Political News

మీకు బెయిల్ ఇవ్వ‌లేం: మిథున్ రెడ్డికి కోర్టు షాక్‌

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం వ్య‌వ‌హారంలో ఏ-4గా ఉన్న రాజంపేట ఎంపీ, వైసీపీ కీల‌క నాయ‌కుడు పెద్ది రెడ్డి మిథున్ రెడ్డి ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్నారు. ఆయ‌న‌తోపాటు.. మాజీ ఐఏఎస్ అధికారి ధ‌నుంజ‌య్ రెడ్డి, జ‌గ‌న్ మాజీ ఓఎస్‌డీ కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ సంస్థ ఆడిట‌ర్ బాలాజీ గోవింద‌ప్ప‌లు విజ‌య‌వాడ జైల్లో ఉన్నారు. అయితే.. వీరు త‌మ‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ.. విజ‌య‌వాడలోని ఏసీబీ కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై నాలుగు సార్లు విచార‌ణ కూడా జ‌రిగింది. వారికి బెయిల్ ఇవ్వ‌రాద‌ని.. ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్య‌క ద‌ర్యాప్తు బృందం అధికారులు కోర్టుకు విన్న‌వించారు.

దీనికి సంబంధించి జ‌రిగిన అన్ని విచార‌ణ‌ల్లోనూ సిట్ అధికారులు బ‌ల‌మైన ఆధారాల‌ను చూపించారు. అంతేకాదు.. మ‌ద్యం స్కాంలో మిథున్ రెడ్డి న‌గ‌దును త‌రలించ‌డంలోనూ.. స్కాంకు రూప‌క‌ల్ప‌న చేయ‌డంలోనూ పాలుపంచుకున్నార‌ని.. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు చెందిన కంపెనీకి రూ.5 కోట్లు వ‌చ్చాయ‌ని.. తెలివిగా వాటిని తిరిగి ఇచ్చేశార‌ని కూడా గ‌త వాద‌న‌ల్లో వినిపించారు. ఇక‌, మాజీ ఐఏఎస్ ధ‌నుంజ‌య‌రెడ్డి కూడా ఈ స్కాంలో కీల‌క రోల్ పోషించార‌ని తెలిపారు. మ‌ద్యం కుంభ‌కోణానికి రూప‌క‌ల్పన చేసిన వారిలో ఆయ‌న కూడా ఉన్నార‌ని చెప్పారు. అలాగే.. మాజీ ఓఎస్‌డీ కృష్ణ‌మోహ‌న్‌.. అనేక సంద‌ర్భాల్లో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో పాలు పంచుకున్నార‌ని తెలిపారు.

ఇక‌, ఆడిట‌ర్ గోవింద‌ప్ప‌.. మ‌ద్యం కుంభ‌కోణం ద్వారా వ‌చ్చిన నిధుల‌ను ఎలా మ‌ళ్లించాలి? ఏయే రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టాలి? అనే విష‌యాల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డంతోపాటు.. 150 కోట్ల‌ను దారిమ‌ళ్లించార‌ని సిట్ అధికారులు కోర్టుకు వివ‌రించా రు. ఇక‌, పిటిష‌నర్ల త‌ర‌ఫున న్యాయ‌వాదులు మాత్రం అస‌లు త‌మ వారికి ఎలాంటి ప్ర‌మేయం లేద‌ని.. ప్ర‌భుత్వం విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంద‌ని వివ‌రించారు. ఎంపీకి అస‌లు రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల్లో జోక్యం చేసుకునే అవ‌కాశం లేద‌ని కూడా పేర్కొన్నారు. మొత్తంగా ఇరు ప‌క్షాల వాద‌న‌లు న‌మోదు చేసుకున్న కోర్టు.. తాజాగా తీర్పు వెలువ‌రించింది.

సిట్ అధికారులు(ప్రాసిక్యూష‌న్‌) ఇచ్చిన వివ‌రాలు.. దాఖ‌లుచేసిన రెండు చార్జిషీట్ల‌లో నిందితులు త‌ప్పు చేశార‌న్న విష‌యం స్ప‌ష్టంగా ఉంద‌ని.. బ‌ల‌మైన ఆధారాలు కూడా ఉన్నాయ‌ని ఏసీబీ కోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. బెయిల్ పొందేందుకు.. ఈ న‌లుగురిలో ఎవ‌రూ అర్హులు కార‌ని పేర్కొంది. ఎంపి అయినా.. రాష్ట్రానికి చెందిన వారేన‌ని.. గ‌తంలో అనేక కేసులు కూడా ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డిన కోర్టు.. బెయిల్ ఇవ్వ‌లేమ‌ని పేర్కొంటూ.. పిటిష‌న్ల‌పై విచార‌ణ‌ను ముగించింది. దీంతో పై న‌లుగురు హైకోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంద‌ని వారి త‌ర‌ఫు న్యాయ‌వాదులు పేర్కొన్నారు.

This post was last modified on August 18, 2025 9:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొరటాల మాస్… బాలయ్య కార్పెంటర్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…

3 hours ago

సువేందు అధికారి ఆనే నేను..

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో బెంగాల్‌ సీఎంగా సువేందు…

3 hours ago

వీరభద్రుడికి ముందు నుయ్యి వెనుక గొయ్యి

ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…

3 hours ago

పవన్ అభిమానులు… కొత్త ట్రాప్ లో పడొద్దు…

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…

4 hours ago

సుమంత్ పేరు వెనుక‌ ప్ర‌భాస్ ఎందుకు?

మేం ఫేమ‌స్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ న‌టుడు సుమంత్ ప్ర‌భాస్. షార్ట్ ఫిలిమ్స్ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన ఈ…

5 hours ago

దిల్ రాజుకు దెబ్బ మీద దెబ్బ‌

ఇప్పుడు టాలీవుడ్లో ఏ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ ప‌రిస్థితీ అంత బాగా లేదు. స‌క్సెస్ రేట్ అంత‌కంత‌కూ ప‌డిపోతోంది. జ‌నాలు థియేట‌ర్ల‌కు…

5 hours ago