Political News

మోదీ – పుతిన్ ఫోన్ కాల్.. ఎంటీ సంకేతం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత్‌పై భారీ సుంకాలు విధించగా, ఆ ప్రభావం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తోందనే కారణంతో ఈ చర్య తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ పరిణామం తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాతో చర్చలు జరిపి, ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారానికి మార్గాలు అన్వేషించారు. ఆ వెంటనే ఆయన నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త సందేశాన్ని ఇచ్చింది. ఇది కేవలం ఉక్రెయిన్ యుద్ధమే కాదు, గ్లోబల్‌ వాణిజ్య సమీకరణలకు సంబంధించిన సంకేతంగా కూడా కనిపిస్తోంది.

మోదీ ఫోన్ సంభాషణలో ప్రధానంగా భారత్‌ యొక్క స్థానం స్పష్టంగా కనిపించింది. ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుత పరిష్కారమే మార్గమని మోదీ మళ్ళీ పునరుద్ఘాటించారు. ఇది భారత్‌ ఎప్పటినుంచీ అనుసరిస్తున్న సూత్రాల కొనసాగింపే అయినప్పటికీ, ఈ సమయంలో చెప్పడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే అమెరికా నేరుగా భారత్‌పై ఒత్తిడి పెంచుతుంటే, రష్యా మాత్రం భారత్‌ను సమీకరించుకోవాలని చూస్తోంది.

ఈ ఫోన్ సంభాషణ ద్వారా పుతిన్‌ రెండు విషయాలను స్పష్టంగా తెలియజేశారని విశ్లేషకుల అభిప్రాయం. మొదటిది, రష్యా-అమెరికా చర్చల్లో వచ్చిన అభిప్రాయాలను భారత్‌తో పంచుకోవడం ద్వారా నమ్మకాన్ని పెంచడం. రెండోది, అమెరికా విధించిన సుంకాలకు వ్యతిరేకంగా భారత్‌ను తనవైపు దృఢంగా నిలబెట్టుకోవడం. గ్లోబల్‌ ఎనర్జీ మార్కెట్‌లో భారత్‌ ప్రధాన కొనుగోలుదారు కావడం రష్యాకు అత్యంత కీలకం. అందువల్ల మోదీతో సమీప సంబంధం కొనసాగించడం పుతిన్‌ దౌత్య వ్యూహంలో భాగంగా ఉంది.

రష్యా పట్ల సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూనే, ఉక్రెయిన్ విషయంలో శాంతి దిశగా మద్దతు తెలిపడం ద్వారా పశ్చిమ దేశాలకు కూడా సంకేతమిచ్చారు. ఇది భారత్‌ ‘బహుళ సమతుల్యత’ (multi-alignment) విదేశాంగ విధానానికి ప్రతీక. అంటే ఏకపక్షంగా ఒకరికి వత్తాసు పలకడం కాదు, పరిస్థితులకు అనుగుణంగా అందరితో సంబంధాలను కొనసాగించడం.

మొత్తం చూస్తే, ట్రంప్‌ సుంకాల దెబ్బతో భారత్‌ ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో పుతిన్ మోదీ ఫోన్ సంభాషణ కేవలం నామమాత్రమేనని చెప్పడం కష్టం. ఇది భవిష్యత్‌ గ్లోబల్‌ దౌత్య సమీకరణల్లో భారత్‌ పాత్ర ఎంత కీలకమో గుర్తు చేస్తోంది. భారత్‌ ఒకవైపు అమెరికా మార్కెట్, టెక్నాలజీకి ఆధారపడుతుంటే, మరోవైపు రష్యా చమురు, రక్షణ సహకారం అవసరం అవుతుంది. ఈ రెండింటి మధ్య సమతులనం కాపాడుతూ ముందుకు సాగడమే మోదీకి ఉన్న పెద్ద సవాలు అని చెప్పాలి.

This post was last modified on August 18, 2025 9:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago