Political News

కోనసీమ పేలుడులో 6 మంది మృతి… బాబు, పవన్ దిగ్భ్రాంతి

ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. దీపావళి సమీపిస్తున్న తరుణంలో ఎక్కడికక్కడ టపాసుల తయారీ ఊపందుకుంది. ఈ క్రమంలో ఈ మధ్యే జిల్లాలోని రాయవరంలో ఏర్పాటు అయిన గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. కంపెనీ యజమాని సత్తిబాబు మరణించిన వారిలో ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే…. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగినప్పుడు 40 మంది కార్మికులు ఉన్నారు. ఈ పేలుడులో ఈ కేంద్రం గోడ కూలిపోయింది. ఈ శిథిలాల కింద మరికొంత మంది ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పేలుడులో గాయపడ్డవారిని అనపర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే..వారం క్రితమే పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఈ కేంద్రాన్ని పరిశీలించి అన్ని రక్షణ చర్యలు సరిగ్గానే ఉన్నట్టు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఇచ్చిన వారానికే అందులో పేలుడు సంభవించడం గమనార్హం.

ఈ ఘటనపై అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి సంతాపం తెలిపిన చంద్రబాబు ప్రమాదానికి గల కారణాలను నిగ్గు తేల్చాలని అదికారులను ఆదేశించారు. అదే సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఇక ఈ ఘటన తనను కలచివేసిందని పవన్ అన్నారు. బాధితులు భయపడాల్సిన అవసరం లేదని, కూటమి సర్కారు వారిని అన్నిరకాలుగా ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

This post was last modified on October 8, 2025 9:00 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

1 hour ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago