Political News

లైట్ తీసుకున్న హ‌రీష్ రావు: క‌విత‌కు డ్యామేజీయేగా!

బీఆర్ఎస్ కీల‌క‌నాయ‌కుడు, ఎమ్మెల్యే హ‌రీష్ రావుపై ఆపార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురై.. చివ‌ర‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ క‌విత తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి చేశార‌ని.. దోచుకున్నార‌ని.. కానీ, త‌న తండ్రి కేసీఆర్‌ను మాత్ర‌మే ప్రొజెక్టు చేస్తున్నార‌ని ఆమె మీడియ ముందు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల దుమారం నేప‌థ్యంలోనే పార్టీ అధిష్ఠానం క‌విత‌పై చ‌ర్య‌లు తీసుకుని స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ఇది జ‌రిగిన త‌ర్వాత‌.. హ‌రీష్ రావు తాజాగా స్పందించారు.

అయితే.. ఆయ‌న ఎక్క‌డా క‌విత పేరును ప్ర‌స్తావించ‌లేదు. పైగా.. చాలా లైట్ తీసుకున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపించింది. “నాపై విమ‌ర్శ‌లు చేసిన వారి విజ్ఞ‌త‌కే ఈ విష‌యాన్ని వ‌దిలేస్తున్నా” అని హ‌రీష్ రావు వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల కాలంలో నాపై ‘కొంద‌రు’ ఆరోప‌ణ‌లు చేశారు.. అని మాత్ర‌మే అని ఊరుకున్నారు. అంటే.. క‌విత పేరును కూడా ఎత్తేందుకు హ‌రీష్ రావు ఇష్ట‌ప‌డ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో క‌విత వ్య‌వ‌హారాన్ని హ‌రీష్ రావు లైట్ తీసుకున్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది.

ఫ‌లితంగా క‌విత‌కే ఈ వ్య‌వ‌హారంలో డ్యామేజీ జ‌రుగుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఎందుకంటే.. హరీష్‌రావు ఆమెలా.. ఎదురు దాడి చేసి ఉంటే.. అది వేరే చ‌ర్చ‌కు అవ‌కాశం ఇచ్చి ఉండేది. అలా కాకుండా త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న ప‌ట్టించుకోలేదు. నిజానికి పార్టీ అధినేత కుమార్తెగా క‌విత చేసిన వ్యాఖ్య‌ల‌కు చాలా ప్రాధాన్యం ఉంది. అయిన‌ప్ప‌టికీ.. హ‌రీష్‌రావు మాత్రం లైట్ తీసుకున్నారు. ఆమెను ప‌న్నెత్తు మాట కూడా అన‌లేదు. పైగా ఆమె విజ్ఞ‌త‌కే వ‌దిలేశారు.

అంటే.. ప‌రోక్షంగా క‌విత చేసిన విమ‌ర్శ‌ల‌ను క‌వితే నిరూపించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అంతేకాదు.. హరీష్‌రావుపై తెలంగాణ స‌మాజంలో ఉన్న సానుభూతి, సానుకూల‌త‌ల నేప‌థ్యంలో కూడా ఆమె ఇరుకున ప‌డ్డార‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డిపై చేసిన ఆరోప‌ణ‌ల త‌ర‌హాలో.. ఆయ‌న మాదిరిగానే హ‌రీష్‌రావును క‌విత ఊహించుకుని ఉంటార‌ని, కానీ.. హ‌రీష్‌రావుకు.. ఇత‌ర నేత‌ల‌కు చాలా తేడా వుంద‌ని అంటున్నారు. అందుకే.. క‌విత విష‌యంలో ఎంత వ‌ర‌కు స్పందించాలో అంతే స్పందించి.. వ‌దిలేశార‌ని చెబుతున్నారు. త‌ద్వారా ఇప్పుడు క‌విత చేసిన వ్యాఖ్య‌లు.. ఆమెకే ఎదురు నిలిచే అంశంగా మారాయ‌ని అంటున్నారు.

This post was last modified on September 6, 2025 6:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

56 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago