Political News

ఆ పాత ఫోన్లు ఏమయ్యాయి కేటీఆర్!

ఫార్మూలా ఈ కారు రేసుల వ్యవహారంలో ఇప్పటిదాకా రెండు పర్యాయాలు ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరైన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన రెండో దఫా విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులు… 2021 నుంచి 2024 మధ్యలో వినియోగించిన సెల్ ఫోన్లను స్వాధీనం చేయాలని కేటీఆర్ ను కోరారు. అయితే ఇఫ్పుడు వాటిని తీసుకురాలేదని తప్పించుకున్న కేటీఆర్ తాజాగ బుధవారం అసలు ఆ ఫోన్లు ఇప్పుడు తన వద్ద లేవని ఏసీబీకి షాకిచ్చేలా ఓ లేఖ రాశారు.

2021 నుంచి 2023 చివరి వరకు తాను వాడిన ఫోన్లను తీసేసి… 2024లో కొత్త ఫోన్లను తీసుకున్నానని కేటీఆర్ ఏసీబీకి రాసిన లేఖలో తెలిపారు. గతంలో వాడేసిన ఫోన్లను తాను తన వద్ద ఎందుకు ఉంచుకుంటానని ప్రశ్నించిన కేటీఆర్… ప్రస్తుతం ఆ పాత ఫోన్లు ఇప్పుడు తన వద్ద లేవని, అసలు అవి ఎక్కడున్నాయో కూడా తనకు తెలియదని తెలిపారు. వాడేసిన ఫోన్లను డిస్పోజ్ చేస్తాం కదా… డిస్పోజ్ చేసిన ఫోన్లను తీసుకురమ్మంటే ఎలా తీసుకువచ్చేది అంటూ ఆయన ఓ లాజిక్ ను వినియోగించాురు.

ఏసీబీకి రాసిన లేఖను కేటీఆర్ ఈ విషయాలతోనే సరిపెట్టేసి ఉంటే సరిపోయేది. అయితే ఆయన అలా చేయలేదు. ఫోన్లను స్వాధీనం చేయడమంటే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఈ తరహా చర్యలు తన వ్యక్తిగత ప్రతిష్ఠను మంటగలిపేవేనని కూడా కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద పాత ఫోన్లు లేవంటూనే.. ఇలా వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుంది అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

This post was last modified on June 18, 2025 10:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

3 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

3 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

3 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

4 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

4 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

6 hours ago