తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక మలుపు తిరిగాయి. కొందరు అభ్యర్థులు.. ప్రజలను ఆకర్షించేందుకు ఓటుకు నోటు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా ధ్రువీకరించారు. నగదు పంపిణీని పూర్తిగాని లువరించలేక పోయామనికూడా ఒప్పుకొన్నారు. అయినప్పటికీ.. 8.9 కోట్ల రూపాయల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే.. తొలి విడత ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ కూడా పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆయా పంచాయతీల్లో గెలిచిన వారి పరిస్థితి ఎలా ఉన్నా.. ఓడిన వారు మాత్రం నిప్పులు చెరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి.. “మీరు మాకు ఓటేయలేదు. మేం ఇచ్చిన సొమ్మును మాకు తిరిగి ఇవ్వండి“ అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం వివాదాలకు, ఘర్షణలకు దారి తీసింది. కొందరు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. వాస్తవానికి ఎన్నికల్లో నగదు పంచడం అనేది నేరం. పైగా పంచాయతీ ఎన్నికలకు కూడా సాధారణ ఎన్నికల మాదిరిగా నగదు పంపిణీ చేశారు. ఓటుకు 500 చొప్పున ఇచ్చిన వారు కూడా ఉన్నారు.
మరికొందరు.. కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. ఒక్కొక్క ఇంటికీ రూ.1000-1500 వరకు పంచారు. కానీ, ఇలా పంచిన వారు కొన్ని చోట్ల ఓడిపోయారు. దీంతో వారంతా ఇప్పుడు ఓటర్ల ఇళ్లకు వెళ్లి తమ సొమ్మును తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని సోమ్లాతండాలో ఎమ్మెల్యే మురళీ నాయక్ సోదరుడి భార్య పంచాయతీ సర్పంచ్గా పోటీ చేశారు. ఈమె తనకున్న ఆర్థిక బలంతో నగదు పంపిణీ చేశారు. కానీ, ఓడిపోయారు. దీంతో ఇంటింటికీ వెళ్లి తనకు సొమ్ము తిరిగి ఇచ్చేయాలని కోరారు. లేకపోతే.. తనకే ఓటే వేసినట్టు దేవుడిపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.
ఇక, వర్ధన్నపేటలో మరో అభ్యర్థి.. తాను 600 మందికి డబ్బులు పంచానని, కానీ, తనకు 55 ఓట్లు మాత్రమే పడ్డాయని.. మిగిలి 545 మంది తనకు సొమ్ము తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఓటర్లు కూడా.. అభ్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. “మీరు ఇస్తేనే మేం తీసుకున్నా.. మా అంతట మేమొచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగామా?“ అని ప్రశ్నించారు.
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…