విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. అప్పనపాలెం ప్రాంతంలో చిన్న చిన్న గొడవలతో మొదలైన అత్త–కోడళ్ల మధ్య విభేదాలు చివరికి ప్రాణహానికి దారితీశాయి. ‘దొంగ–పోలీస్’ ఆట పేరుతో అత్తను సజీవదహనం చేసిన సంఘటన స్థానికులను షాక్కు గురిచేసింది.
సుబ్రహ్మణ్య శర్మ, భార్య లలిత, తల్లి కనక మహాలక్ష్మి (66)తో కలిసి అప్పనపాలెంలో నివసిస్తున్నారు. అత్త తరచూ మందలించడం, గొడవపడటం వల్ల కోడలు లలిత మనస్తాపానికి గురై, అత్తను తొలగించాలని నిర్ణయించుకుందని పోలీసులు చెబుతున్నారు.
దారుణానికి ముందు లలిత గూగుల్, యూట్యూబ్లో “How to kill old lady” అని వెతికినట్లు దర్యాప్తులో బయటపడింది. నవంబర్ 7న రాత్రి, ఆమె తన చిన్న కుమార్తెను “దొంగ–పోలీస్” ఆట ఆడమని చెప్పి అత్తను కుర్చీలో కూర్చోబెట్టింది. “దొంగ పారిపోకూడదని” చెబుతూ తాళ్లతో ఆమెను కట్టేసి, తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించింది.
అగ్నిప్రమాదం జరిగినట్టుగా నాటకం ఆడి, దేవుడి గదిలోని దీపం పక్కన పడేసి ప్రమాదంలా చూపించింది. బయటకు వచ్చి కేకలు వేసి, తానే డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలో అగ్నిలో చిక్కుకున్న మనవరాలు కూడా గాయపడింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసరికి కనక మహాలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు.
తర్వాత ఇంటికి వచ్చిన భర్త సుబ్రహ్మణ్య శర్మ, సంఘటన తీరుపై అనుమానం వ్యక్తం చేశాడు. తన భార్యే తల్లిని చంపిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లలితపై కేసు నమోదైంది. గాయపడిన కుమార్తెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చిన్న కారణాలకే ఇంత దారుణంగా ప్రవర్తించడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on November 9, 2025 11:11 am
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
సాధారణంగా ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో మనుషులు కనిపించకుండా పోవడం గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఇటీవల…
పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో బైక్లు.. కాన్వాయ్ నడుస్తుండగా చుట్టూ జనాలు.. పార్టీ జెండాలు.. పూల వర్షాలు.. సందర్భం…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ లడ్డూలో…
'ఏపీలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లాగా జగన్ "కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు" అనే వ్యవస్థను స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా…