Political News

విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎవరేం చేశారు?

విశాఖలో ఐసీసీ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. చివరిరోజు విశాఖ ఉక్కు పరిశ్రమపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అయ్యింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేసాయో చెబుతూ, ప్రజాధనం కాపాడటానికి కార్మికులు కూడా బాధ్యతగా పని చేయాలని చంద్రబాబు చెప్పారు. ఇంత స్పష్టంగా చెప్పిన దాన్ని వక్రీకరించి ఫేక్ ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఆరోపణ.

వైసీపీ ఐదేళ్ల పాలనలో విశాఖ ఉక్కుని తుక్కు కింద పోస్కోకి అమ్మేద్దామని వైఎస్ జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారని టీడీపీ చెబుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని కేంద్రంతోనే ప్రకటన చేయించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు 12 వేల కోట్ల ప్యాకేజీ సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2600 కోట్లు ఇచ్చారు.

“రూ. 12 వేల కోట్ల ప్రజాధనం స్టీల్ ప్లాంట్‌లో ప్రభుత్వాలు పెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 2,600 కోట్లు పెట్టింది. ప్రజాధనం వృథా కాకుండా, అందరం బాధ్యతగా పని చేద్దాం అని చంద్రబాబు గారు చెప్తే, దానిని కూడా వక్రీకరించి జగన్ ఫేక్ ప్రచారం చేస్తున్నాడు.” అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వివరించారు.

ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఎవరేమి చేశారో వివరిస్తూ టీడీపీ ఒక పోస్టర్ విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం పోస్కో కి అమ్మే ప్రయత్నం చేయగా కూటమి ప్రభుత్వం ప్రైవేట్ అవ్వబోదని కేంద్రంతో ప్రకటన చేయించింది. రెవినల్ ప్యాకేజ్ కింద 12 వేల కోట్లు సాధించింది. రాష్ట్ర ప్రభుత్వ సాయంగా రూ.2,600 కోట్లు అందించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లాంటి ఉత్పత్తి సామర్థ్యం 20 శాతం మాత్రమే కాగా, నేటి ప్రభుత్వంలో అది 79 శాతానికి పెరిగింది. అప్పట్లో ఒకటి బ్లాస్ట్ ఫర్నేస్ పని చేసేది. ఇప్పుడు మూడు పని చేస్తున్నాయి. మొత్తం మీద ప్యాకేజీ ఇచ్చి ప్లాంటును లాభాల బాట పట్టించి, ఉద్యోగులకు బాబు నాయుడు అండగా నిలిచారని తెలుగుదేశం పార్టీ వివరించింది.

Kumar

Recent Posts

ఒక్క ఫొటో… అన్ని అనుమానాల‌కూ స‌మాధానం

ప్ర‌తి సంవ‌త్స‌రం విజ‌య్‌కి స్పెష‌ల్ పిక్‌తో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పే త్రిష‌.. ఈసారి చెప్ప‌లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆయ‌న్ని…

45 minutes ago

ఆ ఇద్దరూ కలిసి సాధించారు!

నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…

1 hour ago

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

3 hours ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

5 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

6 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

6 hours ago