Political News

సోషల్ టాక్: తన గొయ్యి తానే తవ్వుకుంటున్న జగన్

వైసీపీ అధినేత జగన్ వ్యవహారంపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన అధికారం కోల్పోయినా అహంకారం కోల్పోలేదని, ఇంకా వాస్తవాలు తెలుసుకోలేకపోతున్నారని వేలాది మంది నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా బుధవారం జగన్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా విశ్లేషకుల నుంచి విమర్శకుల వరకూ జగన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఏమాత్రం బాధ్యత లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇలా అయితే వచ్చే ఎన్నికలకే కాదు, ఇకపై ఎప్పటికీ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు.

ఏంటి రీజన్

బుధవారం మీడియాతో రెండున్నర గంటల పాటు మాట్లాడిన జగన్, రాష్ట్రంలో తన హయాంలో తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రభుత్వం నిర్మించే విషయంపై నిప్పులు చెరిగారు. అయితే ఈ సమయంలో తాజాగా కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాల్లోని లోపాలను ఆయన ఎత్తి చూపిస్తే, ఏవైనా మెరుగైన సూచనలు చేస్తే అందరూ హర్షించేవారు. వైసీపీ హయాంలో నిజంగానే 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రతిపాదించబడ్డాయి. దీనిని ఎవరూ ఖండించడం లేదు.

అయితే అప్పట్లోనే నిధులు కేటాయించలేక కేవలం 5 కాలేజీలను మాత్రమే నిర్మించారు. వీటిలో రెండు కాలేజీల్లో మాత్రమే తరగతులు జరుగుతున్నాయి. మరో మూడు 80 శాతం పూర్తయ్యి మిగిలిన పనుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక ఏమాత్రం పనులే ప్రారంభం కానివి 10 ఉన్నాయి. వీటి నిర్మాణానికి సుమారు 6-10 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. ప్రస్తుతం ఆ నిధులు లేవన్న ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని పీపీపీ విధానంలో అప్పగించేందుకు రెడీ అయింది. అయితే జగన్ దీనిని వ్యతిరేకిస్తున్నారు.

ఆయన ఆలోచన మంచిదే కావొచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందో చెప్పవచ్చు. లేదా కేంద్రంతో సంబంధాలు బాగానే ఉన్నందున నేరుగా ఆయనే జోక్యం చేసుకుని నిధులు ఇవ్వమని కోరవచ్చు. తద్వారా తానే తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను తానే పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయవచ్చు. ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవచ్చు. కానీ ఇవన్నీ జగన్ వదిలేశారు.

పీపీపీ విధానంలో ఆయా కాలేజీలను నిర్మించాలనుకుంటున్న సంస్థలను జగన్ తీవ్రంగా బెదిరించారు. “ఎవరు వస్తారో రండి, టెండర్లలో పాల్గొనండి. కానీ మేం వ‌చ్చాక వాటిని రద్దు చేస్తాం, వెనక్కి తీసుకుంటాం” అని హెచ్చరించారు. ఇది పెట్టుబడిదారులను భయపెట్టడమేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

జగన్ ఇదే ధోరణితో ముందుకు సాగితే, ఆయన తన పతనాన్ని మరింత వేగంగా తానే రెడీ చేసుకుంటున్నారని మండిపడుతున్నారు.

This post was last modified on September 11, 2025 6:46 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

33 minutes ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

1 hour ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

3 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

3 hours ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

3 hours ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

6 hours ago