ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ఫొటోలు ఉంటే తప్పేంటని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. మరీ ముఖ్యంగా “డిప్యూటీ సీఎం ఫొటో ఉంటే మీకేంటి బాధ?” అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. రాజకీయ వైరుధ్యాలకు.. రాజకీయ దుమారాలకు హైకోర్టును వేదికగా చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయిం దని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
ఏపీలో గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు ఫొటోలు సహా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జీవో విడుద ల చేసింది. దీనికి సంబంధించిన కారణాలు చెప్పలేదు. కానీ, అంతర్గతంగా మాత్రం.. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించడంతో ఆయన ఫొటోను కూడా కార్యాలయాల్లో పెట్టాలని నిర్ణయించి.. ఆ మేరకు నిర్ణయించింది.
అయితే.. పవన్ కల్యాణ్ ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. ఓ రాజకీయ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గతంలోనే ఒకసారి విచారణ జరిగింది. అయితే.. అప్పట్లో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు గడువు కోరారు. తాజాగా బుధవారం జరిగిన విచారణలో హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత.. ప్రభుత్వ కార్యాలయాల్లో సర్కారుకు సంబంధించిన వారి ఫొటోలను పెట్టుకోవడం తప్పుకాదని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం కూడా.. ప్రధాని, హోం మంత్రి ఫొటోలను చాలా కార్యాలయాల్లో వినియోగిస్తోందన్న ప్రభుత్వం తరఫు వాదనలను పరిగణనలోకి తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి ఫొటోలు పెట్టడం తప్పుకాదని తెలిపింది. దీనిని రాజకీయంగా చూడాలని అనుకుంటున్న పిటిషనర్ దీనికి హైకోర్టును వేదికగా చేసుకోవడం ఎందుకని ప్రశ్నించింది. ఇలాంటి వాటి విషయంలో తీవ్రంగా స్పందిస్తామని తెలిపింది. అంతేకాదు.. పది మంది ప్రజలకు మేలు జరిగే వాటికి సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయాలని పేర్కొంటూ.. సదరు పిటిషన్ను తోసిపుచ్చింది.
This post was last modified on September 10, 2025 5:55 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…