టీడీపీ యువ నేత, నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ ఏపీలో విపక్షం వైసీపీలో వణుకు పుట్టించిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ భేటీ ఎలా జరిగిందన్నదానిపై పలు మీడియా సంస్థలు ఆసక్తికర అంశాలను ప్రస్తావిస్తూ కథనాలు రాశాయి. అమిత్ షా వద్దకు రాయలు తనంత తానుగా వెళ్లలేదని, అమిత్ షానే స్వయంగా టీడీపీ ఎంపీని పిలిపించుకుని మరీ భేటీ అయ్యారని ఆ సంస్థలు చెబుతున్నాయి. ఈ మాటలు నిజమే అయితే గనుక… వైసీపీకి గడ్డు కాలం దాపురించినట్టేనని చెప్పక తప్పదు.
సోమవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఏపీలో వైసీపీ పాలనలో మద్యం కుంభకోణం జరిగిందని, దీని ద్వారా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.4 వేల కోట్లను దేశం దాటించి దుబాయి పంపారని రాయలు సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ సందర్బంగా రాయలు చేసిన ప్రసంగం యావత్తు దేశ ప్రజలను ఆకట్టుకుంది. ఈ ప్రసంగాన్ని అమిత్ షా కూడా విని ఆశ్చర్యం వ్యక్తం చేశారట. ఆ తర్వాత దీని సంగతేమిటో చూద్దామంటూ రాయలును అమిత్ షా తన కార్యాలయానికి పిలిపించుకున్నారన్నది ఆ మీడియా సంస్థల కథనం సారాంశం. అమిత్ షా నుంచి పిలుపు రాగానే.. ఏపీలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలను చేత బట్టుకుని మరీ రాయలు అమిత్ షా కార్యాలయంలోకి అడుగు పెట్టారట.
ఈ సందర్బంగా ఏపీలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం, దానికి వైసీపీ నేతలు తెర తీసిన వైనం… దాని ద్వారా వైసీపీ పెద్దలు వెనకేసుకున్న మొత్తాలు… ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, అధికారంలోకి రాగానే వైసీపీ నతలు కొత్త డిస్టిల్లరీలకు అనుమతులు జారీ చేయడం, వాటిని ఓ సిండికేట్ గా మార్చేసి… మద్యం ఉత్పత్తికి ముందే వసూళ్లకు ప్పాల్పడిన తీరుపై రాయలు వివిస్తూ ఉంటే… అమిత్ షా అలా ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయారట. అంతేకాకుండా తాను చేసిన ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను రాయలు అందజేయగా.. వాటిని అమిత్ షా కూలంకషంగా పరిశీలించారట. మొత్తంగా పార్లమెంటులో తాను చేసిన ఆరోపణలు ఏదో అదాటుగా చేసినవి కావని, అన్నీ పక్కా ఆధారాలతోనే చేసినవి అని రాయలు.. అమిత్ షా ముందు తేల్చి చెప్పారు.
ఇప్పటికే ఢిల్లీలో అవినీతి లేని పాలన అంటూ అధికారం చేజిక్కించుకుని ఇటు బీజేపీతో పాటుగా అటు కాంగ్రెస్ కు కూడా కొరకరాని కొయ్యగా మారిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కాంతో ఒక్కసారిగా ఫేడ్ అవుట్ అయిపోయారు. అదే సమయంలో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపుతూ దక్షిణాది పేరిట తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కూడా ఇప్పుడు మద్యం కుంభకోణం ఆరోపణలతో సతమతం అవుతోంది. ఇక ఏపీలో తాను సింగిల్ గా.. సింహం లా వస్తానంటూ చెబుతున్న జగన్ కూడా కేజ్రీ, స్టాలిన్ మాదిరే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారన్న విషయం తెలిసినంతనే అమిత్ షా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఓ వైపు తప్పులు చేస్తూనే శుద్దపూసలమంటూ కలరింగ్ ఇస్తే ఎలాగన్న రీతిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమిత్ షా… దీనిపై కాస్తంత దృష్టి పెడితే… ఆప్, డీఎంకే మాదిరే వైసీపీ కూడా తీవ్ర పరిణామాలను చవిచూడక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 26, 2025 5:10 pm
ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్టణం… గతంలో ఎలా ఉందో, భవిష్యత్తులోనూ అలాగే ఉండనుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడైన హరీష్ శంకర్.. ఇంటర్వ్యూల్లో సినిమా సంగతులు చాలా మాట్లాడతారు కానీ.. వ్యక్తిగత విషయాల గురించి…
హైదరాబాద్కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తామని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని.. దీంతో…
శ్రీవిశ్వావసు నామ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించారు.…
ఇవాళ సల్మాన్ ఖాన్ సికందర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ బజ్ ని పెంచలేకపోయినా కండల వీరుడి మాస్…
ఏపీ సీఎం చంద్రబాబు ఉగాదిని పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్రధంగా వచ్చే ఉగాదిని పురస్కరించుకుని…