చిన్న, పెద్ద అని తేడా లేకుండా రిలీజ్కు ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా చిన్న చిత్రాలకు బజ్ క్రియేట్ చేయడం కోసం ఒకట్రెండు రోజుల ముందే స్పెషల్ ప్రిమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ముందే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయి ప్రయోజనం పొందిన సినిమాలున్నాయి. అలాగే ముందే నెగెటివ్ టాక్తో దెబ్బ తిన్న చిత్రాలూ ఉన్నాయి.
క్రిస్మస్కు అరడజనుకు పైగా సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో తమ సినిమాల ప్రత్యేకతను చాటేందుకు.. బజ్ పెంచేందుకు ప్రిమియర్స్కు రెడీ అయిపోతున్నాయి టీమ్స్. ఈ వీకెండ్లో అయిదు తెలుగు చిత్రాలు రిలీజవుతుండగా.. అందులో మూడింటికి ప్రిమియర్స్ కన్ఫమ్ అయ్యాయి. క్రిస్మస్ సినిమాలన్నీ గురువారమే రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
వీటిలో శివాజీ, నవదీప్, నందు, బిందుమాధవి ప్రధాన పాత్రలు పోషించిన ‘దండోరా’ సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ప్రిమియర్స్కు వెళ్తోంది. మంగళవారం రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెయిడ్ ప్రిమియర్స్ వేస్తున్నారు. తర్వాతి రోజు రెండు సినిమాలకు ప్రిమియర్స్ పడుతున్నాయి.
ఆది సాయికుమార్ కెరీర్లో గేమ్ చేంజర్గా భావిస్తున్న ‘శంబాల’కు బుధవారం వేయబోతున్న ప్రిమియర్స్కు బుకింగ్స్ కూడా ఓపెనయ్యాయి. స్పందన చాలా బాగుంది. అదే రోజు హార్రర్ మూవీ ‘ఈషా’కు కూడా ప్రిమియర్స్ వేయబోతున్నారు. ‘పతంగ్’, ‘బ్యాడ్ గర్ల్స్’ సినిమాల సంగతేంటో తెలియదు. ఈ వారం వస్తున్న వాటిలో అత్యధిక అంచనాలున్న రోషన్ మేక సినిమా ‘ఛాంపియన్’కు మాత్రం ప్రిమియర్స్ ఏమీ లేనట్లే ఉన్నాయి. ఐతే మిగతా సినిమాలను చూసి దానికి కూడా స్పెషల్ షోలు ప్లాన్ చేస్తే ఆశ్చర్యం లేదు.
This post was last modified on December 23, 2025 10:58 am
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…