Political News

మోదీ – పుతిన్ ఫోన్ కాల్.. ఎంటీ సంకేతం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత్‌పై భారీ సుంకాలు విధించగా, ఆ ప్రభావం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తోందనే కారణంతో ఈ చర్య తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ పరిణామం తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాతో చర్చలు జరిపి, ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారానికి మార్గాలు అన్వేషించారు. ఆ వెంటనే ఆయన నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త సందేశాన్ని ఇచ్చింది. ఇది కేవలం ఉక్రెయిన్ యుద్ధమే కాదు, గ్లోబల్‌ వాణిజ్య సమీకరణలకు సంబంధించిన సంకేతంగా కూడా కనిపిస్తోంది.

మోదీ ఫోన్ సంభాషణలో ప్రధానంగా భారత్‌ యొక్క స్థానం స్పష్టంగా కనిపించింది. ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుత పరిష్కారమే మార్గమని మోదీ మళ్ళీ పునరుద్ఘాటించారు. ఇది భారత్‌ ఎప్పటినుంచీ అనుసరిస్తున్న సూత్రాల కొనసాగింపే అయినప్పటికీ, ఈ సమయంలో చెప్పడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే అమెరికా నేరుగా భారత్‌పై ఒత్తిడి పెంచుతుంటే, రష్యా మాత్రం భారత్‌ను సమీకరించుకోవాలని చూస్తోంది.

ఈ ఫోన్ సంభాషణ ద్వారా పుతిన్‌ రెండు విషయాలను స్పష్టంగా తెలియజేశారని విశ్లేషకుల అభిప్రాయం. మొదటిది, రష్యా-అమెరికా చర్చల్లో వచ్చిన అభిప్రాయాలను భారత్‌తో పంచుకోవడం ద్వారా నమ్మకాన్ని పెంచడం. రెండోది, అమెరికా విధించిన సుంకాలకు వ్యతిరేకంగా భారత్‌ను తనవైపు దృఢంగా నిలబెట్టుకోవడం. గ్లోబల్‌ ఎనర్జీ మార్కెట్‌లో భారత్‌ ప్రధాన కొనుగోలుదారు కావడం రష్యాకు అత్యంత కీలకం. అందువల్ల మోదీతో సమీప సంబంధం కొనసాగించడం పుతిన్‌ దౌత్య వ్యూహంలో భాగంగా ఉంది.

రష్యా పట్ల సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూనే, ఉక్రెయిన్ విషయంలో శాంతి దిశగా మద్దతు తెలిపడం ద్వారా పశ్చిమ దేశాలకు కూడా సంకేతమిచ్చారు. ఇది భారత్‌ ‘బహుళ సమతుల్యత’ (multi-alignment) విదేశాంగ విధానానికి ప్రతీక. అంటే ఏకపక్షంగా ఒకరికి వత్తాసు పలకడం కాదు, పరిస్థితులకు అనుగుణంగా అందరితో సంబంధాలను కొనసాగించడం.

మొత్తం చూస్తే, ట్రంప్‌ సుంకాల దెబ్బతో భారత్‌ ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో పుతిన్ మోదీ ఫోన్ సంభాషణ కేవలం నామమాత్రమేనని చెప్పడం కష్టం. ఇది భవిష్యత్‌ గ్లోబల్‌ దౌత్య సమీకరణల్లో భారత్‌ పాత్ర ఎంత కీలకమో గుర్తు చేస్తోంది. భారత్‌ ఒకవైపు అమెరికా మార్కెట్, టెక్నాలజీకి ఆధారపడుతుంటే, మరోవైపు రష్యా చమురు, రక్షణ సహకారం అవసరం అవుతుంది. ఈ రెండింటి మధ్య సమతులనం కాపాడుతూ ముందుకు సాగడమే మోదీకి ఉన్న పెద్ద సవాలు అని చెప్పాలి.

This post was last modified on August 18, 2025 9:51 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

2 hours ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

3 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

3 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

5 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

6 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

6 hours ago