Political News

సోషల్ టాక్: తన గొయ్యి తానే తవ్వుకుంటున్న జగన్

వైసీపీ అధినేత జగన్ వ్యవహారంపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన అధికారం కోల్పోయినా అహంకారం కోల్పోలేదని, ఇంకా వాస్తవాలు తెలుసుకోలేకపోతున్నారని వేలాది మంది నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా బుధవారం జగన్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా విశ్లేషకుల నుంచి విమర్శకుల వరకూ జగన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఏమాత్రం బాధ్యత లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇలా అయితే వచ్చే ఎన్నికలకే కాదు, ఇకపై ఎప్పటికీ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు.

ఏంటి రీజన్

బుధవారం మీడియాతో రెండున్నర గంటల పాటు మాట్లాడిన జగన్, రాష్ట్రంలో తన హయాంలో తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రభుత్వం నిర్మించే విషయంపై నిప్పులు చెరిగారు. అయితే ఈ సమయంలో తాజాగా కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాల్లోని లోపాలను ఆయన ఎత్తి చూపిస్తే, ఏవైనా మెరుగైన సూచనలు చేస్తే అందరూ హర్షించేవారు. వైసీపీ హయాంలో నిజంగానే 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రతిపాదించబడ్డాయి. దీనిని ఎవరూ ఖండించడం లేదు.

అయితే అప్పట్లోనే నిధులు కేటాయించలేక కేవలం 5 కాలేజీలను మాత్రమే నిర్మించారు. వీటిలో రెండు కాలేజీల్లో మాత్రమే తరగతులు జరుగుతున్నాయి. మరో మూడు 80 శాతం పూర్తయ్యి మిగిలిన పనుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక ఏమాత్రం పనులే ప్రారంభం కానివి 10 ఉన్నాయి. వీటి నిర్మాణానికి సుమారు 6-10 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. ప్రస్తుతం ఆ నిధులు లేవన్న ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని పీపీపీ విధానంలో అప్పగించేందుకు రెడీ అయింది. అయితే జగన్ దీనిని వ్యతిరేకిస్తున్నారు.

ఆయన ఆలోచన మంచిదే కావొచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందో చెప్పవచ్చు. లేదా కేంద్రంతో సంబంధాలు బాగానే ఉన్నందున నేరుగా ఆయనే జోక్యం చేసుకుని నిధులు ఇవ్వమని కోరవచ్చు. తద్వారా తానే తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను తానే పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయవచ్చు. ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవచ్చు. కానీ ఇవన్నీ జగన్ వదిలేశారు.

పీపీపీ విధానంలో ఆయా కాలేజీలను నిర్మించాలనుకుంటున్న సంస్థలను జగన్ తీవ్రంగా బెదిరించారు. “ఎవరు వస్తారో రండి, టెండర్లలో పాల్గొనండి. కానీ మేం వ‌చ్చాక వాటిని రద్దు చేస్తాం, వెనక్కి తీసుకుంటాం” అని హెచ్చరించారు. ఇది పెట్టుబడిదారులను భయపెట్టడమేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

జగన్ ఇదే ధోరణితో ముందుకు సాగితే, ఆయన తన పతనాన్ని మరింత వేగంగా తానే రెడీ చేసుకుంటున్నారని మండిపడుతున్నారు.

This post was last modified on September 11, 2025 6:46 pm

Share

Recent Posts

నేపాల్‌లో జ‌ల ప్ర‌ళ‌యం… టిబెట్‌పై చైనా కుట్ర చేసిందా?!

భార‌త పోరుగు దేశం, దేవ‌భూమి నేపాల్‌లో ఒక్క‌సారిగా సంభ‌వించిన జ‌ల ప్ర‌ళ‌యం.. ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేసింది. ఒక్క‌సారిగా ఉప్పొంగిన కోశీ…

26 minutes ago

తక్కువ బడ్జెట్ హనుమాన్… హిట్టు కొట్టేసింది  

మూడు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో కొత్త రికార్డులు తిరగరాస్తూ హనుమాన్ ఎంత సంచలన విజయం సాధించిందో మూవీ లవర్స్…

55 minutes ago

రవితేజ ఇకపై మరింత జాగ్రత్తగా

వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…

2 hours ago

సందీప్ వంగ ప్రభావం ఆ స్థాయిలో ఉంది

తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…

3 hours ago

పులివెందుల టికెట్ వదులుకుంటారా జగన్ సార్?

ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణ‌యాలు.. చేసే ప్ర‌క‌ట‌నల విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. స‌మ‌యం వ‌చ్చింద‌నో.. సంద‌ర్భం చిక్కింద‌నో…

3 hours ago

బ్యాలెట్ పోరుపై వైసీపీ ఆశ‌లు ఫ‌లించేనా…?

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న స్థానిక ఎన్నిక‌ల‌ను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి ఎన్నిక‌ల సంఘం కూడా…

4 hours ago