టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయిన బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా కొన్ని విషయాలను ముంబై మీడియా అదే పనిగా తవ్వుతున్న వైనం ఆన్ లైన్ లో కనిపిస్తోంది. రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రకు ముందు శ్రీదేవిని అనుకుని, తర్వాత ఆమె డిమాండ్లను తట్టుకోలేక రాజమౌళి నిర్ణయం మార్చున్నారనే ప్రచారం కొన్నేళ్ల క్రితం బలంగా తిరిగింది. జక్కన్న చెప్పింది ఒకటైతే దానికి అర్థం ఇంకోలా వెళ్లిపోవడం వేరే విషయం. తర్వాత జరిగిన చరిత్ర తెలిసిందే. శ్రీదేవి కాలం చేశారు. బాహుబలి రికార్డులు బద్దలు కొట్టింది. తాజాగా నిర్మాత బోనీ కపూర్ అప్పట్లో జరిగిన వివాదాన్ని మరోసారి తవ్వారు.
శ్రీదేవి గొంతెమ్మ కోరికలు అడిగిందనే ప్రచారం నిజం కాదని, ఇంగ్లీష్ వింగ్లిష్ కన్నా తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం వల్లే వద్దనుకున్నామని, పిల్లలకు సెలవులు ఉన్నప్పుడే షూటింగ్ పెట్టుకుంటే అనుకూలంగా ఉంటుందని చెప్పామని, అంతే తప్ప హోటల్ లో ఫ్లోర్ మొత్తం డిమాండ్ చేయలేదని వివరణ ఇచ్చారు. నిజానికి ఇప్పుడీ టాపిక్ అసందర్భం. ఇది నిజమో కాదో చెప్పేందుకు శ్రీదేవి లేరు. రాజమౌళి ఈ ప్రస్తావన తీసుకురారు. శ్రీదేవి మీద అపారమైన గౌరవం ఉన్న నేపథ్యంలో అనవసరంగా హైలైట్ అయ్యేలా ఎంత మాత్రం రచ్చ చేసుకోరు. కాబట్టి బాహుబలి ఎపిక్ ప్రమోషన్లలో ఈ టాపిక్ ఉండదు.
అలాంటప్పుడు బోనీ కపూర్ అదే పనిగా ఫ్లాష్ బ్యాకులు పంచుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. శ్రీదేవి కమిట్మెంట్ అందరికీ తెలిసిందే. రాజమౌళి సిన్సియారిటీని ఎవరూ శంకించరు. అలాంటప్పుడు అప్పుడిలా జరిగింది అలా జరిగిందంటూ గుర్తు చేస్తూ పోతే అది సోషల్ మీడియాకు స్టఫ్ గా మారడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. అక్టోబర్ 31 రీ రిలీజ్ కాబోతున్న బాహుబలి ఎపిక్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కన్పిస్తోంది. కెన్యా నుంచి రాజమౌళి టీమ్ తిరిగి వచ్చాక ప్రమోషన్లు చేపట్టబోతున్నారు. వరల్డ్ వైడ్ పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
This post was last modified on September 6, 2025 5:34 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…