Political News

టీడీపీ ఎమ్మెల్యే డిజిట‌ల్ అరెస్టు: బ్యాంకు మేనేజ‌ర్ మోసం

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే, మైదుకూరు శాస‌న స‌భ్యుడు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌..(ఈయ‌న పార్టీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి వియ్యంకుడు)ను కొన్నాళ్ల కింద‌ట సైబ‌ర్ నేర‌గాళ్లు.. డిజిట‌ల్ అరెస్టు చేసిన‌విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో ఈ ఘ‌ట‌న తీవ్ర‌స్థాయిలో క‌ల‌క‌లం రేపింది. ఈ క్ర‌మంలో ఏకంగా 1.7 కోట్ల రూపాయ‌ల సొత్తును సైబ‌ర్ నేర‌స్తులు దోచుకున్నారు. అయితే.. దీనిపై సైబ‌ర్ పోలీసుల‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. దీనిపై కూపీలాగిన పోలీసులు తాజాగా ఏడుగురు నిందితుల‌ను అరెస్టు చేశారు.

వీరిలో ప్రైవేటు ఆర్థిక సంస్థ ఐడీఎఫ్‌సీ బ్యాంకు మేనేజ‌ర్ కూడా ఉన్న‌ట్టు పోలీసులు తెలిపారు. సైబ‌ర్ నేర‌స్థుల‌తో చేతులు క‌లిపిన మేనేజ‌ర్ డ‌బ్బు ఆశ కోసం.. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌ట్టు చెప్పారు. ఢిల్లీలోని ఐడీఎఫ్‌సీ బ్యాంకులో మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్న వ్య‌క్తి .. బ్యాంకు ఆధారాల‌తో పుట్టా సుధాక‌ర్‌ను మోస‌గించిన‌ట్టు వివ‌రించారు. అయితే.. ఏ బ్యాంకు నుంచి సొమ్ముల‌ను త‌ర‌లించారు? వాటిని ఎక్క‌డికి మ‌ళ్లించారు? అనే విష‌యాల‌ను పోలీసులు గోప్యంగా ఉంచారు. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన సైబ‌ర్ నేరాల్లో ఈయ‌న పాత్ర‌పై కూడా ఆరా తీస్తున్నారు. ఈయ‌న‌తోపాటు మ‌రో ఏడుగురు నిందితుల‌ను కూడా అరెస్టు చేసిన‌ట్టు విజ‌య‌వాడ‌లోని సైబ‌ర్ పోలీసులు చెప్పారు.

ఇదిలావుంటే.. దేశ‌వ్యాప్తంగా డిజిట‌ల్ అరెస్టులు పెరుగుతున్నాయ‌ని పోలీసులు తెలిపారు. వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగుల‌ను టార్గెట్ చేసుకుని డిజిట‌ల్ అరెస్టులు చేస్తున్నార‌ని చెప్పారు. ఎవ‌రూ ఇలాంటి విష‌యాల్లో భ‌యానికి గురి కావాల్సిన అవ‌స‌రం లేద‌ని… విష‌యాన్నిపోలీసుల‌కు చెబితే చాల‌ని తెలిపారు. కానీ, భ‌యాందోళ‌న‌ల‌తో డిజిట‌ల్ అరెస్టును సీరియ‌స్‌గా తీసుకుంటున్నార‌ని.. ఇదే సైబ‌ర్ నేర‌స్తుల‌కు వ‌రంగా మారుతోంద‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అనేక డిజిట‌ల్ అరెస్టుల్లో 55 ఏళ్లు పైబ‌డిన వారే ఉన్నార‌ని.. ఎక్కువ‌గా 60-75 ఏళ్లున్న వారు ఉన్నార‌ని చెప్పారు. కాగా… ఇదే విష‌యాన్ని తాజాగా న‌టుడు అక్కినేని నాగార్జున కూడా చెప్పారు. త‌న కుటుంబంలోనూ ఒక‌రు డిజిట‌ల్ అరెస్టు అయ్యార‌ని.. అన్నారు. అయితే,ఆయ‌న వివ‌రాలు చెప్ప‌లేదు.

This post was last modified on November 18, 2025 11:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

2 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

3 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

4 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

5 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

5 hours ago

‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…

5 hours ago