వైసీపీ అధినేత జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 21న వైసీపీ నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొందరు కార్యకర్తలు, నాయకులు.. జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేశారు.
గొర్రెలు, పొట్టేళ్లను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే.. వికృతంగా తలలు నరికి.. ఆయా మూగజీవాల కళేబరాల నుంచి ఉబికి వచ్చిన రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసి.. పైశాచిక ఆనందం పొందారు.
పైగా.. ఆయా ఘటనలను వీడియోలు, ఫొటోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పరిణామాలపై స్థానికంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవుల్లో జంతువుల మాదిరిగా వ్యవహరించారంటూ.. పలువురు స్థానికులు వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు.
అయినా.. ఆయా ఘటనలను వైసీపీ నాయకులు సమర్థించుకున్నారు. ఇక, పార్టీ కార్యాలయం కానీ, పార్టీ అధినేత జగన్ కానీ.. ఆయా ఘటనలకు సంబంధించి స్పందించలేదు. మరోవైపు.. ఈ వికృత పరిణామాలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది.
మరోవైపు.. జంతు బలులు, రక్తాభిషేకాలు జరిగిన ప్రాంతాల్లోని ప్రజలు కూడా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా మంగళవారం ఉదయం ఆయా ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఘటనలకు బాధ్యులైన ఆరుగురు వైసీపీ నాయకులు, 15 మందికి పైగా కార్యకర్తలను అరెస్టు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సమాజాన్ని భయపెట్టడం, సాధారణ ప్రజలను భయకంపితులను చేయడం, జంతు బలుల నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…