Political News

అమ‌రావ‌తిపై భారీ అప్డేట్‌.. అప్ప‌టిక‌ల్లా పూర్తి!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ అప్డేట్ ఇచ్చింది. వైసీపీ హ‌యాంలో తీవ్ర‌నిర్ల‌క్ష్యానికి గురైన అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌నుల‌ను కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక ప‌రుగులు పెట్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌నులు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. మ‌రోవైపు.. ఇదివ‌ర‌కే తీసుకున్న‌భూములు స‌రిపోవ‌ని గుర్తించిన స‌ర్కారు.. మ‌రో 44 వేల ఎక‌రాల‌ను స‌మీక‌రించేందుకు(ల్యాండ్ పూలింగ్‌) రెడీ అయింది.

అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, స్మార్ట్ ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, క్రీడా న‌గ‌రం వంటి వాటికి ఈ భూముల‌ను వినియోగించ‌నున్నారు. ఇలా ప‌నులు వ‌డివ‌డిగా సాగుతున్న క్ర‌మంలో అమ‌రావ‌తిని ఎప్ప‌టిలోపు పూర్తి చేస్తార‌న్న ప్ర‌శ్న త‌ర‌చుగా తెర‌మీదికి వ‌స్తూనే ఉంది. పెట్టుబ‌డి దారులు కూడా ఈవిష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. తాజాగా దీనిపై స‌ర్కారు అప్డేట్ చేసింది. వ‌చ్చే మూడు సంవ‌త్స‌రాల్లో తొలి ద‌శ అమ‌రావ‌తిప‌నుల‌ను పూర్తి చేయ‌నున్న‌ట్టు ఏర్కొంది.

తొలిద‌శ‌లో రాజ‌ధానిలో హైకోర్టు స‌హా.. న‌వ‌న‌గ‌రాల‌ను పూర్తి చేయ‌నున్నారు. ఇది 2028 డిసెంబ‌రు నాటికి పూర్తి చేసుకుంటుంద‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. అదేవిదంగా స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌, స్పోర్ట్స్‌ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం ప‌నులు ఏడాది త‌ర్వాత‌.. ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. దీనికి సంబంధించి 44 వేల ఎక‌రాల‌ను ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటున్నామ‌న్న ఆయ‌న‌.. ప్ర‌స్తుతం 20 వేల ఎక‌రాల భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వ‌చ్చార‌ని తెలిపారు.

ఆయా నిర్మాణాల కోసం.. 10వేల ఎకరాలు అవసరమవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన 30 వేల ఎక‌రాల‌ను కూడా రైతుల‌కు రిట‌ర్న్ ఫ్లాట్లు ఇచ్చేందుకు, ఇత‌ర అవ‌స‌రాల కోసం వినియోగిస్తామ న్నారు. కొంద‌రు రాజ‌ధానికి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తూనే ఉన్నార‌ని.. రైతుల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. కానీ.. ఒక మ‌హాయ‌జ్ఞం చేసేప్పుడు ఇవ‌న్నీ.. చిన్నిచిన్ని స‌మ‌స్య‌లేన‌ని చెప్పుకొచ్చారు. రైతుల‌కు చంద్ర‌బాబుపై న‌మ్మ‌కం ఉంద‌న్నారు.

This post was last modified on July 5, 2025 10:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…

32 minutes ago

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

6 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

9 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

11 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

12 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

13 hours ago