జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. భారత నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ పదవీ ప్రమాణానికి హాజరయ్యేందుకు పవన్ ఈ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రపతిలో ఈ వేడుక ముగిసిన అనంతరం ఆయన డిల్లీలో భావల్పూర్ ప్రాంతంలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థలోని లైబ్రరీ, పుస్తక విక్రయశాలను సందర్శించారు. తనకు నచ్చిన కొన్ని పుస్తకాలను ఆయన కొనుగోలు చేసి మరీ ఆయన అక్కడి నుంచి బయలుదేరారు.
వాస్తవానికి డిప్యూటీ సీఎం లాంటి నేతలు దేశ రాజధాని వెళితే… ఏ ప్రధాన మంత్రినో, కేంద్ర మంత్రులనో కలిసి తమ రాష్ట్రానికి కావాల్సిన పథకాలు, నిధులు తదితరాలపై చర్చిస్తూ సాగుతూ ఉంటారు. అయితే ఏపీలోని కూటమి సర్కారు వ్యవహార శైలి కారణంగా పవన్ కు ఆ అవసరమే లేకుండాపోయింది. ఢిల్లీలోని వ్యవహారాలన్నింటినీ మొన్నటిదాకా చంద్రబాబు చక్కబెడితే.. ఇప్పుడు మంత్రి నారా లోకేశ్ చక్రం తిప్పేస్తున్నారు. లోకేశ్ స్పీడు కారణంగా ఏపీకి అడగకున్నా కూడా నిధుల వరద పారుతోంది. వెరసి నిధులు, పథకాల గురించి కేంద్రంతో చర్చించాల్సిన అవసరం పవన్ కు పెద్దగా లేదనే చెప్పక తప్పదు.
ఇక మొదటి నుంచి కూడా పవన్ పుస్తక ప్రియుడే. దాదాపుగా 2 లక్షల పుస్తకాలను ఇప్పటికే చదివేశానని అప్పుడెప్పుడో చెప్పిన పవన్… అన్నేసి పుస్తకాలు చదివినా.. ఆయనకు ఇంకా పుస్తకాలపై తృష్ణ తీరలేదనే చెప్పాలి. తనకు తెలిసి ఎక్కడ పుస్తక పుస్తక ప్రదర్శన (బుక్ ఫెయిర్) లు జరిగినా పవన్ నేరుగా వాటిలోకి వెళ్లిపోయి… అలా గంటల సేపు అందులోని పుస్తకాలను తిరగేస్తూ సేదదీరుతారు. ఆ క్రమంలో తనను అమితంగా ఆకట్టుకున్న పుస్తకాలను ఆయన కొనుగోలు చేసి వాటిని తన చేతిలో భద్రంగా పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. శుక్రవారం ఢిల్లీలోనూ అదే కనిపించింది.
This post was last modified on September 12, 2025 5:49 pm
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…
ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…
మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ…
ఇప్పుడు టాలీవుడ్లో ఏ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పరిస్థితీ అంత బాగా లేదు. సక్సెస్ రేట్ అంతకంతకూ పడిపోతోంది. జనాలు థియేటర్లకు…