టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయిన బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా కొన్ని విషయాలను ముంబై మీడియా అదే పనిగా తవ్వుతున్న వైనం ఆన్ లైన్ లో కనిపిస్తోంది. రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రకు ముందు శ్రీదేవిని అనుకుని, తర్వాత ఆమె డిమాండ్లను తట్టుకోలేక రాజమౌళి నిర్ణయం మార్చున్నారనే ప్రచారం కొన్నేళ్ల క్రితం బలంగా తిరిగింది. జక్కన్న చెప్పింది ఒకటైతే దానికి అర్థం ఇంకోలా వెళ్లిపోవడం వేరే విషయం. తర్వాత జరిగిన చరిత్ర తెలిసిందే. శ్రీదేవి కాలం చేశారు. బాహుబలి రికార్డులు బద్దలు కొట్టింది. తాజాగా నిర్మాత బోనీ కపూర్ అప్పట్లో జరిగిన వివాదాన్ని మరోసారి తవ్వారు.
శ్రీదేవి గొంతెమ్మ కోరికలు అడిగిందనే ప్రచారం నిజం కాదని, ఇంగ్లీష్ వింగ్లిష్ కన్నా తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం వల్లే వద్దనుకున్నామని, పిల్లలకు సెలవులు ఉన్నప్పుడే షూటింగ్ పెట్టుకుంటే అనుకూలంగా ఉంటుందని చెప్పామని, అంతే తప్ప హోటల్ లో ఫ్లోర్ మొత్తం డిమాండ్ చేయలేదని వివరణ ఇచ్చారు. నిజానికి ఇప్పుడీ టాపిక్ అసందర్భం. ఇది నిజమో కాదో చెప్పేందుకు శ్రీదేవి లేరు. రాజమౌళి ఈ ప్రస్తావన తీసుకురారు. శ్రీదేవి మీద అపారమైన గౌరవం ఉన్న నేపథ్యంలో అనవసరంగా హైలైట్ అయ్యేలా ఎంత మాత్రం రచ్చ చేసుకోరు. కాబట్టి బాహుబలి ఎపిక్ ప్రమోషన్లలో ఈ టాపిక్ ఉండదు.
అలాంటప్పుడు బోనీ కపూర్ అదే పనిగా ఫ్లాష్ బ్యాకులు పంచుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. శ్రీదేవి కమిట్మెంట్ అందరికీ తెలిసిందే. రాజమౌళి సిన్సియారిటీని ఎవరూ శంకించరు. అలాంటప్పుడు అప్పుడిలా జరిగింది అలా జరిగిందంటూ గుర్తు చేస్తూ పోతే అది సోషల్ మీడియాకు స్టఫ్ గా మారడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. అక్టోబర్ 31 రీ రిలీజ్ కాబోతున్న బాహుబలి ఎపిక్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కన్పిస్తోంది. కెన్యా నుంచి రాజమౌళి టీమ్ తిరిగి వచ్చాక ప్రమోషన్లు చేపట్టబోతున్నారు. వరల్డ్ వైడ్ పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
This post was last modified on September 6, 2025 5:34 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…