తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక మలుపు తిరిగాయి. కొందరు అభ్యర్థులు.. ప్రజలను ఆకర్షించేందుకు ఓటుకు నోటు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా ధ్రువీకరించారు. నగదు పంపిణీని పూర్తిగాని లువరించలేక పోయామనికూడా ఒప్పుకొన్నారు. అయినప్పటికీ.. 8.9 కోట్ల రూపాయల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే.. తొలి విడత ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ కూడా పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆయా పంచాయతీల్లో గెలిచిన వారి పరిస్థితి ఎలా ఉన్నా.. ఓడిన వారు మాత్రం నిప్పులు చెరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి.. “మీరు మాకు ఓటేయలేదు. మేం ఇచ్చిన సొమ్మును మాకు తిరిగి ఇవ్వండి“ అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం వివాదాలకు, ఘర్షణలకు దారి తీసింది. కొందరు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. వాస్తవానికి ఎన్నికల్లో నగదు పంచడం అనేది నేరం. పైగా పంచాయతీ ఎన్నికలకు కూడా సాధారణ ఎన్నికల మాదిరిగా నగదు పంపిణీ చేశారు. ఓటుకు 500 చొప్పున ఇచ్చిన వారు కూడా ఉన్నారు.
మరికొందరు.. కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. ఒక్కొక్క ఇంటికీ రూ.1000-1500 వరకు పంచారు. కానీ, ఇలా పంచిన వారు కొన్ని చోట్ల ఓడిపోయారు. దీంతో వారంతా ఇప్పుడు ఓటర్ల ఇళ్లకు వెళ్లి తమ సొమ్మును తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని సోమ్లాతండాలో ఎమ్మెల్యే మురళీ నాయక్ సోదరుడి భార్య పంచాయతీ సర్పంచ్గా పోటీ చేశారు. ఈమె తనకున్న ఆర్థిక బలంతో నగదు పంపిణీ చేశారు. కానీ, ఓడిపోయారు. దీంతో ఇంటింటికీ వెళ్లి తనకు సొమ్ము తిరిగి ఇచ్చేయాలని కోరారు. లేకపోతే.. తనకే ఓటే వేసినట్టు దేవుడిపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.
ఇక, వర్ధన్నపేటలో మరో అభ్యర్థి.. తాను 600 మందికి డబ్బులు పంచానని, కానీ, తనకు 55 ఓట్లు మాత్రమే పడ్డాయని.. మిగిలి 545 మంది తనకు సొమ్ము తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఓటర్లు కూడా.. అభ్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. “మీరు ఇస్తేనే మేం తీసుకున్నా.. మా అంతట మేమొచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగామా?“ అని ప్రశ్నించారు.
This post was last modified on December 12, 2025 9:54 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…