బాక్సాఫీస్ దగ్గరే కాదు.. సోషల్ మీడియాలో కూడా తాను సూపర్ స్టార్నే అని మహేష్ బాబు మరోసారి రుజువు చేశాడు. 2020 సంవత్సరం చివరికి వచ్చిన నేపథ్యంలో వివిధ అంశాల్లో ఈ ఏడాది టాప్లో నిలిచిన హ్యాష్ ట్యాగ్స్, ఫొటోలు, వీడియోలు, పోస్టుల గురించి ట్విట్టర్ వివరాలు వెల్లడిస్తోంది. ఈ ఏడాది ఇండియా మొత్తంలో టాప్-3లో నిలిచిన సినిమా ట్యాగ్స్లో మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’కు సంబంధించింది ఒకటి ఉండటం విశేషం.
అనూహ్య రీతిలో మరణించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి సినిమా ‘దిల్ బేచారా’ హ్యాష్ ట్యాగ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. సుశాంత్ మరణానంతరం రిలీజైన అతడి చివరి సినిమా గురించి విపరీతమైన చర్చ జరిగిన నేపథ్యంలో ఆ హ్యాష్ ట్యాగ్ అగ్ర స్థానంలో నిలవడంలో ఆశ్చర్యం లేదు. అలాగే కరోనా అనంతరం ఇండియాలో రిలీజైన సినిమాలన్నింట్లోకి ఉత్తమమైన ఫలితం అందుకున్న ‘సూరారై పొట్రు’ గురించి కూడా పెద్ద చర్చే నడిచిన నేపథ్యంలో అది రెండో స్థానం సాధించింది. మూడో స్థానం ‘సరిలేరు నీకెవ్వరు’కే దక్కింది.
అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురములో’ దీన్ని మించి విజయం సాధించినప్పటికీ, బాలీవుడ్ మూవీ ‘తానాజీ’ ఈ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్గా నిలిచినప్పటికీ.. వాటిని మించి ‘సరిలేరు..’ హ్యాష్ ట్యాగ్ పైన నిలవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. టాలీవుడ్కు సంబంధించి వరుసగా మూడేళ్లూ మహేష్ సినిమాల హ్యాష్ ట్యాగ్లే నంబర్ వన్గా నిలవడం విశేషం. 2018లో ‘భరత్ అనే నేను’, 2019లో ‘మహర్షి’ హ్యాష్ ట్యాగ్లు టాప్లో నిలిచాయి. దీన్ని బట్టి మహేష్ బాబు స్టార్ పవర్ ఎలాంటిదో.. సోషల్ మీడియాలో అతడికున్న ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే అతను అసలైన ‘సూపర్ స్టార్’ అనడంలో సందేహం లేదు.
This post was last modified on December 8, 2020 2:09 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…