Political News

అమ‌రావ‌తిపై భారీ అప్డేట్‌.. అప్ప‌టిక‌ల్లా పూర్తి!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ అప్డేట్ ఇచ్చింది. వైసీపీ హ‌యాంలో తీవ్ర‌నిర్ల‌క్ష్యానికి గురైన అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌నుల‌ను కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక ప‌రుగులు పెట్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌నులు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. మ‌రోవైపు.. ఇదివ‌ర‌కే తీసుకున్న‌భూములు స‌రిపోవ‌ని గుర్తించిన స‌ర్కారు.. మ‌రో 44 వేల ఎక‌రాల‌ను స‌మీక‌రించేందుకు(ల్యాండ్ పూలింగ్‌) రెడీ అయింది.

అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, స్మార్ట్ ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, క్రీడా న‌గ‌రం వంటి వాటికి ఈ భూముల‌ను వినియోగించ‌నున్నారు. ఇలా ప‌నులు వ‌డివ‌డిగా సాగుతున్న క్ర‌మంలో అమ‌రావ‌తిని ఎప్ప‌టిలోపు పూర్తి చేస్తార‌న్న ప్ర‌శ్న త‌ర‌చుగా తెర‌మీదికి వ‌స్తూనే ఉంది. పెట్టుబ‌డి దారులు కూడా ఈవిష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. తాజాగా దీనిపై స‌ర్కారు అప్డేట్ చేసింది. వ‌చ్చే మూడు సంవ‌త్స‌రాల్లో తొలి ద‌శ అమ‌రావ‌తిప‌నుల‌ను పూర్తి చేయ‌నున్న‌ట్టు ఏర్కొంది.

తొలిద‌శ‌లో రాజ‌ధానిలో హైకోర్టు స‌హా.. న‌వ‌న‌గ‌రాల‌ను పూర్తి చేయ‌నున్నారు. ఇది 2028 డిసెంబ‌రు నాటికి పూర్తి చేసుకుంటుంద‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. అదేవిదంగా స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌, స్పోర్ట్స్‌ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం ప‌నులు ఏడాది త‌ర్వాత‌.. ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. దీనికి సంబంధించి 44 వేల ఎక‌రాల‌ను ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటున్నామ‌న్న ఆయ‌న‌.. ప్ర‌స్తుతం 20 వేల ఎక‌రాల భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వ‌చ్చార‌ని తెలిపారు.

ఆయా నిర్మాణాల కోసం.. 10వేల ఎకరాలు అవసరమవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన 30 వేల ఎక‌రాల‌ను కూడా రైతుల‌కు రిట‌ర్న్ ఫ్లాట్లు ఇచ్చేందుకు, ఇత‌ర అవ‌స‌రాల కోసం వినియోగిస్తామ న్నారు. కొంద‌రు రాజ‌ధానికి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తూనే ఉన్నార‌ని.. రైతుల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. కానీ.. ఒక మ‌హాయ‌జ్ఞం చేసేప్పుడు ఇవ‌న్నీ.. చిన్నిచిన్ని స‌మ‌స్య‌లేన‌ని చెప్పుకొచ్చారు. రైతుల‌కు చంద్ర‌బాబుపై న‌మ్మ‌కం ఉంద‌న్నారు.

This post was last modified on July 5, 2025 10:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago