జూబ్లీహిల్స్ బై పోల్ దంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల యుద్ధ పీక్స్ కు చేరింది. దివంగత మాగంటి గోపీనాథ్ మృతికి కేటీఆర్ కారణమని ఆరోపణలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం దుమారం రేపింది. మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని ఈ ఉప ఎన్నిక ప్రచారంలోకి లాగడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఇంత చిల్లర రాజకీయం చేయనవసరం లేదని, కేసీఆర్ కాళ్లు మొక్కితే ఆ సీటు వదిలేస్తారని కేటీఆర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
మాగంటి గోపీనాథ్ మరణంపై ఇంత నీచమైన రాజకీయం చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. గోపీనాథ్, సునీతలకు ముగ్గురు పిల్లలున్నారని….ఇప్పుడు గోపీనాథ్ భార్య సునీత కాదని కొందరు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపీనాథ్ తల్లి ఇంకొకలా మాట్లాడుతున్నారని, ఇద్దరు మంత్రులు దుర్మార్గంగా సునీత కన్నీళ్లను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇంకొకరు వాళ్ల పిల్లల మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఒక్క ఎలక్షన్ గెలిచేందుకు ఇంత దిగజారి రాజకీయం చేయాలా అని కేటీఆర్ ప్రశ్నించారు. అడుక్కుంటే, కేసీఆర్ కాళ్ల మీద పడితే ఆయనే ఆ సీటు ఇస్తాడని, ఆ ఎలక్షన్ ఏకగ్రీవం చేసుకోండి అని కేటీఆర్ చెప్పారు. ఈ రోజుకైనా సీటు కావాలనుకుంటే కేసీఆర్ కాళ్లు పట్టుకోమనండి ఇస్తారు అని అన్నారు. ఒక సీటు కోసం ఇంత నీచమైన రాజకీయం అవసరమా అని కేటీఆర్ నిలదీశారు.
This post was last modified on November 9, 2025 10:54 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…