భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు మాత్రం నాయకుడే కాదు.. పార్టీ పేరు కూడా అత్యంత కీలకం. ప్రజల మధ్య.. ప్రజల చేత గుర్తింపు పొందిన పార్టీగా బీఆర్ఎస్ పేరు తెచ్చుకుంది. ఉద్యమ సమయంలో ప్రజలు ఏకమై.. పార్టీని తమదిగా భావించారు. ఇంటింటా పార్టీ జెండా ఎగిరిన గ్రామాలు కూడా ఉన్నాయి. పార్టీ అధినేతగా కేసీఆర్కు పెద్ద ఎత్తున అభిమానం కూడా లభించింది.
అయితే… ఇది గతం!. ప్రస్తుతంలోకి వస్తే.. పార్టీ ప్రాభవం తగ్గుతోంది. ఒకప్పుడు జెండాలు ఎగిరిన గ్రామాల్లో ఇప్పుడు పార్టీ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారుతోంది. వరుస విజయాలు అందించిన బీఆర్ఎస్ను ప్రజలు పక్కన పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో.. పార్టీ పరిస్థితి ఇబ్బందిగా అడుగులు వేయడం స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ పరిస్థితిని మార్చుకుని అడుగులు వేయా ల్సిన అవసరం బీఆర్ఎస్కు ఎంతో ఉందన్నది వాస్తవం.
కేసీఆర్ కోసం.. ఎంత మంది?
ఒకప్పుడు కేసీఆర్ పేరు ప్రతి నోటా వినిపించింది. ప్రతి ఒక్కరూ `కేసీఆర్ సర్` అని ఎంతో గౌరవంగా పిలు చుకునేవారు. కానీ, గత ఎన్నికల తర్వాత.. పార్టీ ఈ తరహా పరిస్థితిని కోల్పోయింది. పైకి అంతా బాగుందని చెబుతున్నా.. ప్రస్తుతం పార్టీ పరిస్థితి మేడిపండుగా మారిందన్న వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ కోసం ఎంత మంది నిలబడుతున్నారన్న వాదన.. తెరమీదికి వస్తే.. చెప్పడం కష్టంగా మారింది. ఇప్పుడు ఆయన కోసం పెద్దగా ప్రజలు నిలబడే పరిస్తితి రావడం లేదు.
వ్యక్తి ఆధిపత్యం నుంచి..
వ్యక్తి ఆధిపత్యాన్ని ఉద్యమ సమయంలో అంగీకరించిన తెలంగాణ ప్రజలు ఆనాడు కేసీఆర్ ఏం చెబితే అదే వేదంగా పనిచేశారు. ఊరూవాడా కేసీఆర్ కోసం నిలబడ్డాయి. కానీ.. ఇప్పుడు అదే వ్యక్తి ఆధిపత్యాన్ని తిరస్కరిస్తున్నారు. రాష్ట్రం కోసం ఏకమైన ప్రజలు.. కేసీఆర్ కోసం.. ఏకం అయ్యేందుకు ససేమిరా అంటున్నారు. ఈ తేడాను పార్టీ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇంకా కేసీఆర్ జపం చేసుకుంటూ.. క్షేత్రస్థాయి ప్రజల మనోభావాలను గమనించకపోతే.. గత ప్రాభవం మరింత దెబ్బతింటుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 12, 2025 10:00 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…