Political News

సోషల్ టాక్: తన గొయ్యి తానే తవ్వుకుంటున్న జగన్

వైసీపీ అధినేత జగన్ వ్యవహారంపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన అధికారం కోల్పోయినా అహంకారం కోల్పోలేదని, ఇంకా వాస్తవాలు తెలుసుకోలేకపోతున్నారని వేలాది మంది నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా బుధవారం జగన్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా విశ్లేషకుల నుంచి విమర్శకుల వరకూ జగన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఏమాత్రం బాధ్యత లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇలా అయితే వచ్చే ఎన్నికలకే కాదు, ఇకపై ఎప్పటికీ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు.

ఏంటి రీజన్

బుధవారం మీడియాతో రెండున్నర గంటల పాటు మాట్లాడిన జగన్, రాష్ట్రంలో తన హయాంలో తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రభుత్వం నిర్మించే విషయంపై నిప్పులు చెరిగారు. అయితే ఈ సమయంలో తాజాగా కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాల్లోని లోపాలను ఆయన ఎత్తి చూపిస్తే, ఏవైనా మెరుగైన సూచనలు చేస్తే అందరూ హర్షించేవారు. వైసీపీ హయాంలో నిజంగానే 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రతిపాదించబడ్డాయి. దీనిని ఎవరూ ఖండించడం లేదు.

అయితే అప్పట్లోనే నిధులు కేటాయించలేక కేవలం 5 కాలేజీలను మాత్రమే నిర్మించారు. వీటిలో రెండు కాలేజీల్లో మాత్రమే తరగతులు జరుగుతున్నాయి. మరో మూడు 80 శాతం పూర్తయ్యి మిగిలిన పనుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక ఏమాత్రం పనులే ప్రారంభం కానివి 10 ఉన్నాయి. వీటి నిర్మాణానికి సుమారు 6-10 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. ప్రస్తుతం ఆ నిధులు లేవన్న ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని పీపీపీ విధానంలో అప్పగించేందుకు రెడీ అయింది. అయితే జగన్ దీనిని వ్యతిరేకిస్తున్నారు.

ఆయన ఆలోచన మంచిదే కావొచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందో చెప్పవచ్చు. లేదా కేంద్రంతో సంబంధాలు బాగానే ఉన్నందున నేరుగా ఆయనే జోక్యం చేసుకుని నిధులు ఇవ్వమని కోరవచ్చు. తద్వారా తానే తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను తానే పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయవచ్చు. ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవచ్చు. కానీ ఇవన్నీ జగన్ వదిలేశారు.

పీపీపీ విధానంలో ఆయా కాలేజీలను నిర్మించాలనుకుంటున్న సంస్థలను జగన్ తీవ్రంగా బెదిరించారు. “ఎవరు వస్తారో రండి, టెండర్లలో పాల్గొనండి. కానీ మేం వ‌చ్చాక వాటిని రద్దు చేస్తాం, వెనక్కి తీసుకుంటాం” అని హెచ్చరించారు. ఇది పెట్టుబడిదారులను భయపెట్టడమేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

జగన్ ఇదే ధోరణితో ముందుకు సాగితే, ఆయన తన పతనాన్ని మరింత వేగంగా తానే రెడీ చేసుకుంటున్నారని మండిపడుతున్నారు.

This post was last modified on September 11, 2025 6:46 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago