Political News

కేసీఆర్‌ను బ‌య‌ట‌కు లాగి.. క‌విత గెలవగలరా?

సెంటిమెంటుకు-రాజ‌కీయాల‌కు మ‌ధ్య స‌యామీ క‌వ‌ల‌ల‌కు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాద‌ని నాయ‌కులు రాజ‌కీయాలు చేయ‌గ‌ల‌రా?  సాధ్యంకాదు. సో.. అలాంటి సెంటిమెంటు అస్త్ర‌మే కేసీఆర్‌. ఆయ‌న ఇప్పుడు యాక్టివ్‌గా లేక‌పోవ‌చ్చు. కానీ, కేసీఆర్ అంటే ఒక సెంటి మెంటు. ఒక భావొద్వేగం!. అలాంటి కేసీఆర్‌ను కాద‌ని బ‌య‌ట‌కు వ‌చ్చారు ఆయ‌న‌ కుమార్తె క‌విత‌. జ‌న జాగృతి పేరుతో యాత్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ అవ‌స‌రం లేద‌ని కూడా చెప్పారు.

ఈ క్ర‌మంలో నెమ్మ‌ది నెమ్మ‌దిగా.. త‌న తండ్రి ఫొటోల‌ను.. బీఆర్ఎస్ ప‌తాకాన్ని కూడా క‌విత ప‌క్క‌న పెడుతూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో త‌నంత‌ట తానుగా రాజ‌కీయాల్లో ఎదిగేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే.. ఎక్క‌డికి వెళ్లినా.. క‌వితను కేసీఆర్ కుమార్తెగానే చూస్తున్నారు!. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. రేపు ఆమెకు ఓట్లు రావాల‌న్నా.. తండ్రి ఇమేజ్‌తోనే ప‌డాలి.. అన్న వాద‌న కూడా ఉంది. సో.. మొత్తం గా క‌విత ఎంత కాద‌న్నా.. ఔన‌న్నా.. కేసీఆర్ సెంటిమెంటుపైనే ఆయ‌న ప‌డ‌వ సాగాలి.

కానీ.. ఇప్పుడు క‌విత అదే కేసీఆర్‌ను ప‌రోక్షంగా టార్గెట్ చేయ‌డంతోపాటు.. రెండు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు. 1) 2014 నుంచి భారీ ఎత్తున దోచుకున్నార‌ని ఆమె వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వ భూముల‌ను, ప్రై వేటు భూముల‌ను కూడా త‌మ‌కు అవ‌కాశంగా మార్చుకున్నార‌ని.. క‌బ్జాలు చేశార‌ని కూడా ఆమె వ్యాఖ్యానించారు. 2) తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో బెదిరించి డ‌బ్బు దోచుకున్నార‌ని బాంబు పేల్చారు. అయితే.. ఈ రెండు కూడా ప‌రోక్షంగా కేసీఆర్‌కు త‌గులుతున్న దెబ్బ‌లే కావ‌డం గ‌మ‌నార్హం.

ఇలా కేసీఆర్‌ను టార్గెట్ చేసి.. క‌విత ఏమేర‌కు స‌క్సెస్ అవుతారు? అనేది ప్ర‌శ్న‌. రాజ‌కీయాల్లో టార్గెట్లు, కౌంటర్లు కామ‌నే అయినా.. సెంటిమెంటుతో బంధం అల్లుకున్న కేసీఆర్, వారి పాలనా కాలాన్ని టార్గెట్ చేసుకుంటే.. ఇత‌ర పార్టీల‌కేమో కానీ.. బీఆర్ఎస్‌లో పుట్టి, బీఆర్ఎస్‌లో పెరిగి, ఎదిగిన‌ క‌విత.. ఇప్పుడు తండ్రి పాల‌న పైనే విచార‌ణ చేయిస్తాన‌ని, ఉద్య‌మ స‌మ‌యంలో సొమ్ము దోచుకున్నార‌ని చెప్పి.. యాగీ చేయడం ద్వారా సాధించేది ఏమీ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Kumar

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

25 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

9 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

11 hours ago