ఏపీలో ప్రజలు వైసీపీకి గత ఎన్నికల్లో 11 స్థానాలే ఇచ్చి.. పక్కన కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి రాలేదని.. ఆ పార్టీ తీరు మారలేదని టీడీపీయువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వైసీపీ సైకోలను తయా రు చేసే పెద్ద ఫ్యాక్టరీగా మారిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వైసీపీ అధినేత జగన్ తాజాగా గుంటూరులో పర్యటించారు. ఇక్కడి రెంటపాళ్ల గ్రామంలో వైసీపీ నాయకుడు.. గత ఏడాది మృతి చెందిన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఓదార్చారు.
అయితే.. 72 కిలో మీటర్ల దూరం చేరుకునేందుకు ఏకంగా 8 గంటల సేపు తీసుకోవడం.. దారి పొడవునా.. ప్రజలకు అభివాదం చేసుకుంటూ.. ఇదో ఎన్నికల యాత్రగా.. బల ప్రదర్శనగా మార్చుకోవడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు.. ఈ కార్యక్రమానికి వచ్చిన వైసీపీ నాయకులు.. తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపైనా ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి.
రప్పా రప్పా నరుకుత్తం.. నా కొడకల్లారా.. అన్న వస్తాడు.. అంతు చూస్తాడు. గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా.. రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అని పేర్కొంటూ… వైసీపీ కార్యకర్తలు సత్తెనపల్లి సెంటర్ సహా.. రెంటపాళ్లలోనూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేగింది. నారా లోకేష్ స్పందిస్తూ.. ‘యథా అధినేత.. తథా నాయకులు, కార్యకర్తలు. వైసిపి.. సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది.“ అని వ్యాఖ్యానించారు.
గత ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టినా.. వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదని నారా లోకేష్ తెలిపారు. ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసే ఇలాంటి చర్యలను ప్రజా ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదన్నారు. దీనిపై త్వరలోనే చర్యలు ఉంటాయని వైసీపీ సైకోబ్యాచ్కు హెచ్చరిస్తున్నట్టు పేర్కొన్నారు.
This post was last modified on June 18, 2025 11:30 pm
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…