జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా అత్యంత సున్నిత మనస్కుడు. సమాజంలో ఏ వర్గానికి కష్టం వచ్చినా ఆయన దానిని పరిష్కరించేందుకు తరించిపోతారు. ఇక యావత్తు ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతలకు కష్టం వచ్చిందంటే మాత్రం ఆయన మరింతగా చలించిపోతారు. ఇప్పుడదే జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా దాదాపుగా అన్ని ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలకూ తీవ్ర నష్టం జరిగింది. ఏపీలోని కోనసీమలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
ఈ సందర్బంగా అక్కడి పరిస్థితిని కళ్లకు కడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిన పవన్… దసరా పర్వదినాలు పూర్తి కాగానే తానే ఆయా శాఖల అధికారులను వెంటబెట్టుకుని మరీ వస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులను వీలయినంత మేర ఆదుకుంటామని కూడా పవన్ అన్నదాతలకు భరోసా ఇచ్చారు. కోనసీమలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ నుంచి ఉన్న గ్రామాల్లో కొబ్బరి తోటల్లోకి సముద్రపు నీరు చేరడం కారణంగా కొబ్బరి చెట్లు తలలు వాల్చేశాయని, ఇలా వేలాది ఎకరాలు దెబ్బతిన్న విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు.
సముద్రపు పోటు సమయంలో ఉప్పు నీరు వైనతేయ పాయ నుంచి శంకరగుప్తం డ్రెయిన్ లోకి చేరి అక్కడి నుంచి కొబ్బరి తోటల్లోకి చేరుతోందని.. ఫలితంగా అక్కడి13 గ్రామాల పరిధిలోని కొబ్బరి తోటలకు నష్టం కలుగుతోందని ఆయన వివరించారు. ఫలితంగా ఈ గ్రామాల కొబ్బరి రైతులు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారన్నారు. దసరా తర్వాత జరిగే తన పర్యటనలో తనతో పాటు నీటిపారుదల, వ్యవసాయం, కొబ్బరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల బృందం కూడా అక్కడికి వస్తుందని, సమస్యను అక్కడిక్కడే పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. మొత్తంగా పవన్ పుణ్యమా అని కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి.
This post was last modified on September 21, 2025 12:15 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…