Political News

అమిత్ షానే పిలిపించుకుంటె వైసీపీ కష్టమే!

టీడీపీ యువ నేత, నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ ఏపీలో విపక్షం వైసీపీలో వణుకు పుట్టించిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ భేటీ ఎలా జరిగిందన్నదానిపై పలు మీడియా సంస్థలు ఆసక్తికర అంశాలను ప్రస్తావిస్తూ కథనాలు రాశాయి. అమిత్ షా వద్దకు రాయలు తనంత తానుగా వెళ్లలేదని, అమిత్ షానే స్వయంగా టీడీపీ ఎంపీని పిలిపించుకుని మరీ భేటీ అయ్యారని ఆ సంస్థలు చెబుతున్నాయి. ఈ మాటలు నిజమే అయితే గనుక… వైసీపీకి గడ్డు కాలం దాపురించినట్టేనని చెప్పక తప్పదు.

సోమవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఏపీలో వైసీపీ పాలనలో మద్యం కుంభకోణం జరిగిందని, దీని ద్వారా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.4 వేల కోట్లను దేశం దాటించి దుబాయి పంపారని రాయలు సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ సందర్బంగా రాయలు చేసిన ప్రసంగం యావత్తు దేశ ప్రజలను ఆకట్టుకుంది. ఈ ప్రసంగాన్ని అమిత్ షా కూడా విని ఆశ్చర్యం వ్యక్తం చేశారట. ఆ తర్వాత దీని సంగతేమిటో చూద్దామంటూ రాయలును అమిత్ షా తన కార్యాలయానికి పిలిపించుకున్నారన్నది ఆ మీడియా సంస్థల కథనం సారాంశం. అమిత్ షా నుంచి పిలుపు రాగానే.. ఏపీలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలను చేత బట్టుకుని మరీ రాయలు అమిత్ షా కార్యాలయంలోకి అడుగు పెట్టారట.

ఈ సందర్బంగా ఏపీలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం, దానికి వైసీపీ నేతలు తెర తీసిన వైనం… దాని ద్వారా వైసీపీ పెద్దలు వెనకేసుకున్న మొత్తాలు… ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, అధికారంలోకి రాగానే వైసీపీ నతలు కొత్త డిస్టిల్లరీలకు అనుమతులు జారీ చేయడం, వాటిని ఓ సిండికేట్ గా మార్చేసి… మద్యం ఉత్పత్తికి ముందే వసూళ్లకు ప్పాల్పడిన తీరుపై రాయలు వివిస్తూ ఉంటే… అమిత్ షా అలా ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయారట. అంతేకాకుండా తాను చేసిన ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను రాయలు అందజేయగా.. వాటిని అమిత్ షా కూలంకషంగా పరిశీలించారట. మొత్తంగా పార్లమెంటులో తాను చేసిన ఆరోపణలు ఏదో అదాటుగా చేసినవి కావని, అన్నీ పక్కా ఆధారాలతోనే చేసినవి అని రాయలు.. అమిత్ షా ముందు తేల్చి చెప్పారు.

ఇప్పటికే ఢిల్లీలో అవినీతి లేని పాలన అంటూ అధికారం చేజిక్కించుకుని ఇటు బీజేపీతో పాటుగా అటు కాంగ్రెస్ కు కూడా కొరకరాని కొయ్యగా మారిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కాంతో ఒక్కసారిగా ఫేడ్ అవుట్ అయిపోయారు. అదే సమయంలో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపుతూ దక్షిణాది పేరిట తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కూడా ఇప్పుడు మద్యం కుంభకోణం ఆరోపణలతో సతమతం అవుతోంది. ఇక ఏపీలో తాను సింగిల్ గా.. సింహం లా వస్తానంటూ చెబుతున్న జగన్ కూడా కేజ్రీ, స్టాలిన్ మాదిరే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారన్న విషయం తెలిసినంతనే అమిత్ షా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఓ వైపు తప్పులు చేస్తూనే శుద్దపూసలమంటూ కలరింగ్ ఇస్తే ఎలాగన్న రీతిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమిత్ షా… దీనిపై కాస్తంత దృష్టి పెడితే… ఆప్, డీఎంకే మాదిరే వైసీపీ కూడా తీవ్ర పరిణామాలను చవిచూడక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Satya

Recent Posts

అక్కినేని కోడలు విమర్శలను జయిస్తుందా?

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత…

14 minutes ago

చరణ్ లైనప్ లో పెద్ది ఇంపాక్ట్

పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్‌లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్‌ని నిలబెట్టుకోవాలి.…

32 minutes ago

ప్రమోషన్లు నిల్లు… సినిమా కిల్లు

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…

48 minutes ago

సినిమా థియేటర్ లో స్పిరిట్ షూట్ ఎలాగయ్య వంగా

టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్‌లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు…

1 hour ago

అర్జున్ మార్కెట్ బ్రతికే ఉంది

ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…

3 hours ago

15 ఏళ్ల సూర్యవంశీ… రికార్డులేంటి స్వామి…!

రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్‌ను పూర్తిగా తన సొంతం…

3 hours ago