11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాలన్నింటా యోగాసనాలు వేస్తూ జనం ఉల్లాసంగా కనిపించారు. ఇక యోగా దినోత్సానికే నాందీ పలికిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం 11న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో జరుపుకున్నారు. ఇందుకోసం శుక్రవారమే విశాఖ చేరుకున్న మోదీ… శనివారం ఉదయమే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, ఇతర ప్రముఖులతో కలిసి యోగా దినోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది భారతే అయినా… దానికి ఇంతలా ప్రాచుర్యం తీసుకొచ్చింది మాత్రం మోదీనే అని చెప్పారు. చరిత్రను సృష్టించాలన్నా…దానిని తిరగరాయాలన్నా ఒక్క మోదీకి మాత్రమే సాధ్యమని బాబు అన్నారు. ప్రపంచం జూన్ 21న యోగాను ఓ పండుగలా జరుపుకుంటున్నారంటే దానికి మోదీనే కారణమని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. యోగా వేడుకల్లో ఇప్పటికే పలు రికార్డులు నమోదు కాగా… ఏటికేడు ఆ రికార్డులన్నీ మోదీ వల్లే బద్దలు అవుతున్నాయని ఆయన చెప్పారు.
యోగా సంపూర్ణ ఆరోగ్యానికి ఆయువుపట్టు అన్న విషయాన్ని ఎందరో మహర్షులు చెప్పినా… అంతగా పట్టించుకోని జనం… యోగాను ఆచరిద్దాం… ఆరోగ్యంగా ఉందామంటూ మోదీ ఇచ్చిన పిలుపునకు మాత్రం ఓ రేంజి మద్దతు లభించిందని చంద్రబాబు అన్నారు. అలాంటి మోదీ 11 అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు విశాఖ రావడం, ఇక్కడి నుంచే యోగా దినోత్సవాన్ని మోదీ ప్రారంభించడం ఏపీ ప్రజల అదృష్టమని ఆయన అన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన యోగాసనాల్లో విశాఖ జనం తండోపతండాలుగా పాలుపంచుకోవడంతో బీచ్ మొత్తం కలర్ ఫుల్ గా మారిపోయింది.
This post was last modified on June 21, 2025 11:34 am
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…