Political News

త‌మిళ‌నాడులో ‘బీహార్ గాలి’: మోడీ

రాజ‌కీయ విశ్లేష‌కులు ఊహించిందే జ‌రిగింది. త‌మిళ‌నాడులో ప‌ర్య‌టించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఖ‌చ్చితంగా ఎన్నిక‌ల వ్యూహాన్ని ఆవిష్క‌రిస్తార‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేశారు. వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌మిళ‌నాడులో ఆయ‌న ప‌ర్య‌ట‌న పెట్టుకోవ‌డం కూడా కీల‌క వ్యూహ‌మేన‌ని చెప్పారు. దీనిని నిజం చేసిన‌ట్టుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఇటీవ‌ల బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎన్డీయే సాధించిన ఘ‌న విజ‌యాన్ని ప్ర‌స్తావించారు. అంతేకాదు.. ఎన్నిక‌ల‌కు చాలా ముందే.. త‌మిళ‌నాడు లో బీహార్ గాలి(బీహార్ హ‌వా) వీస్తోంద‌ని వ్యాఖ్యానించారు.

పీఎం-కిసాన్ యోజ‌న కింద దేశ‌వ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం రూ.2000 చొప్పున ఆర్థిక సాయం చేసింది. దీనికి సంబంధించి త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు జిల్లాలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు రైతుల నుంచి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. వారి మెడ‌లోని కండువాల‌నుతీసి.. గాలిలో తిప్పుతూ.. ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌లికారు.(ఇది ముందుగానే నేర్పించార‌ని అధికార‌పార్టీ డీఎంకే విమ‌ర్శించింది.) అనంత‌రం.. ప్ర‌ధాని పీఎం-కిసాన్ నిధుల‌ను విడుద‌ల చేశారు. అదేవిధంగా ఓ స‌ద‌స్సును కూడా ఆయ‌న ప్రారంభించారు.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. త‌మిళ‌నాడులోనూ బీహార్ గాలి వీస్తోంద‌ని.. న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. త‌ను రావ‌డానికి ముందుగానే బీహార్ గాలి.. త‌మిళ‌నాడును చుట్టేసింద‌ని చ‌మ‌త్క‌రించారు. ఇక్క‌డి రైతులు చాలా తెలివైన వార‌ని వ్యాఖ్యానించారు. ఇక్క‌డి జైళి ప‌రిశ్ర‌మ ద్వారా దేశానికి ఎంతో ఆదాయం చేకూరుతోంద‌న్నారు. ఇదేస‌మ‌యంలో కోయంబ‌త్తూరు వాసి.. సీపీ రాధాకృష్ణ‌న్ ని ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఎంపిక చేసి.. ఈ ప్రాంతానికి, ఈ నేల‌కు మ‌రింత గౌర‌వం తీసుకువ‌చ్చామ‌ని.. ప్ర‌ధాని చెప్పుకొచ్చారు.(దీనిని కూడా విశ్లేష‌కులు ముందుగానే అంచ‌నా వేశారు.) గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు.. వ్యవ‌సాయాన్ని మించిన రంగం లేద‌న్నారు.

కాగా.. బీహార్‌లో ఎన్డీయే కూట‌మి ఇటీవ‌ల ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్, కేర‌ళ‌ స‌హా ప‌లు రాష్ట్రాల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ను బీజేపీ కీల‌కంగా భావిస్తోంది. ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్ర‌మైన త‌మిళ‌నాడులో పాగా వేసేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే గ‌త మూడేళ్లుగా నిర్వ‌హిస్తున్న కాశీ త‌మిళ సంగం, రాధాకృష్ణ‌న్‌ను ఉప రాష్ట్ర‌ప‌తిని చేయ‌డం వంటి విష‌యాల‌తో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న సాగింద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.

This post was last modified on November 19, 2025 9:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

7 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

7 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

8 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

9 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

10 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

11 hours ago