Political News

నేత‌ల కుంప‌టి: దేన్నీ వ‌ద‌ల‌ట్లేదు

టిడిపి అధినేత చంద్రబాబుకు పెద్ద తలనొప్పి ఎదురవుతోంది. క్షేత్రస్థాయిలో నాయకులను ఆయన ఎన్నిసార్లు హెచ్చరించినా.. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా.. పరిస్థితిలో మార్పు అయితే కనిపించడం లేదు. ఏడాదిన్న‌ర కాలంగా అనే విషయాలలో క్షేత్రస్థాయి నాయకులు చేస్తున్న తప్పుల కారణంగా ప్రభుత్వం నిందలు పడాల్సిన‌ పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లోనూ చులకన భావం కనిపిస్తోంది. చంద్రబాబు హెచ్చరికలు ఏమాత్రం పనిచేయడం లేదన్నది సొంత పార్టీలోనే వినిపిస్తున్న మాట.

గతంలో ఇసుక, లిక్కర్ విషయంలో నాయకులు గాడి తప్పారు. ఈ రెండు అంశాలను ఆధారంగా చేసుకుని ఉచిత ఇసుకను కూడా అమ్ముకున్న పరిస్థితి ఇప్పటికీ కనిపిస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా రైతులకు సంబంధించిన యూరియా విషయంలో కూడా తమ్ముళ్ల ప్రభావం స్పష్టంగా ఉందన్నది చంద్రబాబుకు అందిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కడిక‌క్కడ నాయకులు యూరియాను దారి మళ్ళించారన్నది అధికారులు స్పష్టం చేశారు. మాట కూడా వినడం లేదని కలెక్టర్లు చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు.

పలు జిల్లాల నుంచి అందిన నివేదికలను ఆధారంగా చేసుకుని చంద్రబాబు సమీక్షించినప్పుడు.. నేతలు యూరియాను దారి మళ్ళించారని, తమ తమ అవసరాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నారని చంద్రబాబుకు తెలిసింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇటువంటి నేతలను కట్టడి చేసే బాధ్యతను కలెక్టర్ల చేతిలో పెట్టారు. కానీ, కలెక్టర్లు మాత్రం అసలు మా మాట విననప్పుడు మేమేం చేస్తామని చెప్తున్నారు. నేతలను కట్టడి చేసే విషయంలో చంద్రబాబు మాత్రం కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు.

వ‌చ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర సిద్ధమవుతున్న క్రమంలో నేతల వైఖరి పార్టీకి.. ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగానే మారుతోంది. దేన్నీ వదలకపోవడం. ఏ విషయంలోనూ నేతలు జోక్యం చేసుకోకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడడంతో.. ఇది ఎంత మంచి చేసినా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. దీనిని కట్టడం చేసేందుకు చంద్రబాబు ఏం చేస్తారనేది చూడాలి.

ప్రస్తుతానికైతే ఆయన హెచ్చరికలకే పరిమితం అవుతున్నారు. అంతకుమించి కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఏం జరుగుతుందోన‌ని ఆలోచనగా ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో నాయకులకు చంద్రబాబు అనుసరిస్తున్న విధానం అలుసుగా మారిందన్న చర్చ కూడా నడుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on September 6, 2025 9:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

17 minutes ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

1 hour ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

2 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

3 hours ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

3 hours ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

3 hours ago