జగనేంటి.. గాబరా పడడం ఏంటి? ఆయనంత ధైర్యశాలి.. ఎదిరించే తత్వం ఉన్న నాయకుడు.. మొండి ఘటం… మరొకరు లేరని అనుకుంటున్నారా?!. కానీ.. అవన్నీ ఇప్పుడు పనిచేయడం లేదు. ఆ మొండి తనం.. ఆ ధైర్యం.. ఆ దీక్ష.. వంటివి కొట్టుకుపోతున్నాయి. ఎందుకంటే.. రాజకీయాలు.. ఓటు బ్యాంకు అలాంటివి మరి! ముఖ్యమంత్రి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుపై చేసినంత వేగంగా.. చురుగ్గా పవన్ పై విమర్శలు చేయలేకపోవడమే దీనికి కారణం.
చంద్రబాబు పై అంటే.. ఎలా అయినా మాట్లేడేయొచ్చు. ఆయన స్వభావం అలాంటిది. రాజకీయ స్థిత ప్రజ్ఞత కూడా ఉంది కాబట్టి.. చంద్రబాబును ఏమన్నా పట్టించుకోరు. అందుకే.. జగన్ చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. పైగా.. చంద్రబాబు ఆగ్రహించినా.. యువత ఓట్లు ప్రభావితం కావు. జగన్కు పడేవి పడతాయి. ఇక, తన సామాజిక వర్గాన్ని చంద్రబాబు ఎలానూ ప్రభావితం చేయలేరు. తనతో ఉన్నవారు తనతోనే ఉంటారు. జగన్ వెంట వెళ్లేవారు.. జగన్ వెంట వెళ్తారు. అందుకే.. చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తారు.
కానీ.. అంత తేలికగా పవన్ పై ఇటీవల కాలంలో జగన్ విమర్శలు చేయడం లేదు. అసలు నోరు కూడా మెదపడం లేదు. దీనికి ప్రధానంగా 2024 ఎన్నికల ఎఫక్టే. మూడు పెళ్లిళ్లు.. సంసారాలు అంటూ.. పవన్పై చేసిన వ్యాఖ్యలు జగన్కు బాగా రిజల్ట్ ఇచ్చాయి. ఇటు మహిళా ఓటు బ్యాంకు.. అటు యువత ఓటు బ్యాంకు కూడా దూరమైంది. మరోవైపు.. మావోణ్ని ఇలా దిగజారుడు మాటలు అంటారా? అంటూ.. కాపులు కూడా యాంటీ అయ్యారు. దీంతోనే వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది.
ఈ పరిణామాల క్రమంలోనే ఏడాది అయిన తర్వాత.. కూడా పవన్ను పన్నెత్తు మాట అనేందుకు జగన్ గిజగిజలాడుతున్నారు. ఏమంటే.. ఏవర్గానికి కోపమొస్తుందో.. ఏ ఓటు యాంటీ అవుతుందో అనే చింత పెరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. అనాలని ఉన్నా.. అనలేని పరిస్థితి ఏర్పడిపోయింది. కాపులు ఇప్పటికే దూరమయ్యారు. యువత కూడా అలానే ఉన్నారు. కనీసం.. సింపతీ అయినా దక్కించుకుని వచ్చే ఎన్నికల నాటికి వారిని మచ్చిక చేసుకోవాలంటే పవన్ జోలికి పోకుండా ఉండడమే బెటర్ అని జగన్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది.
This post was last modified on June 28, 2025 11:03 am
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…