Political News

మోడీ వ్యూహాత్మ‌క బాణం: ప్ర‌పంచీక‌ర‌ణ‌కే ముప్పు!

ప్ర‌పంచీక‌ర‌ణ‌(గ్లోబ‌లైజేష‌న్‌) అనేది.. 1990ల నుంచి వినిపిస్తున్న మాట‌. ఇప్పుడు ప్ర‌తి దేశం జ‌పిస్తున్న మాట కూడా. అయితే.. ఒక‌ప్పుడు ప్ర‌పంచీక‌ర‌ణ అనేది దేశాల‌కు- దేశాల‌కు మ‌ధ్య అనుసంధానం పెంచింది. వ్యాపార‌, వాణిజ్య కార్య‌క‌లాపాల‌ను కూడా విస్త‌రించింది. అందుకే.. మ‌న దేశంలో పీవీ న‌ర‌సింహారావు ప్ర‌ధానిగా వ‌చ్చిన త‌ర్వాత‌.. సంస్క‌ర‌ణ‌ల పేరుతో ఆయ‌న గ్లోబ‌లైజేషన్‌కు ద్వారాలు తెరిచారు. ఇక‌, ఆ త‌ర్వాత త‌ర్వాత‌.. అనేక మార్పులు వ‌చ్చాయి. ఈ సంస్క‌ర‌ణ‌లు ఎందాకా వెళ్లాయంటే.. ఇంట్లో మ‌నం వినియోగించే చాలా వ‌స్తువులు ఏదేశంలో త‌యార‌య్యాయో కూడా తెలియ‌నంత‌గా ప్ర‌పంచీక‌ర‌ణ‌కు ద్వారాలు తెరిచారు.

చిత్రం ఏంటంటే.. మ‌నం వాడే పేస్టుల్లో చాలా వ‌ర‌కు అమెరికా స‌హా ఇత‌ర దేశాల్లో త‌యార‌వుతాయి. కోల్‌గేట్ అమెరికాలో త‌యారవుతున్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. ఇలా.. మ‌న‌కు.. ఇత‌ర దేశాల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం పెరిగిపోయింది. దేశంలో ఎక్క‌డైనా వ‌ర‌ద‌లు విప‌త్తులు వ‌చ్చి ఉల్లిపాయ‌లు, బంగాళా దుంప‌ల‌కు లోటు వ‌స్తే.. పాకిస్థాన్ స‌హా.. ఇత‌ర అర‌బ్ దేశాల నుంచి దుంప‌ల‌ను దిగుమ‌తి చేసుకుంటున్నాం. ఇత‌ర ద‌క్షిణాప్రికా దేశాల నుంచి ఉల్లిగ‌డ్డ‌ల‌ను దిగుమ‌తి చేసుకుంటున్నాం. ఇక‌, ఇంగువ మ‌న దేశ స‌రుకు కాద‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. ఇప్ప‌టికీ ఇంగువ ఫారిన్ స‌రికే.

క‌ట్టుకునే బ‌ట్ట‌ల నుంచి తినే స‌రుకుల వ‌ర‌కు ప్ర‌పంచ దేశాల‌తో ముడిపడిపోయిన ఈ ‘బంధం’ తెంచాల‌న్న‌ది ప్ర‌ధాన మోడీ ప్ర‌య‌త్నం. అందుకే ఆయ‌న‌.. తొలిసారి వృత్తి నిపుణుల‌ను ‘నాగ‌రిక్ దేవోభ‌వ‌’ అని వ్యాఖ్యానించారు. త‌ద్వారా.. ప్ర‌పంచ దేశాల దూకుడుకు ముఖ్యంగా అమెరికాకు ముకుతాడు వేయాల‌న్న‌ది మోడీ వ్యూహం. సుంకాలు, వీసాల ద్వారా అమెరికా ఒక‌ర‌కంగా అతి పెద్ద జ‌నాభా ఉన్న భార‌త్‌పై దాడి చేస్తోంద‌న్న‌ది వాస్త‌వం. ఈ క్ర‌మంలో ఆ దేశాన్ని క‌ట్ట‌డి చేసే క్ర‌మంలోనే మోడీ ఈ నిర్ణ‌యాలు తీసుకున్నారా? అనేది చూడాలి. ఇక‌, చైనా కూడా మ‌న దేశంలో చాలా విస్త‌రించింది(వ్యాపార ప‌రంగా). ఇప్పుడు స్వ‌దేశీ మంత్రంతో ఈ దేశానికి కూడా చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించారు.

మంచిదేనా?

అయితే.. ప్ర‌స్తుతం మోడీ తీసుకున్న నిర్ణ‌యం మంచిదేనా? స్వ‌దేశీ ఉత్ప‌త్తుల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని చెబుతున్న దానిలో ఎంత వ‌ర‌కు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక ఉంటుంది? అనేది కీల‌కం. ఎందుకంటే.. ఉత్ప‌త్తులు పెరిగిపోతే.. వినిమ‌యం-డిమాండ్‌పైతీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. అదేస‌మ‌యంలో ప్ర‌పంచ దేశాల‌కు ఎగుమతులు చేయాల్సి ఉంటుంది. అయితే..మ‌నం కొన‌న‌ప్పుడు.. ఇత‌ర దేశాలు మ‌న ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేస్తాయా? అన్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అంతేకాదు.. ‘ప్ర‌పంచీక‌ర‌ణ‌’కు స్వ‌దేశీ ఉత్ప‌త్తుల ద్వారా మోడీ ప‌రోక్షంగా చెక్ పెడుతున్నారు.

ఇది అంత‌ర్జాతీయంగా పెను వివాదానికి దారి తీసే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికిప్పుడు ఈ వివాదాలు రాక‌పోయినా.. త్వ‌ర‌లోనే భార‌త్‌లో స్వ‌దేశీ ఉత్ప‌త్తులు పెరిగి, అంత‌ర్జాతీయంగా కొనుగోలు ఆగితే.. ఖ‌చ్చితంగా అది భార‌త్‌పై మ‌రోరూపంలో యుద్ధానికి కార‌ణ‌మ‌వుతుంద‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అతి చేసి.. ఇప్పుడు అనూహ్యంగా త‌ప్పుకోవ‌డం ద్వారా ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని అంటున్నారు.

This post was last modified on September 22, 2025 9:55 am

Share

Recent Posts

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

2 minutes ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

3 minutes ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

16 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

1 hour ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago