2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలకు ముందు వై నాట్ 175 అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న జగన్…ఘోర ఓటమి తర్వాత వై నాట్ అపోజిషన్ అంటూ లేని, రాని ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదన్న సంగతి జగన్ కూ తెలుసు. అయినా సరే ప్రతిపక్ష హోదా కావాలని జగన్ చిన్న పిల్లలు మారాం చేసినట్లు డిమాండ్ కమ్ మారాం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభా వేదికపైన జగన్ కు చంద్రబాబు చురకలంటించారు.
రాజకీయాల్లో ఓనమాలు తెలియని వాళ్లు ప్రతిపక్ష హోదా కావాలని అడుతున్నారని, కానీ, ప్రతిపక్ష హోదా ప్రజలిచ్చేదని…తీసుకుంటే వచ్చేది కాదని పరోక్షంగా జగన్ కు చురకలంటించారు. తనను ముఖ్యమంత్రిని చేసింది ప్రజలని, జగన్ కు ప్రతిపక్ష నేత హోదా దక్కకుండా చేసింది కూడా ప్రజలేనని చెప్పారు. జగన్ అసెంబ్లీకి రావాలని ప్రజలంతా కలిసి క్లాస్ తీసుకోవాలని కోరారు. శాసన సభకు రాకుండా రప్పా రప్పా అని రంకలేస్తున్నారని వైసీపీ నేతలకు చురకలంటించారు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది సీబీఎన్, పవన్ కల్యాణ్ అని వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు, తప్పులు, పాపాలు, అక్రమాలు, వేధింపులు, దోపిడీలు, దౌర్జన్యాలు చేసిందని చంద్రబాబు అన్నారు. ఆ అప్పుల, తప్పుల లెక్క తేలుస్తామని అన్నారు. విధ్వంసమే ఎజెండాగా గత ప్రభుత్వం పాలన సాగించిందని విమర్శించారు. జనసేన, బీజేపీ, టీడీపీల కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తుందని తెలిపారు.
This post was last modified on September 10, 2025 6:32 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…