భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు మాత్రం నాయకుడే కాదు.. పార్టీ పేరు కూడా అత్యంత కీలకం. ప్రజల మధ్య.. ప్రజల చేత గుర్తింపు పొందిన పార్టీగా బీఆర్ఎస్ పేరు తెచ్చుకుంది. ఉద్యమ సమయంలో ప్రజలు ఏకమై.. పార్టీని తమదిగా భావించారు. ఇంటింటా పార్టీ జెండా ఎగిరిన గ్రామాలు కూడా ఉన్నాయి. పార్టీ అధినేతగా కేసీఆర్కు పెద్ద ఎత్తున అభిమానం కూడా లభించింది.
అయితే… ఇది గతం!. ప్రస్తుతంలోకి వస్తే.. పార్టీ ప్రాభవం తగ్గుతోంది. ఒకప్పుడు జెండాలు ఎగిరిన గ్రామాల్లో ఇప్పుడు పార్టీ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారుతోంది. వరుస విజయాలు అందించిన బీఆర్ఎస్ను ప్రజలు పక్కన పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో.. పార్టీ పరిస్థితి ఇబ్బందిగా అడుగులు వేయడం స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ పరిస్థితిని మార్చుకుని అడుగులు వేయా ల్సిన అవసరం బీఆర్ఎస్కు ఎంతో ఉందన్నది వాస్తవం.
కేసీఆర్ కోసం.. ఎంత మంది?
ఒకప్పుడు కేసీఆర్ పేరు ప్రతి నోటా వినిపించింది. ప్రతి ఒక్కరూ `కేసీఆర్ సర్` అని ఎంతో గౌరవంగా పిలు చుకునేవారు. కానీ, గత ఎన్నికల తర్వాత.. పార్టీ ఈ తరహా పరిస్థితిని కోల్పోయింది. పైకి అంతా బాగుందని చెబుతున్నా.. ప్రస్తుతం పార్టీ పరిస్థితి మేడిపండుగా మారిందన్న వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ కోసం ఎంత మంది నిలబడుతున్నారన్న వాదన.. తెరమీదికి వస్తే.. చెప్పడం కష్టంగా మారింది. ఇప్పుడు ఆయన కోసం పెద్దగా ప్రజలు నిలబడే పరిస్తితి రావడం లేదు.
వ్యక్తి ఆధిపత్యం నుంచి..
వ్యక్తి ఆధిపత్యాన్ని ఉద్యమ సమయంలో అంగీకరించిన తెలంగాణ ప్రజలు ఆనాడు కేసీఆర్ ఏం చెబితే అదే వేదంగా పనిచేశారు. ఊరూవాడా కేసీఆర్ కోసం నిలబడ్డాయి. కానీ.. ఇప్పుడు అదే వ్యక్తి ఆధిపత్యాన్ని తిరస్కరిస్తున్నారు. రాష్ట్రం కోసం ఏకమైన ప్రజలు.. కేసీఆర్ కోసం.. ఏకం అయ్యేందుకు ససేమిరా అంటున్నారు. ఈ తేడాను పార్టీ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇంకా కేసీఆర్ జపం చేసుకుంటూ.. క్షేత్రస్థాయి ప్రజల మనోభావాలను గమనించకపోతే.. గత ప్రాభవం మరింత దెబ్బతింటుందని అంటున్నారు పరిశీలకులు.
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…