పండ్లు కాయలవ్వడం, కాయలు పండ్లవ్వడం అంటే ఇదేనేమో. స్టార్ క్యాస్టింగ్, పెద్ద బడ్జెట్ పెట్టుకున్న ఘాటీ ఎదురీదుతుండగా పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ట్రేడ్ సమాచారం మేరకు మొదటి రోజు సుమారు రెండున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిన్న సినిమా రెండో రోజు అంతకన్నా ఎక్కువ కలెక్ట్ చేయడం ఖాయమే. ఇక ఆదివారం ఎవరి ఊహలకు అందని రీతిలో నెంబర్లు నమోదు కాబోతున్నాయి. చాలా సెంటర్లలో షోలు, టికెట్ల డిమాండ్ పెరిగిపోయి ఇతర రిలీజులకు ముందు చేసుకున్న అగ్రిమెంట్లను పక్కనేపట్టి మరీ ఎక్స్ ట్రా స్క్రీన్లు జోడిస్తున్నారు.
సోషల్ మీడియా సెలబ్రిటీ మౌళిని హీరోగా పెట్టి తీసిన ఈ చిన్న చిత్రం ఇంత సెన్సేషన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. నిబ్బా నిబ్బిల లవ్ స్టోరీ అని కామెంట్లు వినిపిస్తున్నా ఎంటర్ టైన్మెంట్ కోసం మొహాలు వాచిపోయిన ఆడియన్స్ కుటుంబాలతో సహా లిటిల్ హార్ట్స్ కు వస్తున్నారు. ఎలాంటి అసభ్యత లేకుండా దర్శకుడు సాయి మార్తాండ్ తీసిన విధానం ఆకట్టుకుంటోంది. ఓవర్సీస్ విషయానికి వస్తే లక్షా పద్నాలుగు వేల డాలర్లు వసూలు చేయడం నిజంగా షాకే. ఎందుకంటే ఓ మోస్తరు మీడియం రేంజ్ హీరోలకు వీకెండ్ కూడా వసూలు చేయలేని నెంబర్ ఇది. అందుకే ఆశ్చర్యం కలిగిస్తోంది.
సండే మొత్తం లిటిల్ హార్ట్స్ కంట్రోల్ లోనే ఉండబోతోంది. బుక్ మై షోకు గంటకు 7 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఘాటీ కేవలం పదిహేడు వందలకు పరిమితం కాగా మదరాసి తెలుగు వెర్షన్ ఇంచుమించు ఇదే స్థితిలో ఉంది కానీ కొంచెం బెటర్ గా కనిపిస్తోంది. బాలీవుడ్ క్రేజీ మూవీ బాఘీ 4 ఎనిమిదిన్నర వేల దగ్గర ఉండటం గమనార్హం. అంటే దేశమంతా రిలీజైన ఒక పెద్ద హిందీ సినిమాకు, తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన లిటిల్ హార్ట్స్ బుకింగ్స్ కు మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం వెయ్యి టికెట్లు మాత్రమే. సోమవారం నుంచి కూడా ఇదే జోరు కొనసాగిస్తే లాభాలకు హద్దులు పెట్టడం కష్టమే.
This post was last modified on September 6, 2025 6:50 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…