కొన్ని వారాల కిందట టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన విషయం.. విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సింపుల్గా ఈ వేడుకను పూర్తి చేసింది ఈ జంట. ఐతే ఈ విషయాన్ని వాళ్లిద్దరూ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఆ కబురు కోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు.
విజయ్ అయితే ఎక్కడా ఇంత వరకు ఓపెన్ కాలేదు. రష్మిక మందన్నా.. జగపతి బాబు నిర్వహించే షోలో పరోక్షంగా నిశ్చితార్థం గురించి మాట్లాడింది. తన చేతికి ఉన్న నిశ్చితార్థపు ఉంగరం గురించి మాట్లాడుతూ.. అది చాలా స్పెషల్ అని చెప్పింది. ఇప్పుడు ఒక టీవీ షోలో ఆమె నోటి నుంచి ‘విజయ్ని పెళ్లి చేసుకుంటా’ అనే మాట రావడం విశేషం.
ఈ షోలో ఒక అభిమాని మీరు కలిసి పని చేసిన నటుల్లో ఎవరితో ఎలాంటి రిలేషన్షిప్ కోరుకుంటారు అని అడిగితే.. రష్మిక సమాధానం ఇస్తూ యానిమేషన్ క్యారెక్టర్ నరుటోతో తాను డేటింగ్ చేయాలని అనుకుంటా అని చెప్పింది. దానికి కొనసాగింపుగా.. ‘‘విజయ్ని పెళ్లి చేసుకుంటా’’ అనడంతో అందరూ గట్టిగా అరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ఉంది. విజయ్, రష్మిక పెళ్లి కోసం ఎక్కువ సమయం ఏమీ తీసుకోరని వార్తలు వస్తున్నాయి.
ఫిబ్రవరిలో వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రావచ్చు. కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’తో కథానాయికగా పరిచయం అయిన రష్మిక.. తర్వాత హిట్ మూవీ ‘ఛలో’తో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. విజయ్ దేవరకొండతో చేసిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ అయి ఆమె కెరీర్ను వేరే లెవెల్కు తీసుకెళ్లింది. విజయ్తో తర్వాత ఆమె ‘డియర్ కామ్రేడ్’లోనూ నటించింది. అప్పుడే వాళ్లిద్దరి మధ్య రిలేషన్షిప్ మొదలైనట్లు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి వైపు అడుగులు వేస్తోంది.
This post was last modified on November 9, 2025 9:57 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…