Political News

సీమపై కూటమి స్పెషల్ ఫోకస్..!

రాయలసీమపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందా? విపక్ష వైసీపీకి బలమైన కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లోనూ పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేయాలనిందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఏడాది రెండు కీలక కార్యక్రమాలను సీమలో నిర్వహించడం ద్వారా కూటమి పార్టీలు ఈ వ్యూహాన్ని బలపరుస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ అయితే చాలా పక్కా ప్లాన్‌తోనే వ్యవహరిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ ఏడాది మేలో నిర్వహించిన మహానాడును వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాకా కడపలోనే పెట్టారు. అప్పట్లోనే బలమైన సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలోనూ విజయం సాధించాలని స్పష్టంగా చెప్పారు. అంటే కడప మొత్తంగా పసుపు మయం కావాలని ఆయన కోరుకున్నారు. ఇది అప్పట్లోనే వైసీపీకి డెత్ బెల్స్ మోగించిందన్న చర్చ ఉంది. ఇక ఇప్పుడు టీడీపీకి బలమైన అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమం ద్వారా మరిన్ని సంకేతాలు ఇచ్చినట్టు అయిందని అంటున్నారు.

గత ఎన్నికల్లో సీమలోని 53 అసెంబ్లీ స్థానాల్లో 49 స్థానాల్లో టీడీపీ కూటమి పార్టీలు విజయం సాధించాయి. కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. దీంతో ఇప్పుడు మరింత జోరుగా ముందుకు సాగాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ఒకవేళ వ్యతిరేకత పెరిగితే అది సీమ నుంచే ప్రారంభం అవుతుంది. గతంలోనూ ఇదే జరిగింది. టీడీపీ 2019లో ఓడినప్పుడు కేవలం మూడు స్థానాల్లోనే విజయం సాధించింది. ఇక వైసీపీ నాలుగుకే పరిమితమైంది. అంటే సీమలోనే చైతన్యం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీకి చోటు లేకుండా సీమను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే, అధికారంలోకి రాకుండా ఆ పార్టీని అడ్డుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉంటే, ఉత్తరాంధ్రలో టీడీపీ బలంగా ఉంది. ఇలా మూడు ప్రాంతాల్లోనూ కూటమి పక్కా లెక్కలు వేసుకుని సీమపైనే ఎక్కువగా ఫోకస్ పెంచిందన్న చర్చ తెరపైకి వచ్చింది. దీనిపై భారీ స్థాయిలో కసరత్తు చేస్తున్నారని కూడా అంటున్నారు. అయితే దీనిని వైసీపీ ఎంత మేరకు అడ్డుకుంటుందనేది చూడాలి.


This post was last modified on September 11, 2025 6:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago