Political News

‘శీష్’ మ‌హల్‌కు ప‌రిష్కారం.. మ‌రి ‘రుషికొండ’ ప్యాలెస్ సంగ‌తేంటి?

శీష్ మ‌హ‌ల్‌(అద్దాల బంగ‌ళా).. ఈ మాట కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో జోరుగా వినిపించిన విష‌యం తెలిసిందే. ఢిల్లీలోని సివిల్ లైన్స్ ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని ఆరో భ‌వంతి ఇది. అప్ప‌టి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ఈ బంగ‌ళాకు.. 200 కోట్ల రూపాయల ప్ర‌జాధ‌నాన్ని వెచ్చించి.. అత్యంత ఆధునిక వ‌స‌తుల‌తో పున‌ర్నిర్మాణం చేశారు. దీనిపై బీజేపీ నేత‌లు అప్ప‌ట్లో నిప్పులు చెరిగారు. ఢిల్లీ అస‌లే అప్పుల్లో ఉంటే.. ఇంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి.. ఆధునీక‌రించ‌డం ఎందుక‌ని నిల‌దీశారు.

అంతేకాదు.. దీనిలో అవినీతి జ‌రిగింద‌ని.. కేజ్రీవాల్ ఆయ‌న అనుంగులు సొమ్ము తిన్నార‌ని కూడా బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. ఇది ప్ర‌భుత్వ‌భ‌వ‌న‌మేన‌ని.. తానేమీ సొమ్ములు తిన‌లేద‌ని.. ప్ర‌భుత్వ గౌర‌వం కాపాడేందుకే.. దీనిని ఆధునీక‌రించామ‌ని అప్ప‌ట్లో కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఇక‌, ఆయ‌న ప్ర‌భుత్వం ప‌డిపోయిన త‌ర్వాత‌.. బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. ఈ భ‌వ‌నం ఆధునీక‌ర‌ణ‌లో జ‌రిగిన అవినీతిపై ప్ర‌స్తుతం విచార‌ణ చేస్తున్నారు. మ‌రోవైపు.. నిన్న మొన్న‌టివ‌రకు సీఎం విడిది నివాసంగా వినియోగించాల‌ని భావించినా.. తాజాగా ఈ నిర్ణ‌యం వెన‌క్కి తీసుకున్నారు.

శీష్ మ‌హ‌ల్‌ను.. ప్ర‌భుత్వ గెస్ట్ హౌస్‌గా మార్చాల‌ని తీర్మానం చేశారు. దీనికి స‌ర్కారు ఆమోదం ల‌భించింది. ఇక‌, నుంచి రాష్ట్రాల‌కు చెందిన అతిథులు, కేంద్రం పెద్ద‌లు కూడా ఈ భ‌వ‌నాన్ని గెస్ట్ హౌస్‌గా వినియోగించుకునే వెసులు బాటు ఉంది. ఇదేస‌మ‌యంలో ఏపీలో వైసీపీ స‌ర్కారు హ‌యాంలో విశాఖప‌ట్నం లోని రుషికొండ‌పై రూ.450 కోట్ల వ్య‌యంతో నిర్మించిన ప్యాలెస్‌(టీడీపీ నేత‌ల మాట‌ల్లో) ప‌రిస్థితి ఏంట‌న్నది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. కూట‌మి స‌ర్కారు ఏర్పడి 15 మాసాలు అయినా.. దీనిపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు.

ఇటీవ‌ల డిప్యూటీ సీఎం ప‌వ‌న్ ప‌ర్య‌టించి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో పెచ్చులు ఊడుతున్నాయ‌ని.. నీళ్లు కారుతున్నాయ‌ని.. ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. దీనిని ఎలా వినియోగించాల‌న్న అంశంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నామ‌న్నారు. మంత్రుల క‌మిటీని నియ‌మించి.. దేనికి వినియోగిస్తే అనువుగా ఉంటుందో తెలుసుకుంటామ‌న్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు క‌మిటీని నియ‌మించ‌లేదు. కానీ, ఢిల్లీలో ప్ర‌భుత్వం ఏర్ప‌డి.. కేవ‌లం 7 మాసాలే అయినా.. అక్క‌డ శీష్ మ‌హ‌ల్‌పై నిర్న‌యం తీసుకోవ‌డం విశేషం.

This post was last modified on October 5, 2025 6:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

3 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

3 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

3 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

4 hours ago

చావానే టార్గెట్… అంత సీన్ లేదు రాజా

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…

5 hours ago

తరుణ్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోంది

పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…

7 hours ago