ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఆ పార్టీ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో మాస్టర్ మైండ్గా వ్యవహరించారని సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన ఛార్జిషీటులో పేర్కొన్నారు. మద్యం కంపెనీల నుంచి ఎంతెంత ముడుపులు తీసుకోవాలి? వాటిని ఎక్కడ దాచాలి..? ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలి? ఎవరికి చేర్చాలన్న విషయంపై పెద్ద ఎత్తున కసరత్తు చేసింది కూడా మిథున్ రెడ్డేనని.. చార్జిషీట్లో సిట్ అధికారులు వివరించారు.
అనంతరం.. ఆయనను పలు మార్లు విచారణకు పిలిచారు. దీంతో అరెస్టు భయంతో కోర్టులను ఆశ్రయించినా.. ప్రయోజనం దక్క లేదు. దీంతో శనివారం.. మిథున్ను సిట్ అధికారులు అరెస్టు చేయడం.. ఆదివారం కోర్టులో హాజరుపరచడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆగస్టు 1 వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ.. విజయవాడలోని ఏసీబీకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు మిథున్ రెడ్డిని తరలించారు. అయితే.. ఈ క్రమంలోనే జైలులో తనకు సుదపాయాలు కల్పించాలని.. తాను అనారోగ్యంతో ఉన్నానని కోర్టును కోరారు. మొత్తంగా మూడు పిటిషన్లలను దాఖలు చేశారు.
వీటిపై విచారణ చేపట్టిన కోర్టు.. మిథున్ రెడ్డికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించింది. మిథున్ రెడ్డికి రాజమండ్రి కేంద్ర కారాగారంలో… టీవీ, మెత్తటి పరుపు, వెస్ట్రన్ కమోడ్ ఉండే టాయిలెట్, మూడు పూట్ల బయట నుంచి భోజనం, చిరుతిళ్లు, టిఫిన్లు, టీ , కాఫీ, పాలు వంటివి ఏర్పాటు చేయాలని పేర్కొంది. అలాగే.. దోమ తెర, యోగా చేసుకునేందుకు వీలుగా మ్యాట్, వాకింగ్ షూస్, వార్త పత్రికలు..కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. నిరంతరం పర్యవేక్షణకు ఒక సహాయకుడిని అందుబాటులో ఉంచాలని పేర్కొంది. అలాగే, ఇద్దరు లాయర్లు తో ఏకాంతంగా వారానికి ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇంకా రెగ్యులర్ మెడిసిన్, నోట్ బుక్స్, పెన్నులు సమకూర్చాలని జైలు అధికారులకు కోర్టు ఆర్డర్ పాస్ చేసింది.
This post was last modified on July 22, 2025 9:05 am
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…
భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…