ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ఫొటోలు ఉంటే తప్పేంటని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. మరీ ముఖ్యంగా “డిప్యూటీ సీఎం ఫొటో ఉంటే మీకేంటి బాధ?” అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. రాజకీయ వైరుధ్యాలకు.. రాజకీయ దుమారాలకు హైకోర్టును వేదికగా చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయిం దని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
ఏపీలో గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు ఫొటోలు సహా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జీవో విడుద ల చేసింది. దీనికి సంబంధించిన కారణాలు చెప్పలేదు. కానీ, అంతర్గతంగా మాత్రం.. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించడంతో ఆయన ఫొటోను కూడా కార్యాలయాల్లో పెట్టాలని నిర్ణయించి.. ఆ మేరకు నిర్ణయించింది.
అయితే.. పవన్ కల్యాణ్ ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. ఓ రాజకీయ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గతంలోనే ఒకసారి విచారణ జరిగింది. అయితే.. అప్పట్లో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు గడువు కోరారు. తాజాగా బుధవారం జరిగిన విచారణలో హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత.. ప్రభుత్వ కార్యాలయాల్లో సర్కారుకు సంబంధించిన వారి ఫొటోలను పెట్టుకోవడం తప్పుకాదని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం కూడా.. ప్రధాని, హోం మంత్రి ఫొటోలను చాలా కార్యాలయాల్లో వినియోగిస్తోందన్న ప్రభుత్వం తరఫు వాదనలను పరిగణనలోకి తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి ఫొటోలు పెట్టడం తప్పుకాదని తెలిపింది. దీనిని రాజకీయంగా చూడాలని అనుకుంటున్న పిటిషనర్ దీనికి హైకోర్టును వేదికగా చేసుకోవడం ఎందుకని ప్రశ్నించింది. ఇలాంటి వాటి విషయంలో తీవ్రంగా స్పందిస్తామని తెలిపింది. అంతేకాదు.. పది మంది ప్రజలకు మేలు జరిగే వాటికి సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయాలని పేర్కొంటూ.. సదరు పిటిషన్ను తోసిపుచ్చింది.
This post was last modified on September 10, 2025 5:55 pm
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…
రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీని కంటే ముందు ఆయన మొదలుపెట్టిన…
తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…