Political News

విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎవరేం చేశారు?

విశాఖలో ఐసీసీ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. చివరిరోజు విశాఖ ఉక్కు పరిశ్రమపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అయ్యింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేసాయో చెబుతూ, ప్రజాధనం కాపాడటానికి కార్మికులు కూడా బాధ్యతగా పని చేయాలని చంద్రబాబు చెప్పారు. ఇంత స్పష్టంగా చెప్పిన దాన్ని వక్రీకరించి ఫేక్ ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఆరోపణ.

వైసీపీ ఐదేళ్ల పాలనలో విశాఖ ఉక్కుని తుక్కు కింద పోస్కోకి అమ్మేద్దామని వైఎస్ జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారని టీడీపీ చెబుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని కేంద్రంతోనే ప్రకటన చేయించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు 12 వేల కోట్ల ప్యాకేజీ సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2600 కోట్లు ఇచ్చారు.

“రూ. 12 వేల కోట్ల ప్రజాధనం స్టీల్ ప్లాంట్‌లో ప్రభుత్వాలు పెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 2,600 కోట్లు పెట్టింది. ప్రజాధనం వృథా కాకుండా, అందరం బాధ్యతగా పని చేద్దాం అని చంద్రబాబు గారు చెప్తే, దానిని కూడా వక్రీకరించి జగన్ ఫేక్ ప్రచారం చేస్తున్నాడు.” అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వివరించారు.

ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఎవరేమి చేశారో వివరిస్తూ టీడీపీ ఒక పోస్టర్ విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం పోస్కో కి అమ్మే ప్రయత్నం చేయగా కూటమి ప్రభుత్వం ప్రైవేట్ అవ్వబోదని కేంద్రంతో ప్రకటన చేయించింది. రెవినల్ ప్యాకేజ్ కింద 12 వేల కోట్లు సాధించింది. రాష్ట్ర ప్రభుత్వ సాయంగా రూ.2,600 కోట్లు అందించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లాంటి ఉత్పత్తి సామర్థ్యం 20 శాతం మాత్రమే కాగా, నేటి ప్రభుత్వంలో అది 79 శాతానికి పెరిగింది. అప్పట్లో ఒకటి బ్లాస్ట్ ఫర్నేస్ పని చేసేది. ఇప్పుడు మూడు పని చేస్తున్నాయి. మొత్తం మీద ప్యాకేజీ ఇచ్చి ప్లాంటును లాభాల బాట పట్టించి, ఉద్యోగులకు బాబు నాయుడు అండగా నిలిచారని తెలుగుదేశం పార్టీ వివరించింది.

This post was last modified on November 18, 2025 9:22 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

42 minutes ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

3 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

4 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

4 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

5 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

5 hours ago