Political News

కేసీఆర్ కాళ్లు పట్టుకుంటే జూబ్లీహిల్స్ మీదే: కేటీఆర్

జూబ్లీహిల్స్ బై పోల్ దంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల యుద్ధ పీక్స్ కు చేరింది. దివంగత మాగంటి గోపీనాథ్ మృతికి కేటీఆర్ కారణమని ఆరోపణలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం దుమారం రేపింది. మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని ఈ ఉప ఎన్నిక ప్రచారంలోకి లాగడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఇంత చిల్లర రాజకీయం చేయనవసరం లేదని, కేసీఆర్ కాళ్లు మొక్కితే ఆ సీటు వదిలేస్తారని కేటీఆర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

మాగంటి గోపీనాథ్ మరణంపై ఇంత నీచమైన రాజకీయం చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. గోపీనాథ్, సునీతలకు ముగ్గురు పిల్లలున్నారని….ఇప్పుడు గోపీనాథ్ భార్య సునీత కాదని కొందరు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపీనాథ్ తల్లి ఇంకొకలా మాట్లాడుతున్నారని, ఇద్దరు మంత్రులు దుర్మార్గంగా సునీత కన్నీళ్లను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇంకొకరు వాళ్ల పిల్లల మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఒక్క ఎలక్షన్ గెలిచేందుకు ఇంత దిగజారి రాజకీయం చేయాలా అని కేటీఆర్ ప్రశ్నించారు. అడుక్కుంటే, కేసీఆర్ కాళ్ల మీద పడితే ఆయనే ఆ సీటు ఇస్తాడని, ఆ ఎలక్షన్ ఏకగ్రీవం చేసుకోండి అని కేటీఆర్ చెప్పారు. ఈ రోజుకైనా సీటు కావాలనుకుంటే కేసీఆర్ కాళ్లు పట్టుకోమనండి ఇస్తారు అని అన్నారు. ఒక సీటు కోసం ఇంత నీచమైన రాజకీయం అవసరమా అని కేటీఆర్ నిలదీశారు.

This post was last modified on November 9, 2025 10:54 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

45 minutes ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

47 minutes ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

1 hour ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

2 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

3 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

4 hours ago