Political News

స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కు షాక్

గత కొద్ది నెలలుగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో కరోనా ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో 2021 ఫిబ్రవరిలో లోకల్ వార్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడీ అవుతున్నారు. అయితే, కరోనాను సాకుగా చూపుతూ ఎన్నికలు వాయిదా వేయాలని జగన్ సర్కార్ సాకులు చెబుతోంది. ఎన్నికల నిర్వహణ వ్యవహారం కోర్టులో ఉండగానే ఏపీ ప్రభుత్వం మరో ఏకపక్ష నిర్ణయం విమర్శలకు తావిచ్చింది.

కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశమున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీర్మానం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల నిర్వహణ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది.

ఫిబ్రవరిలో రాష్ట్ర ఎన్నికల సంఘం జరపదలిచిన స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమంటూ ఏపీ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నిర్వహణ నిలిపివేయాలంటూ స్టే ఇవ్వడం సాధ్యం కాదంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో తదుపరి విచారణను ఈ నెల 14కు హైకోర్టు వాయిదా వేసింది.

This post was last modified on December 9, 2020 7:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

టబు పాత్రను హీరో తగ్గించాడా?

బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…

5 hours ago

బయటికి ఎప్పుడు వస్తావ్ జన నాయకా

నాలుగు నెలల నుంచి విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్న జన నాయకుడు వ్యవహారాలు మెల్లగా ఒక్కొక్కటి కొలిక్కి వస్తున్నాయి. మే…

7 hours ago

సత్య ఇంకొంచెం శ్రద్ధ పెడితే

జెట్లీ ఫలితం ఏమైందనేది కాసేపు పక్కనపెడితే కమెడియన్ సత్య క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఏంటో నిన్న ఓపెనింగ్స్ తో అర్థమయ్యింది.…

8 hours ago

ప‌వ‌న్‌కు బాబు ప‌రామ‌ర్శ‌.. పిఠాపురంపై చ‌ర్చ‌?!

జ‌న‌సేన అధినేత‌,ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను సీఎం చంద్ర‌బాబు పరామ‌ర్శించారు. కొన్నాళ్ల కింద‌ట ముక్కుకు ఆప‌రేషన్ అయిన నేప‌థ్యంలో…

8 hours ago

తడబడుతున్న మమిత బైజు అడుగులు

రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…

10 hours ago

ఛాన్స్ ఇచ్చిన దర్శకుడి పేరు కూతురికి పెడితే?

సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…

10 hours ago