Political News

జ‌గ‌న్ ను విమ‌ర్శించిన పాస్ట‌ర్ మృతి.. విచార‌ణ‌కు చంద్ర‌బాబు ఆదేశం!

తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రికి చెందిన పాస్ట‌ర్ పగ‌డాల ప్ర‌వీణ్ కుమార్‌.. ఓ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. అయితే.. ఆయ‌న మృతి ప్ర‌మాద శాత్తు జ‌రిగింది కాద‌ని.. ప‌క్కా ప్లాన్‌తోనే ఆయ‌న‌ను చంపేశార‌ని.. క్రైస్త‌వ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘ‌ట‌న జ‌రిగి.. గంట‌లు గడిచినా.. విష‌యం వెలుగు చూడ‌లేద‌ని.. దీనివెనుక కుట్ర ఉంద‌ని సంఘాల పాస్ట‌ర్లు ఆరోపించారు. దీనిపై తీవ్ర విచారం వ్య‌క్తం చేసిన సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌.. ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు.

పాస్ట‌ర్ ప్ర‌వీణ్‌కుమార్ మృతిపై స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులోనే ఉన్న డీజీపీతో చర్చించారు. ఈ ఘ‌ట‌న‌ను అన్ని కోణాల్లోనూ ప‌రిశీలించాల‌ని.. వెనుక కుట్ర కోణం ఉంటే వెలికి తీయాల‌ని కూడా సూచించారు. త‌క్ష‌ణ‌మే పాస్ట‌ర్‌ కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి ధైర్యం చెప్పాల‌ని.. స్థానిక నాయ‌కుల‌ను ఆదేశించారు. కాగా.. మ‌రోవైపు మంత్రి నారా లోకేష్‌.. కూడా దీనిని సీరియ‌స్‌గా తీసుకున్నారు. మృతిపై వ్య‌క్త‌మ‌వుతున్న అనుమానాలను అన్ని కోణాల్లో ప‌రిశీలించి న్యాయం చేస్తామ‌న్నారు.

ఎవ‌రీ పాస్ట‌ర్‌?

పాస్ట‌ర్ ప్ర‌వీణ్‌కుమార్‌.. స్థానికంగానే కాకుండా.. యూట్యూబ్‌లోనూ త‌న వీడియోల ద్వారా క్రైస్తవ స‌మాజాన్ని చైత‌న్య ప‌రుస్తున్నారు. రాజ‌కీయాలకు-క్రైస్త‌వానికి ముడిపెట్ట‌డాన్ని ఆయ‌న తీవ్రంగా వ్య‌తిరేకించారు. ముఖ్యంగా జ‌గ‌న్ పాల‌న‌లో ఎస్సీల్లో విభ‌జ‌న తీసుకువ‌చ్చార‌ని.. ఇది మున్ముందు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అనేక సంద‌ర్భాల్లో చెప్పారు. అలాగ‌ని ఆయ‌న ఎక్క‌డా ఇత‌ర పార్టీల‌ను భుజాన మోయ‌లేదు. ఎవ‌రినీ విమ‌ర్శించ‌లేదు. పొగ‌డ‌లేదు. కానీ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ విధానాల‌ను మాత్రం ఎండ‌గ‌ట్టారు. పాస్ట‌ర్ల‌కు రూ.5000 చొప్పున ఇవ్వ‌డాన్ని కూడా ఆయ‌న వ్య‌తిరేకించారు. ప్ర‌జ‌ల సొమ్మును ఇలా మ‌త ప‌ర‌మైన కార్యక్ర‌మాలకు ఎలా కేటాయిస్తార‌ని ప్ర‌శ్నించారు. ఇది క్రైస్త‌వానికి కూడా మంచిది కాద‌న్నారు. ఇది ఓటు బ్యాంకు రాజ‌కీయమ‌ని ప‌లు సంద‌ర్భాల్లో బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేశారు.

ఏం జ‌రిగింది?

రాజ‌మండ్రికి చెందిన ప్ర‌వీణ్‌కుమార్‌.. ఇటీవ‌ల త‌న బుల్లెట్‌పై హైద‌రాబాద్కు వెళ్లారు. తిరిగి వ‌స్తున్న స‌మ‌యంలో రాజ‌మండ్రికి స‌మీపంలోని కొంత‌మూరు గ్రామం వ‌ద్ద‌.. హైవేను దాటి బుల్లెట్ కిందికి దూసుకుపోయింది. ఈ క్ర‌మంలో బుల్లెట్ ఆయ‌న‌పై ప‌డ‌డంతో ఆయ‌న అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. అయితే.. ఇది ప్ర‌మాదం కాద‌ని.. వెనుక నుంచి వేరే వాహ‌నం ఢీ కొట్టి ఉంటుంద‌ని.. రాజ‌కీయ ప్ర‌మేయం కూడా ఉండి ఉంటుంద‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు, పాస్ట‌ర్లు ఆరోపిస్తున్నారు.

This post was last modified on March 26, 2025 5:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గ‌ద్ద‌ర్ అవార్డుల్లో గందరగోళం.. ఏం జరిగింది?

గ‌త ఏడాది ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను మొద‌లుపెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఒకేసారి చాలా ఏళ్ల‌కు క‌లిపి అవార్డులు ప్ర‌క‌టించిన సంగ‌తి…

3 hours ago

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

6 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

10 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

10 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

10 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

11 hours ago