ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ఫొటోలు ఉంటే తప్పేంటని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. మరీ ముఖ్యంగా “డిప్యూటీ సీఎం ఫొటో ఉంటే మీకేంటి బాధ?” అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. రాజకీయ వైరుధ్యాలకు.. రాజకీయ దుమారాలకు హైకోర్టును వేదికగా చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయిం దని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
ఏపీలో గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు ఫొటోలు సహా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జీవో విడుద ల చేసింది. దీనికి సంబంధించిన కారణాలు చెప్పలేదు. కానీ, అంతర్గతంగా మాత్రం.. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించడంతో ఆయన ఫొటోను కూడా కార్యాలయాల్లో పెట్టాలని నిర్ణయించి.. ఆ మేరకు నిర్ణయించింది.
అయితే.. పవన్ కల్యాణ్ ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. ఓ రాజకీయ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గతంలోనే ఒకసారి విచారణ జరిగింది. అయితే.. అప్పట్లో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు గడువు కోరారు. తాజాగా బుధవారం జరిగిన విచారణలో హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత.. ప్రభుత్వ కార్యాలయాల్లో సర్కారుకు సంబంధించిన వారి ఫొటోలను పెట్టుకోవడం తప్పుకాదని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం కూడా.. ప్రధాని, హోం మంత్రి ఫొటోలను చాలా కార్యాలయాల్లో వినియోగిస్తోందన్న ప్రభుత్వం తరఫు వాదనలను పరిగణనలోకి తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి ఫొటోలు పెట్టడం తప్పుకాదని తెలిపింది. దీనిని రాజకీయంగా చూడాలని అనుకుంటున్న పిటిషనర్ దీనికి హైకోర్టును వేదికగా చేసుకోవడం ఎందుకని ప్రశ్నించింది. ఇలాంటి వాటి విషయంలో తీవ్రంగా స్పందిస్తామని తెలిపింది. అంతేకాదు.. పది మంది ప్రజలకు మేలు జరిగే వాటికి సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయాలని పేర్కొంటూ.. సదరు పిటిషన్ను తోసిపుచ్చింది.
This post was last modified on September 10, 2025 5:55 pm
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…