బాక్సాఫీస్ దగ్గరే కాదు.. సోషల్ మీడియాలో కూడా తాను సూపర్ స్టార్నే అని మహేష్ బాబు మరోసారి రుజువు చేశాడు. 2020 సంవత్సరం చివరికి వచ్చిన నేపథ్యంలో వివిధ అంశాల్లో ఈ ఏడాది టాప్లో నిలిచిన హ్యాష్ ట్యాగ్స్, ఫొటోలు, వీడియోలు, పోస్టుల గురించి ట్విట్టర్ వివరాలు వెల్లడిస్తోంది. ఈ ఏడాది ఇండియా మొత్తంలో టాప్-3లో నిలిచిన సినిమా ట్యాగ్స్లో మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’కు సంబంధించింది ఒకటి ఉండటం విశేషం.
అనూహ్య రీతిలో మరణించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి సినిమా ‘దిల్ బేచారా’ హ్యాష్ ట్యాగ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. సుశాంత్ మరణానంతరం రిలీజైన అతడి చివరి సినిమా గురించి విపరీతమైన చర్చ జరిగిన నేపథ్యంలో ఆ హ్యాష్ ట్యాగ్ అగ్ర స్థానంలో నిలవడంలో ఆశ్చర్యం లేదు. అలాగే కరోనా అనంతరం ఇండియాలో రిలీజైన సినిమాలన్నింట్లోకి ఉత్తమమైన ఫలితం అందుకున్న ‘సూరారై పొట్రు’ గురించి కూడా పెద్ద చర్చే నడిచిన నేపథ్యంలో అది రెండో స్థానం సాధించింది. మూడో స్థానం ‘సరిలేరు నీకెవ్వరు’కే దక్కింది.
అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురములో’ దీన్ని మించి విజయం సాధించినప్పటికీ, బాలీవుడ్ మూవీ ‘తానాజీ’ ఈ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్గా నిలిచినప్పటికీ.. వాటిని మించి ‘సరిలేరు..’ హ్యాష్ ట్యాగ్ పైన నిలవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. టాలీవుడ్కు సంబంధించి వరుసగా మూడేళ్లూ మహేష్ సినిమాల హ్యాష్ ట్యాగ్లే నంబర్ వన్గా నిలవడం విశేషం. 2018లో ‘భరత్ అనే నేను’, 2019లో ‘మహర్షి’ హ్యాష్ ట్యాగ్లు టాప్లో నిలిచాయి. దీన్ని బట్టి మహేష్ బాబు స్టార్ పవర్ ఎలాంటిదో.. సోషల్ మీడియాలో అతడికున్న ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే అతను అసలైన ‘సూపర్ స్టార్’ అనడంలో సందేహం లేదు.
This post was last modified on December 8, 2020 2:09 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…