts

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

18 minutes ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

1 hour ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

2 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

3 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

4 hours ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

4 hours ago