Political News

కోనసీమ పేలుడులో 6 మంది మృతి… బాబు, పవన్ దిగ్భ్రాంతి

ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. దీపావళి సమీపిస్తున్న తరుణంలో ఎక్కడికక్కడ టపాసుల తయారీ ఊపందుకుంది. ఈ క్రమంలో ఈ మధ్యే జిల్లాలోని రాయవరంలో ఏర్పాటు అయిన గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. కంపెనీ యజమాని సత్తిబాబు మరణించిన వారిలో ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే…. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగినప్పుడు 40 మంది కార్మికులు ఉన్నారు. ఈ పేలుడులో ఈ కేంద్రం గోడ కూలిపోయింది. ఈ శిథిలాల కింద మరికొంత మంది ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పేలుడులో గాయపడ్డవారిని అనపర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే..వారం క్రితమే పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఈ కేంద్రాన్ని పరిశీలించి అన్ని రక్షణ చర్యలు సరిగ్గానే ఉన్నట్టు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఇచ్చిన వారానికే అందులో పేలుడు సంభవించడం గమనార్హం.

ఈ ఘటనపై అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి సంతాపం తెలిపిన చంద్రబాబు ప్రమాదానికి గల కారణాలను నిగ్గు తేల్చాలని అదికారులను ఆదేశించారు. అదే సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఇక ఈ ఘటన తనను కలచివేసిందని పవన్ అన్నారు. బాధితులు భయపడాల్సిన అవసరం లేదని, కూటమి సర్కారు వారిని అన్నిరకాలుగా ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

Kumar

Recent Posts

అనుకున్నట్లే జరిగింది.. రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్!

అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…

20 minutes ago

బుచ్చిబాబు మీద నమ్మకం ఎంత ఉందంటే

మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…

20 minutes ago

మెగా సినిమాల మీదే యువి భారం

మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…

24 minutes ago

పీఏ అక్ర‌మాలు… గట్టిగా వినిపిస్తున్న జగన్ పేరు

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు.. రాష్ట్రంలో జ‌రిగిన అనేక అక్ర‌మాల‌పై ప్ర‌స్తుత ప్ర‌భుత్వం విచార‌ణ చేస్తున్న…

2 hours ago

తెలుగు దుకాణంలో డబ్బింగ్ వ్యాపారం

వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…

2 hours ago

కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…

4 hours ago