ఏపీ రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ ఇచ్చింది. వైసీపీ హయాంలో తీవ్రనిర్లక్ష్యానికి గురైన అమరావతి రాజధాని పనులను కూటమి సర్కారు వచ్చాక పరుగులు పెట్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు.. ఇదివరకే తీసుకున్నభూములు సరిపోవని గుర్తించిన సర్కారు.. మరో 44 వేల ఎకరాలను సమీకరించేందుకు(ల్యాండ్ పూలింగ్) రెడీ అయింది.
అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ పరిశ్రమల ఏర్పాటు, క్రీడా నగరం వంటి వాటికి ఈ భూములను వినియోగించనున్నారు. ఇలా పనులు వడివడిగా సాగుతున్న క్రమంలో అమరావతిని ఎప్పటిలోపు పూర్తి చేస్తారన్న ప్రశ్న తరచుగా తెరమీదికి వస్తూనే ఉంది. పెట్టుబడి దారులు కూడా ఈవిషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తాజాగా దీనిపై సర్కారు అప్డేట్ చేసింది. వచ్చే మూడు సంవత్సరాల్లో తొలి దశ అమరావతిపనులను పూర్తి చేయనున్నట్టు ఏర్కొంది.
తొలిదశలో రాజధానిలో హైకోర్టు సహా.. నవనగరాలను పూర్తి చేయనున్నారు. ఇది 2028 డిసెంబరు నాటికి పూర్తి చేసుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు. అదేవిదంగా స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ఏడాది తర్వాత.. ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి 44 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటున్నామన్న ఆయన.. ప్రస్తుతం 20 వేల ఎకరాల భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారని తెలిపారు.
ఆయా నిర్మాణాల కోసం.. 10వేల ఎకరాలు అవసరమవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన 30 వేల ఎకరాలను కూడా రైతులకు రిటర్న్ ఫ్లాట్లు ఇచ్చేందుకు, ఇతర అవసరాల కోసం వినియోగిస్తామ న్నారు. కొందరు రాజధానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూనే ఉన్నారని.. రైతులను రెచ్చగొడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కానీ.. ఒక మహాయజ్ఞం చేసేప్పుడు ఇవన్నీ.. చిన్నిచిన్ని సమస్యలేనని చెప్పుకొచ్చారు. రైతులకు చంద్రబాబుపై నమ్మకం ఉందన్నారు.
This post was last modified on July 5, 2025 10:57 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…