ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఆ పార్టీ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో మాస్టర్ మైండ్గా వ్యవహరించారని సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన ఛార్జిషీటులో పేర్కొన్నారు. మద్యం కంపెనీల నుంచి ఎంతెంత ముడుపులు తీసుకోవాలి? వాటిని ఎక్కడ దాచాలి..? ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలి? ఎవరికి చేర్చాలన్న విషయంపై పెద్ద ఎత్తున కసరత్తు చేసింది కూడా మిథున్ రెడ్డేనని.. చార్జిషీట్లో సిట్ అధికారులు వివరించారు.
అనంతరం.. ఆయనను పలు మార్లు విచారణకు పిలిచారు. దీంతో అరెస్టు భయంతో కోర్టులను ఆశ్రయించినా.. ప్రయోజనం దక్క లేదు. దీంతో శనివారం.. మిథున్ను సిట్ అధికారులు అరెస్టు చేయడం.. ఆదివారం కోర్టులో హాజరుపరచడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆగస్టు 1 వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ.. విజయవాడలోని ఏసీబీకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు మిథున్ రెడ్డిని తరలించారు. అయితే.. ఈ క్రమంలోనే జైలులో తనకు సుదపాయాలు కల్పించాలని.. తాను అనారోగ్యంతో ఉన్నానని కోర్టును కోరారు. మొత్తంగా మూడు పిటిషన్లలను దాఖలు చేశారు.
వీటిపై విచారణ చేపట్టిన కోర్టు.. మిథున్ రెడ్డికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించింది. మిథున్ రెడ్డికి రాజమండ్రి కేంద్ర కారాగారంలో… టీవీ, మెత్తటి పరుపు, వెస్ట్రన్ కమోడ్ ఉండే టాయిలెట్, మూడు పూట్ల బయట నుంచి భోజనం, చిరుతిళ్లు, టిఫిన్లు, టీ , కాఫీ, పాలు వంటివి ఏర్పాటు చేయాలని పేర్కొంది. అలాగే.. దోమ తెర, యోగా చేసుకునేందుకు వీలుగా మ్యాట్, వాకింగ్ షూస్, వార్త పత్రికలు..కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. నిరంతరం పర్యవేక్షణకు ఒక సహాయకుడిని అందుబాటులో ఉంచాలని పేర్కొంది. అలాగే, ఇద్దరు లాయర్లు తో ఏకాంతంగా వారానికి ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇంకా రెగ్యులర్ మెడిసిన్, నోట్ బుక్స్, పెన్నులు సమకూర్చాలని జైలు అధికారులకు కోర్టు ఆర్డర్ పాస్ చేసింది.
This post was last modified on July 22, 2025 9:05 am
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…