Political News

కొరివితో గోక్కోవ‌డం అంటే ఇదే.. జ‌న‌సేన ఎమ్మెల్యే వివాదం!

కొరివితో త‌ల‌గోక్కోవ‌డం.. లేనిపోని బుర‌ద‌ను తాము అంటించుకుని పార్టీకి కూడా అంటించ‌డం.. ఇటీవ‌ల కాలంలో ఏపీలో ఉన్న కూట‌మి ఎమ్మెల్యేల‌కు అల‌వాటుగా మారిపోయింది. గ‌త ఆరు మాసాల నుంచి ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అన్న‌ట్టుగా వివాదాల‌ను త‌మ చుట్టూ తిప్పుకొంటున్నారు. ఒక‌వైపు.. టీడీపీ ఎమ్మెల్యేలు దారి త‌ప్పుతున్నార‌ని.. సీఎం చంద్ర‌బాబు ల‌బోదిబోమంటున్న‌విష‌యం తెలిసిందే. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేయొద్ద‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన వంతు వ‌చ్చింది. ఆ పార్టీకి చెందిన నాయ‌కుడు ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసి.. లేనిపోని క‌ష్టాలు తెచ్చి పెట్టారు.

జ‌న‌సేన పార్టీ తాడేప‌ల్లిగూడెం ఎమ్మెల్యే, ఫ‌స్ట్ టైమ్ గెలిచిన బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఆరుగొల‌ను గ్రామంలో కాపు నాయ‌కుడు వంగ‌వీటి మోహ‌న్‌ రంగా కాంస్య విగ్ర‌హాన్ని స్థాపించారు. దీనిని ఆయ‌న ఎమ్మెల్యే హోదాలో వెళ్లి ఆవిష్క‌రించారు. సాధార‌ణంగా ఇలాంటి స‌మ‌యాల్లో నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల్లో రంగా ప్ర‌తిభ‌ను కొనియాడుతారు. ఆయ‌న సేవ‌ల‌ను కూడా గుర్తు చేసుకుంటారు. కుదిరితే పార్టీకి ప్ర‌యోజ‌న‌కరంగా ఉండే వ్యాఖ్య‌లు కూడా చేస్తారు. కానీ, బొలిశెట్టి పూర్తిగా దారి త‌ప్పారు.

రంగా హ‌త్య సంగ‌తిని బొలిశెట్టి ప్ర‌స్తావించారు. “రంగాను ప్రభుత్వంతోనే చంపించారు.” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. “నాకు ప్రాణ రక్షణ కల్పించండి అని రంగా నిరాహార దీక్ష చేశారు.(వాస్త‌వానికి కొండ ప్రాంతాల్లో నివ‌శిస్తున్న పేద‌ల ఇళ్ల‌కు ప‌ట్టాలు ఇవ్వాల‌ని కోరుతూ దీక్ష చేప‌ట్టారు.) అలాంటి సమయంలో కొంత మంది నాయకులు ప్రభుత్వంతో కుమ్మ‌క్క‌యి ఆయన్ని చంపించారు.” అని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాదు.. ఇప్పుడు రంగాను త‌మ వాడేన‌ని వారే అంటున్నారని మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఒక్క‌సారిగా ఈ వ్య‌వ‌హారం.. సంచ‌ల‌నంగా మారిపోయింది.

వాస్త‌వానికి 1988లో జ‌రిగిన రంగా హ‌త్య కేసును కోర్టు ఎప్పుడో కొట్టేసింది. ఆయ‌న కుమారుడు రాధా కూడా దీనిపై స‌వాల్ చేయ‌బోమ‌ని చెప్పారు. రాజ‌కీయ క‌క్ష‌ల‌తోనే త‌న తండ్రి చ‌నిపోయార‌ని.. దీనికి ఏపార్టీ కూడా కార‌ణం కాద‌ని.. గ‌తంలోనే రాధా చెప్పుకొచ్చారు. అనంత‌రం.. ఆయ‌న ప‌లు పార్టీలు మారుతూ.. టీడీపీ పంచ‌న చేరారు. కానీ, ఇప్పుడు బొలిశెట్టి మాత్రం .. ఈ విష‌యాన్ని రెచ్చ‌గొట్టేలా చేసిన వ్యాఖ్య‌లు.. దుమారం రేపుతున్నాయి. దీనిపై జ‌న‌సేన వైఖ‌రి చెప్పాలంటూ..కాపునాడు నాయ‌కులు డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. దీనిపై జ‌న‌సేన కీల‌క నాయ‌కులు కూడా నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. గ‌తంలో బొలిశెట్టి వైసీపీ నాయ‌కురాలు రోజాపైనా అత్యంత దారుణ వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

Satya

Recent Posts

పేరు చెబితే ల‌క్ష… స‌ర్కారు బంప‌ర్ ఆఫ‌ర్‌!

ప్ర‌భుత్వాలు చేప‌ట్టే కీల‌క కార్య‌క్ర‌మాల‌కు పేర్లు సూచించే వారికి బ‌హుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుక‌లు కూడా ఇస్తాయి. గ‌తంలో స్వ‌చ్ఛ…

1 hour ago

జ‌గ‌న్ నాన్చారు.. చంద్ర‌బాబు తేల్చారు: ఉద్యోగుల‌కు పండ‌గ‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో ఐదేళ్లు పాలించిన జ‌గ‌న్‌.. నానుస్తూ వ‌చ్చి.. చివ‌ర‌కు త‌న‌కు సాధ్యంకాద‌ని…

2 hours ago

కళ్యాణ్ రామ్ మీద నవ్వించే బరువు

వెంకటేష్, అనిల్ రావిపూడి అయిదోసారి చేతులు కలిపిన మల్టీస్టారర్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. వెంకీకి తోడుగా కళ్యాణ్ రామ్…

3 hours ago

కోటీశ్వరుడితో పెళ్ళి, కానీ ప్రేమికుడి కోసం….

పెళ్ల‌యిన త‌ర్వాత‌.. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం కామ‌న్‌. ఈ క్ర‌మంలో ఒక‌ప్పుడు భార్య‌ల‌ను చంపే భ‌ర్త‌ల వ్య‌వ‌హారాలు పెద్ద…

8 hours ago

తెప్ప త‌గ‌లేసిన త‌మ‌న్నా

కెరీర్ తొలి నాళ్ల‌లో పెద్ద‌గా అవ‌కాశాలు లేన‌పుడు ద‌క్షిణాదిన వ‌చ్చే ప్ర‌తి ఛాన్సునూ మ‌హా ప్ర‌సాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…

8 hours ago

పెద్ది ఈవెంట్ లో పవన్ హవా

మెగా హీరోల సినిమాల‌కు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్క‌డో ఒక చోట ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

11 hours ago