బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఐసీటీ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఢాకా అల్లర్ల కేసులో హసీనాకు ఈ శిక్ష విధించారు. ఆమె ప్రస్తుతం భారత్లో ఆశ్రయం తీసుకుంటోంది. షేక్ హసీనా తీరు మానవత్వానికి మచ్చ అని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయబడింది. హసీనాను దోషిగా ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ తేల్చింది.
హసీనా నేరం చేసిందని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. హసీనా మానవత్వాన్ని మరిచింది, ఆమె చేతులు రక్తంతో తడిచాయి.. ఆందోళనకారుల్ని చంపమని హసీనా ఆదేశాలు జారీ చేశారు అని కోర్టు పేర్కొంది.
2024 లో బంగ్లాదేశ్ ఘర్షణల నేపథ్యంలో అప్పటి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆ అల్లర్లలో 300 మందికి మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు ప్రధాని షేక్ హసీనా ఇంటిని ముట్టడించడంతో ఆమె రాజీనామా చేసి భారత్ కి జారుకున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని షేక్ హసీనా పేర్కొన్నారు. తీర్పు వెల్లడించడానికి ముందు ఆమె సోమవారం పార్టీ మద్దతుదారులకు ఆడియో సందేశాన్ని పంపారు.
తన మద్దతుదారులు ఆందోళన చెందవద్దని అన్నారు. తాను బ్రతికే ఉంటానని, మళ్లీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని, బంగ్లాదేశ్ కి న్యాయం చేస్తానని అన్నారు. తీర్పు వెలువడిన నేపథ్యంలో బంగ్లాదేశ్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఢాకాలో యూనస్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా భారీగా భధ్రతా దళాలను మోహరించింది.
This post was last modified on November 17, 2025 2:59 pm
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…