Political News

ఆ పాత ఫోన్లు ఏమయ్యాయి కేటీఆర్!

ఫార్మూలా ఈ కారు రేసుల వ్యవహారంలో ఇప్పటిదాకా రెండు పర్యాయాలు ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరైన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన రెండో దఫా విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులు… 2021 నుంచి 2024 మధ్యలో వినియోగించిన సెల్ ఫోన్లను స్వాధీనం చేయాలని కేటీఆర్ ను కోరారు. అయితే ఇఫ్పుడు వాటిని తీసుకురాలేదని తప్పించుకున్న కేటీఆర్ తాజాగ బుధవారం అసలు ఆ ఫోన్లు ఇప్పుడు తన వద్ద లేవని ఏసీబీకి షాకిచ్చేలా ఓ లేఖ రాశారు.

2021 నుంచి 2023 చివరి వరకు తాను వాడిన ఫోన్లను తీసేసి… 2024లో కొత్త ఫోన్లను తీసుకున్నానని కేటీఆర్ ఏసీబీకి రాసిన లేఖలో తెలిపారు. గతంలో వాడేసిన ఫోన్లను తాను తన వద్ద ఎందుకు ఉంచుకుంటానని ప్రశ్నించిన కేటీఆర్… ప్రస్తుతం ఆ పాత ఫోన్లు ఇప్పుడు తన వద్ద లేవని, అసలు అవి ఎక్కడున్నాయో కూడా తనకు తెలియదని తెలిపారు. వాడేసిన ఫోన్లను డిస్పోజ్ చేస్తాం కదా… డిస్పోజ్ చేసిన ఫోన్లను తీసుకురమ్మంటే ఎలా తీసుకువచ్చేది అంటూ ఆయన ఓ లాజిక్ ను వినియోగించాురు.

ఏసీబీకి రాసిన లేఖను కేటీఆర్ ఈ విషయాలతోనే సరిపెట్టేసి ఉంటే సరిపోయేది. అయితే ఆయన అలా చేయలేదు. ఫోన్లను స్వాధీనం చేయడమంటే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఈ తరహా చర్యలు తన వ్యక్తిగత ప్రతిష్ఠను మంటగలిపేవేనని కూడా కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద పాత ఫోన్లు లేవంటూనే.. ఇలా వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుంది అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

This post was last modified on June 18, 2025 10:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago