Political News

కొరివితో గోక్కోవ‌డం అంటే ఇదే.. జ‌న‌సేన ఎమ్మెల్యే వివాదం!

కొరివితో త‌ల‌గోక్కోవ‌డం.. లేనిపోని బుర‌ద‌ను తాము అంటించుకుని పార్టీకి కూడా అంటించ‌డం.. ఇటీవ‌ల కాలంలో ఏపీలో ఉన్న కూట‌మి ఎమ్మెల్యేల‌కు అల‌వాటుగా మారిపోయింది. గ‌త ఆరు మాసాల నుంచి ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అన్న‌ట్టుగా వివాదాల‌ను త‌మ చుట్టూ తిప్పుకొంటున్నారు. ఒక‌వైపు.. టీడీపీ ఎమ్మెల్యేలు దారి త‌ప్పుతున్నార‌ని.. సీఎం చంద్ర‌బాబు ల‌బోదిబోమంటున్న‌విష‌యం తెలిసిందే. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేయొద్ద‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన వంతు వ‌చ్చింది. ఆ పార్టీకి చెందిన నాయ‌కుడు ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసి.. లేనిపోని క‌ష్టాలు తెచ్చి పెట్టారు.

జ‌న‌సేన పార్టీ తాడేప‌ల్లిగూడెం ఎమ్మెల్యే, ఫ‌స్ట్ టైమ్ గెలిచిన బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఆరుగొల‌ను గ్రామంలో కాపు నాయ‌కుడు వంగ‌వీటి మోహ‌న్‌ రంగా కాంస్య విగ్ర‌హాన్ని స్థాపించారు. దీనిని ఆయ‌న ఎమ్మెల్యే హోదాలో వెళ్లి ఆవిష్క‌రించారు. సాధార‌ణంగా ఇలాంటి స‌మ‌యాల్లో నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల్లో రంగా ప్ర‌తిభ‌ను కొనియాడుతారు. ఆయ‌న సేవ‌ల‌ను కూడా గుర్తు చేసుకుంటారు. కుదిరితే పార్టీకి ప్ర‌యోజ‌న‌కరంగా ఉండే వ్యాఖ్య‌లు కూడా చేస్తారు. కానీ, బొలిశెట్టి పూర్తిగా దారి త‌ప్పారు.

రంగా హ‌త్య సంగ‌తిని బొలిశెట్టి ప్ర‌స్తావించారు. “రంగాను ప్రభుత్వంతోనే చంపించారు.” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. “నాకు ప్రాణ రక్షణ కల్పించండి అని రంగా నిరాహార దీక్ష చేశారు.(వాస్త‌వానికి కొండ ప్రాంతాల్లో నివ‌శిస్తున్న పేద‌ల ఇళ్ల‌కు ప‌ట్టాలు ఇవ్వాల‌ని కోరుతూ దీక్ష చేప‌ట్టారు.) అలాంటి సమయంలో కొంత మంది నాయకులు ప్రభుత్వంతో కుమ్మ‌క్క‌యి ఆయన్ని చంపించారు.” అని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాదు.. ఇప్పుడు రంగాను త‌మ వాడేన‌ని వారే అంటున్నారని మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఒక్క‌సారిగా ఈ వ్య‌వ‌హారం.. సంచ‌ల‌నంగా మారిపోయింది.

వాస్త‌వానికి 1988లో జ‌రిగిన రంగా హ‌త్య కేసును కోర్టు ఎప్పుడో కొట్టేసింది. ఆయ‌న కుమారుడు రాధా కూడా దీనిపై స‌వాల్ చేయ‌బోమ‌ని చెప్పారు. రాజ‌కీయ క‌క్ష‌ల‌తోనే త‌న తండ్రి చ‌నిపోయార‌ని.. దీనికి ఏపార్టీ కూడా కార‌ణం కాద‌ని.. గ‌తంలోనే రాధా చెప్పుకొచ్చారు. అనంత‌రం.. ఆయ‌న ప‌లు పార్టీలు మారుతూ.. టీడీపీ పంచ‌న చేరారు. కానీ, ఇప్పుడు బొలిశెట్టి మాత్రం .. ఈ విష‌యాన్ని రెచ్చ‌గొట్టేలా చేసిన వ్యాఖ్య‌లు.. దుమారం రేపుతున్నాయి. దీనిపై జ‌న‌సేన వైఖ‌రి చెప్పాలంటూ..కాపునాడు నాయ‌కులు డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. దీనిపై జ‌న‌సేన కీల‌క నాయ‌కులు కూడా నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. గ‌తంలో బొలిశెట్టి వైసీపీ నాయ‌కురాలు రోజాపైనా అత్యంత దారుణ వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

This post was last modified on August 18, 2025 9:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago