Political News

మోదీ – పుతిన్ ఫోన్ కాల్.. ఎంటీ సంకేతం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత్‌పై భారీ సుంకాలు విధించగా, ఆ ప్రభావం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తోందనే కారణంతో ఈ చర్య తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ పరిణామం తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాతో చర్చలు జరిపి, ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారానికి మార్గాలు అన్వేషించారు. ఆ వెంటనే ఆయన నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త సందేశాన్ని ఇచ్చింది. ఇది కేవలం ఉక్రెయిన్ యుద్ధమే కాదు, గ్లోబల్‌ వాణిజ్య సమీకరణలకు సంబంధించిన సంకేతంగా కూడా కనిపిస్తోంది.

మోదీ ఫోన్ సంభాషణలో ప్రధానంగా భారత్‌ యొక్క స్థానం స్పష్టంగా కనిపించింది. ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుత పరిష్కారమే మార్గమని మోదీ మళ్ళీ పునరుద్ఘాటించారు. ఇది భారత్‌ ఎప్పటినుంచీ అనుసరిస్తున్న సూత్రాల కొనసాగింపే అయినప్పటికీ, ఈ సమయంలో చెప్పడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే అమెరికా నేరుగా భారత్‌పై ఒత్తిడి పెంచుతుంటే, రష్యా మాత్రం భారత్‌ను సమీకరించుకోవాలని చూస్తోంది.

ఈ ఫోన్ సంభాషణ ద్వారా పుతిన్‌ రెండు విషయాలను స్పష్టంగా తెలియజేశారని విశ్లేషకుల అభిప్రాయం. మొదటిది, రష్యా-అమెరికా చర్చల్లో వచ్చిన అభిప్రాయాలను భారత్‌తో పంచుకోవడం ద్వారా నమ్మకాన్ని పెంచడం. రెండోది, అమెరికా విధించిన సుంకాలకు వ్యతిరేకంగా భారత్‌ను తనవైపు దృఢంగా నిలబెట్టుకోవడం. గ్లోబల్‌ ఎనర్జీ మార్కెట్‌లో భారత్‌ ప్రధాన కొనుగోలుదారు కావడం రష్యాకు అత్యంత కీలకం. అందువల్ల మోదీతో సమీప సంబంధం కొనసాగించడం పుతిన్‌ దౌత్య వ్యూహంలో భాగంగా ఉంది.

రష్యా పట్ల సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూనే, ఉక్రెయిన్ విషయంలో శాంతి దిశగా మద్దతు తెలిపడం ద్వారా పశ్చిమ దేశాలకు కూడా సంకేతమిచ్చారు. ఇది భారత్‌ ‘బహుళ సమతుల్యత’ (multi-alignment) విదేశాంగ విధానానికి ప్రతీక. అంటే ఏకపక్షంగా ఒకరికి వత్తాసు పలకడం కాదు, పరిస్థితులకు అనుగుణంగా అందరితో సంబంధాలను కొనసాగించడం.

మొత్తం చూస్తే, ట్రంప్‌ సుంకాల దెబ్బతో భారత్‌ ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో పుతిన్ మోదీ ఫోన్ సంభాషణ కేవలం నామమాత్రమేనని చెప్పడం కష్టం. ఇది భవిష్యత్‌ గ్లోబల్‌ దౌత్య సమీకరణల్లో భారత్‌ పాత్ర ఎంత కీలకమో గుర్తు చేస్తోంది. భారత్‌ ఒకవైపు అమెరికా మార్కెట్, టెక్నాలజీకి ఆధారపడుతుంటే, మరోవైపు రష్యా చమురు, రక్షణ సహకారం అవసరం అవుతుంది. ఈ రెండింటి మధ్య సమతులనం కాపాడుతూ ముందుకు సాగడమే మోదీకి ఉన్న పెద్ద సవాలు అని చెప్పాలి.

This post was last modified on August 18, 2025 9:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

29 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

48 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago