ప్రముఖ నిర్మాణ సంస్థ, ఓజి ప్రొడక్షన్ హౌస్ డివివి ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాత దానయ్య వారసుడు కళ్యాణ్ దాసరి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా ఆయన పర్యవేక్షణలో శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. నిజానికిది ఇప్పుడు లాక్ చేసుకున్న ప్రాజెక్టు కాదు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతున్న టైంలో ప్రకటించారు. అప్పుడు ప్రశాంత్ వర్మనే దర్శకుడు. హనుమాన్ రిలీజయ్యాక లెక్కలు మారిపోవడంతో అధిరకి డైరెక్టర్ కూడా ఛేంజ్ అయ్యాడు. ఓజి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న టైంలో హఠాత్తుగా దీని ప్రకటన ఇవ్వడం గమనార్హం.
టీజర్ కాదు కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. అందులో కళ్యాణి దాసరి సూపర్ హీరోగా వేసుకున్న గెటప్ కల్కిలో ప్రభాస్ ని పోలి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విలన్ గా చేస్తున్న ఎస్జె సూర్యని ఏదో యముడు తరహాలో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు. కథాపరంగా కల్కికి దీనికి కంపారిజన్ ఉండకపోవచ్చు కానీ గెటప్ దగ్గర కనిపిస్తున్న సారూప్యతలు డౌట్లు రేపుతున్నాయి. మాములుగా సూపర్ హీరోల బేసిక్ స్టోరీ పాయింట్ ఒకటే ఉంటుంది. తమ బలం తమకు తెలియకుండా సామాన్యుల్లో ఉండటం, శక్తి తెలిశాక శత్రువుల అంతం చూసేందుకు విచిత్రమైన డ్రెస్సు వేసుకుని చిన్నా పెద్దాని మెస్మరైజ్ చేయడం వీటిలో ప్రధానాంశం.
విడుదల ఇంకా ఖరారు చేయలేదు కానీ కొడుకుని పెద్ద ఎత్తున పరిచయం చేయాలని చూస్తున్న దానయ్యకు మంచి సెటప్ దొరికింది. నిర్మాత ఆయన కాకపోయినా అనుభవరిత్యా కొడుక్కి సలహాలు ఇస్తూ ఉంటారు. మాములుగా నిర్మాతల కొడుకు హీరోగా సెటిల్ కావడం చాలా తక్కువ. రామానాయుడు గారి వారసత్వాన్ని వెంకటేష్ నటన రూపంలో నిలబడేదితే సురేష్ బాబు సంస్థని మరింత పైకి తీసుకెళ్లారు. మరి కళ్యాణ్ దాసరి కూడా అదే బాటలో వెళ్తాడేమో చూడాలి. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న అధీరని వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశాలున్నాయి. రిలీజ్ డేట్ ఇంకా లాక్ చేసుకోలేదు.
This post was last modified on September 22, 2025 12:35 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…