బాక్సాఫీస్ దగ్గరే కాదు.. సోషల్ మీడియాలో కూడా తాను సూపర్ స్టార్నే అని మహేష్ బాబు మరోసారి రుజువు చేశాడు. 2020 సంవత్సరం చివరికి వచ్చిన నేపథ్యంలో వివిధ అంశాల్లో ఈ ఏడాది టాప్లో నిలిచిన హ్యాష్ ట్యాగ్స్, ఫొటోలు, వీడియోలు, పోస్టుల గురించి ట్విట్టర్ వివరాలు వెల్లడిస్తోంది. ఈ ఏడాది ఇండియా మొత్తంలో టాప్-3లో నిలిచిన సినిమా ట్యాగ్స్లో మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’కు సంబంధించింది ఒకటి ఉండటం విశేషం.
అనూహ్య రీతిలో మరణించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి సినిమా ‘దిల్ బేచారా’ హ్యాష్ ట్యాగ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. సుశాంత్ మరణానంతరం రిలీజైన అతడి చివరి సినిమా గురించి విపరీతమైన చర్చ జరిగిన నేపథ్యంలో ఆ హ్యాష్ ట్యాగ్ అగ్ర స్థానంలో నిలవడంలో ఆశ్చర్యం లేదు. అలాగే కరోనా అనంతరం ఇండియాలో రిలీజైన సినిమాలన్నింట్లోకి ఉత్తమమైన ఫలితం అందుకున్న ‘సూరారై పొట్రు’ గురించి కూడా పెద్ద చర్చే నడిచిన నేపథ్యంలో అది రెండో స్థానం సాధించింది. మూడో స్థానం ‘సరిలేరు నీకెవ్వరు’కే దక్కింది.
అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురములో’ దీన్ని మించి విజయం సాధించినప్పటికీ, బాలీవుడ్ మూవీ ‘తానాజీ’ ఈ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్గా నిలిచినప్పటికీ.. వాటిని మించి ‘సరిలేరు..’ హ్యాష్ ట్యాగ్ పైన నిలవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. టాలీవుడ్కు సంబంధించి వరుసగా మూడేళ్లూ మహేష్ సినిమాల హ్యాష్ ట్యాగ్లే నంబర్ వన్గా నిలవడం విశేషం. 2018లో ‘భరత్ అనే నేను’, 2019లో ‘మహర్షి’ హ్యాష్ ట్యాగ్లు టాప్లో నిలిచాయి. దీన్ని బట్టి మహేష్ బాబు స్టార్ పవర్ ఎలాంటిదో.. సోషల్ మీడియాలో అతడికున్న ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే అతను అసలైన ‘సూపర్ స్టార్’ అనడంలో సందేహం లేదు.
This post was last modified on December 8, 2020 2:09 pm
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…