ఆరేళ్లు వెనక్కి వెళ్తే నందమూరి బాలకృష్ణ కెరీర్ దారుణమైన స్థితిలో కనిపించింది. యన్.టి.ఆర్-కథానాయకుడు, యన్.టి.ఆర్-మహానాయకుడు, రూలర్ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు కావడంతో బాలయ్య మార్కెట్ బాగా డౌన్ అయింది. ఆ స్థితి నుంచి ఆయన మళ్లీ కోలుకోగలడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ‘అఖండ’, ‘భగవంత్ కేసరి’, ‘వీరసింహారెడ్డి’, ‘డాకు మహారాజ్’.. ఇలా వరుస హిట్లతో బాలయ్య దూసుకెళ్లాడు.
వీటి తర్వాత ‘అఖండ-2’కు మంచి హైప్ వచ్చింది. అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా లేకపోయినా.. బాలయ్య స్థాయినేమీ తగ్గించలేదీ చిత్రం. ‘అఖండ-2’ ఫలితం అభిమానులను కాస్త నిరాశపరిచినా.. బాలయ్య తర్వాతి సినిమా ఒక రేంజిలో ఉండబోతోందనే అంచనాలుండడం వారిలో ఉత్సాహాన్ని నింపుతోంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన కొత్త చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘యన్.టి.ఆర్’ చిత్రాలకు పని చేసిన సీనియర్ రైటర్ సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు రచయిత కావడం విశేషం. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి గొప్పగా చెప్పాడు.
‘‘అదొక అద్భుతమైన సబ్జెక్ట్. NBK111 అనేది నెక్స్ట్ లెవెల్ సినిమా. రేప్పొద్దున సినిమా రిలీజయ్యాక అందరూ షాకైపోతారు. బాలయ్య బాబు అభిమానులే కాదు.. తటస్థులు, సినిమా అభిమానులందరూ ఆ సినిమా చూసిన తర్వాత ఆశ్చర్యపోతారు. ఒకసారి సినిమా చూసి ఆగిపోరు. రెండుమూడుసార్లు చూస్తారు. తనతో పాటు కొంతమందిని తీసుకెళ్లి ఆ సినిమా చూపించడాన్ని ఒక గర్వకారణంలా ఫీలవుతారు. ఆ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ గర్విస్తారు’’ అని సాయిమాధవ్ అన్నారు.
ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారట, రాజుగా కనిపిస్తారట కదా అని అడిగితే.. ఆ విషయం తాను చెప్పకూడదని, దర్శకుడు, ప్రొడక్షన్ టీమే చెప్పాలని సాయిమాధవ్ వ్యాఖ్యానించారు. రామ్ చరణ్తో ‘పెద్ది’ చేస్తున్న వృద్ధి సినిమాస్ బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 23, 2025 11:01 am
తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…
బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…
ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…
దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…
సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…
ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…