Political News

బీజేపీని ఇరికించేసిన రేవంత్ రెడ్డి.. విష‌యం ఇదీ!

రాజ‌కీయాలు.. రాజ‌కీయాలే. ఏం చేసినా.. దాని వెనుక మ‌ర్మం.. ఖ‌చ్చితంగా ఉంటుంది. తాజాగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు అవినీతి, అక్ర‌మాల‌పై.. నియ‌మించిన జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ రిపోర్టు అంశం.. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. తెలంగాణ‌లోని ఏ కూడ‌లిలో చూసినా.. ఏ బ‌స్తీలో క‌నిపించినా.. ఇదే చ‌ర్చ‌. ఏ ఇద్ద‌రు క‌లిసినా.. ‘కేసీఆర్ స‌ర్‌’ గురించే చ‌ర్చ‌. ఇక‌, ఈ క‌మిష‌న్ రిపోర్టుపై.. ఆదివారం సాయంత్రం 4 గంట‌ల నుంచి అర్ధ‌రాత్రి 12.12 గంట‌ల వ‌రకు కూడా అసెంబ్లీలో సుదీర్ఘ చ‌ర్చ సాగింది.

అనంత‌రం.. ఈ కేసును సీబీఐకి అప్ప‌గిస్తున్న‌ట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీనిలో జ‌రిగిన అవినీతి.. అక్ర‌మాలు వెలుగు చూడ‌డంతోపాటు.. సొమ్మును రాబ‌ట్టాల‌న్న‌ది త‌మ ధ్యేయంగా రేవంత్ చెప్పారు. అందుకే.. అంతిమంగా.. తాము సీబీఐకి ఇవ్వాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. దీనిపై అభ్యంత‌రాలు ఉంటే తెలుసుకుంటామ‌ని.. పేర్కొంటూ.. ఎంఐఎం స‌హా మిత్ర‌ప‌క్షం సీపీఐని కూడా రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. అంద‌రూ మౌనంగా ఉండ‌డంతో సీబీఐకి అప్ప‌గిస్తున్నాన‌ని చెప్పారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారంలో రేవంత్ రాజ‌కీయ కోణం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ పైన‌, కాళేశ్వ‌రం క‌మిష‌న్‌పై నా.. ఆచితూచి వ్య‌వ‌హ‌రించిన బీజేపీ నాయ‌కులు ఇప్పుడు ఏం చేస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. తాము చేయాల్సింది తాము చేశామ‌ని.. రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇక‌, ఇప్పుడు సీబీఐ ఉన్న‌ది కేంద్రంలో అంటే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే స‌ర్కారు ప‌రిధిలో. సో.. ఇప్పుడు సీబీఐ ఏమేర‌కు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంది.. ఏమేర‌కు కాళేశ్వ‌రం అవినీతిని వెలుగులోకి తెస్తుందనేది కేంద్రంలోని బీజేపీ పై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది ఒక ఎత్త‌యితే.. ఇక నుంచి జ‌ర‌గేదిమ‌రో ఎత్తు. సీబీఐ ద‌ర్యాప్తు పూర్తిగా(ఎంత స్వ‌తంత్ర సంస్థ‌యినా) కేంద్రం అధీనంలో ఉంది కాబ‌ట్టి.. కేంద్రంలోని పెద్ద‌లు.. ఏమేర‌కు త‌మ నిజాయితీని చూపిస్తార‌న్నది ఈ విచార‌ణ‌తో తేలిపోతుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అందుకే రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని సిట్ కాకుండా.. కేంద్ర ప‌రిధిలోని సీబీఐ వైపు సీఎం రేవంత్ మొగ్గు చూపారని చెబుతున్నారు. ఫ‌లితంగా బీజేపీని ఒక‌ర‌కంగా ఆయ‌న ఇరికించార‌న్న వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 2, 2025 9:05 am

Share

Recent Posts

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

12 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

56 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

5 hours ago