విశాఖలో ఐసీసీ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. చివరిరోజు విశాఖ ఉక్కు పరిశ్రమపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అయ్యింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేసాయో చెబుతూ, ప్రజాధనం కాపాడటానికి కార్మికులు కూడా బాధ్యతగా పని చేయాలని చంద్రబాబు చెప్పారు. ఇంత స్పష్టంగా చెప్పిన దాన్ని వక్రీకరించి ఫేక్ ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఆరోపణ.
వైసీపీ ఐదేళ్ల పాలనలో విశాఖ ఉక్కుని తుక్కు కింద పోస్కోకి అమ్మేద్దామని వైఎస్ జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారని టీడీపీ చెబుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని కేంద్రంతోనే ప్రకటన చేయించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు 12 వేల కోట్ల ప్యాకేజీ సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2600 కోట్లు ఇచ్చారు.
“రూ. 12 వేల కోట్ల ప్రజాధనం స్టీల్ ప్లాంట్లో ప్రభుత్వాలు పెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 2,600 కోట్లు పెట్టింది. ప్రజాధనం వృథా కాకుండా, అందరం బాధ్యతగా పని చేద్దాం అని చంద్రబాబు గారు చెప్తే, దానిని కూడా వక్రీకరించి జగన్ ఫేక్ ప్రచారం చేస్తున్నాడు.” అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వివరించారు.
ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఎవరేమి చేశారో వివరిస్తూ టీడీపీ ఒక పోస్టర్ విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం పోస్కో కి అమ్మే ప్రయత్నం చేయగా కూటమి ప్రభుత్వం ప్రైవేట్ అవ్వబోదని కేంద్రంతో ప్రకటన చేయించింది. రెవినల్ ప్యాకేజ్ కింద 12 వేల కోట్లు సాధించింది. రాష్ట్ర ప్రభుత్వ సాయంగా రూ.2,600 కోట్లు అందించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లాంటి ఉత్పత్తి సామర్థ్యం 20 శాతం మాత్రమే కాగా, నేటి ప్రభుత్వంలో అది 79 శాతానికి పెరిగింది. అప్పట్లో ఒకటి బ్లాస్ట్ ఫర్నేస్ పని చేసేది. ఇప్పుడు మూడు పని చేస్తున్నాయి. మొత్తం మీద ప్యాకేజీ ఇచ్చి ప్లాంటును లాభాల బాట పట్టించి, ఉద్యోగులకు బాబు నాయుడు అండగా నిలిచారని తెలుగుదేశం పార్టీ వివరించింది.
This post was last modified on November 18, 2025 9:22 am
మాములుగా టయర్ 2 హీరోలకు రెండు ఫ్లాపులు రాగానే నిర్మాతలు బడ్జెట్ లు తగ్గించేసి రిస్క్ లేని కథలను ఎంచుకుంటారు.…
వరుసగా నాలుగు బ్లాక్బస్టర్లతో కొరటాల శివ టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడిగా ఎదిగాడు. కానీ ఒకే ఒక్క ఫ్లాప్ ఆయన…
ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ అన్న అమ్మాయిలు.. పెయిడ్ సబ్స్క్రిప్సన్లు పెట్టి ఆ యూజర్లకు ఎక్స్క్లూజిక్ హాట్ కంటెంట్ ఇవ్వడం ద్వారా…
ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు కొత్త జీవితం లభించింది. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని, ఆమెకు…
సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకప్పుడు సౌత్ ఇండియాలో ఏ హీరోకూ అందని రేంజిలో ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్లు,…
సినీనటుడు ప్రకాష్ రాజ్పై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి పరువు నష్టం దావా దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. హిందువుల…