Political News

జ‌గ‌న్ ఫ్లెక్సీల‌కు ర‌క్తాభిషేకం చేసిన వాళ్ళు అరెస్ట్

వైసీపీ అధినేత జ‌గ‌న్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఈ నెల 21న వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే. అనంత‌పురం, శ్రీస‌త్య‌సాయి జిల్లాల్లో కొంద‌రు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. జ‌గ‌న్ ఫ్లెక్సీల‌కు ర‌క్తాభిషేకం చేశారు.

గొర్రెలు, పొట్టేళ్ల‌ను న‌డిరోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గానే.. వికృతంగా త‌ల‌లు న‌రికి.. ఆయా మూగ‌జీవాల క‌ళేబ‌రాల నుంచి ఉబికి వ‌చ్చిన ర‌క్తంతో జ‌గ‌న్ ఫ్లెక్సీల‌కు ర‌క్తాభిషేకం చేసి.. పైశాచిక ఆనందం పొందారు.

పైగా.. ఆయా ఘ‌ట‌న‌ల‌ను వీడియోలు, ఫొటోలు తీసి.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ప‌రిణామాల‌పై స్థానికంగా ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అడ‌వుల్లో జంతువుల మాదిరిగా వ్య‌వ‌హ‌రించారంటూ.. ప‌లువురు స్థానికులు వైసీపీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు.

అయినా.. ఆయా ఘ‌ట‌న‌ల‌ను వైసీపీ నాయ‌కులు స‌మ‌ర్థించుకున్నారు. ఇక‌, పార్టీ కార్యాల‌యం కానీ, పార్టీ అధినేత జ‌గ‌న్ కానీ.. ఆయా ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి స్పందించ‌లేదు. మ‌రోవైపు.. ఈ వికృత ప‌రిణామాల‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించిన ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు ఆదేశించింది.

మ‌రోవైపు.. జంతు బ‌లులు, ర‌క్తాభిషేకాలు జ‌రిగిన ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు కూడా పోలీసుల‌ను ఆశ్ర‌యించి ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా మంగ‌ళ‌వారం ఉద‌యం ఆయా ఘ‌ట‌న‌ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేశారు.

ఘ‌ట‌న‌ల‌కు బాధ్యులైన ఆరుగురు వైసీపీ నాయ‌కులు, 15 మందికి పైగా కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు. వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు తెలిపారు. స‌మాజాన్ని భ‌య‌పెట్ట‌డం, సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను భ‌య‌కంపితుల‌ను చేయ‌డం, జంతు బ‌లుల నిషేధ చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేసిన‌ట్టు చెప్పారు.

This post was last modified on December 23, 2025 5:04 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

3 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

3 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

4 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

4 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

5 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

5 hours ago