ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ బెజవాడ ఏసీబీ కోర్టు బుధవారం రాత్రి ఉత్వర్లులు జారీ చేసింది. దీంతో చెవిరెడ్డిని సిట్ అధికారులు మరికాసేపట్లో బెజవాడలోని జిల్లా జైలుకు తరలించనున్నారు. చెవిరెడ్డితో పాటుగా ఆయన బాల్య స్నేహితుడు వెంకటేశ్ నాయుడినీ కోర్టు జైలుకు పంపింది.
బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి గుట్టు చప్పుడు కాకుండా శ్రీలంక చెక్కేసేందుకు ప్లాన్ వేసిన చెవిరెడ్డి… వెంకటేశ్ నాయుడితో కలిసి మరీ వెళ్లారు. అయితే అప్పటికే చెవిరెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ అయి ఉండటంతో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు చెవిరెడ్డిని నిలిపివేశారు. అనంతరం సిట్ అధికారులకు సమాచారం చేరవేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు… సిట్ అధికారులు బెంగళూరు చేరేదాకా చెవిరెడ్డిని తమ అదుపులోనే ఉంచుకున్నారు. మంగళవారం రాత్రికి అక్కడికి చేరుకున్న సిట్ అధికారులు చెవిరెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి విజయవాడ తరలించారు.
బుధవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడులను ప్రశ్నించిన సిట్ అదికారులు. సాయంత్రం ట్రయల్ కోర్టు అయిన ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్వతహాగా న్యాయవాది అయిన చెవిరెడ్డి తన కేసును తానే వాదించుకున్నట్లు సమాచారం. తన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే సిట్ అధికారులు ఎలా లుకౌట్ నోటీసులు జారీ చేస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా రిమాండ్ రిపోర్టులో తాను చెప్పని విషయాలను కూడా సిట్ నమోదు చేసిందని జడ్జికి చెప్పారు. అంతటితో ఆగని ఆయన ఏకంగా 26 ప్రశ్నలకు తాను చెప్పిన సమాధానాలు కాకుండా సిట్ కు అనుకూలంగా ఉన్న ఆన్సర్లను రాసుకున్నారని తెలిపారు.
ఇక ఇదే కేసులో విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానని, తనను అకారణంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని మీడియా ముందు ఆరోపించిన చెవిరెడ్డి… గుట్టు చప్పుడు కాకుండా దేశం దాటి పారిపోయేందుకు యత్నించారని సిట్ పోలీసులు కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా మద్యం ముడుపుల్లో చెవిరెడ్డి రూ.200 నుంచి రూ.250 కోట్లను వాడారని, ఈ మొత్తాన్ని ఆయన ఎన్నికల్లో ఖర్చు పెట్టారని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. సిట్ వాదనలతో ఏకీభవించి చెవిరెడ్డి, వెంకటేశ్ లకు జూలై 1 దాకా రిమాండ్ విధించింది.
This post was last modified on June 18, 2025 11:15 pm
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…