Political News

స‌క్సెస్ మంత్రం: విలేజ్ పాలిటిక్స్‌పై జ‌న‌సేన వ్యూహం

ఏపీలోని గ్రామీణ స్థాయిలో రాజకీయాలు పుంజుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గ్రామస్థాయిలో రాజకీయాలు మారుతున్నాయి. తాజాగా జనసేన పార్టీ ‘విలేజ్ పాలిటిక్స్’ పై దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేస్తున్న నేపథ్యంలో తమ పార్టీని పుంజుకునేలా చేయాలనేది జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహం గా ఉందని నాయకులు చెబుతున్నారు.

పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల నిర్మాణం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను నేరుగా గ్రామీణ ప్రాంతాలకే. పంచాయతీలకే ఆయన జమ చేయిస్తున్నారు. తద్వారా పనులు జోరుగా సాగుతున్నాయి. దీనిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పార్టీపరంగా జనసేన ప్రయత్నాలు ప్రారంభించింది.

గ్రామీణ స్థాయిలో పార్టీని డెవలప్ చేయటం.. గ్రామీణ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే దిశగా జనసేన అడుగులు వేస్తోంది. ఇది సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా జనసేనకు తిరుగు ఉండదు అన్నది ఆ పార్టీ అంచనా. సాధారణంగా పట్టణాలు, నగరాల్లో ప్రజల ఆలోచనా స్థాయి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఒకే దిశగా ఏ రోజు పట్టణ నగర స్థాయిలో ప్రజల ఆలోచన ఉండదు. సమయానుకూలంగా ఆలోచన మారడం, పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం అనేది కనిపిస్తుంది.

కానీ, గ్రామీణ స్థాయిలో ఒకసారి కనుక మంచి మార్కులు సంపాదించుకున్న పార్టీ… దాదాపు దశాబ్దాల తరబడి అదే స్థాయిలో కొనసాగుతూ ఉండడం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో వైసిపి ఇదే తరహా రాజకీయాలు చేసింది. వైయస్ సెంటిమెంట్‌ను, అదేవిధంగా ఆరోగ్యశ్రీ వంటి కీలక పథకాలను అడ్డుపెట్టి గ్రామీణ స్థాయిలో ఆ పార్టీ పుంజుకుంది. ఇప్పుడు అభివృద్ధిని ప్రాతిపదికగా చేసుకుని జనసేన కూడా అలాంటి వ్యూహాలతోనే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. గ్రామీణ స్థాయిలో డెవలప్ కావడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పట్టు సంపాదించే దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తూ ఉండడం విశేషం. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.

This post was last modified on September 6, 2025 8:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

21 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

44 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

54 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

1 hour ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago