ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. దీపావళి సమీపిస్తున్న తరుణంలో ఎక్కడికక్కడ టపాసుల తయారీ ఊపందుకుంది. ఈ క్రమంలో ఈ మధ్యే జిల్లాలోని రాయవరంలో ఏర్పాటు అయిన గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. కంపెనీ యజమాని సత్తిబాబు మరణించిన వారిలో ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే…. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగినప్పుడు 40 మంది కార్మికులు ఉన్నారు. ఈ పేలుడులో ఈ కేంద్రం గోడ కూలిపోయింది. ఈ శిథిలాల కింద మరికొంత మంది ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పేలుడులో గాయపడ్డవారిని అనపర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే..వారం క్రితమే పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఈ కేంద్రాన్ని పరిశీలించి అన్ని రక్షణ చర్యలు సరిగ్గానే ఉన్నట్టు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఇచ్చిన వారానికే అందులో పేలుడు సంభవించడం గమనార్హం.
ఈ ఘటనపై అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి సంతాపం తెలిపిన చంద్రబాబు ప్రమాదానికి గల కారణాలను నిగ్గు తేల్చాలని అదికారులను ఆదేశించారు. అదే సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఇక ఈ ఘటన తనను కలచివేసిందని పవన్ అన్నారు. బాధితులు భయపడాల్సిన అవసరం లేదని, కూటమి సర్కారు వారిని అన్నిరకాలుగా ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
This post was last modified on October 8, 2025 9:00 pm
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…