Political News

రజినీకి ఆ క్లారిటీ ఉంది కాబట్టే..


సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం ఆయన అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. పార్టీ పెట్టేస్తున్నా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానంటూ మూడేళ్లుగా ఊరిస్తూ వస్తున్న సూపర్ స్టార్.. ఎట్టకేలకు ఈ నవంబరులో ఆ పని చేయబోతున్నారని అంచనా వేస్తున్న సమయంలో అరంగేట్రం చేయకముందే రజినీ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నారన్న వార్త అభిమానుల్ని షాక్‌కు గురి చేసింది.

రజినీ ఇలా ఎలా చేస్తాడు.. ఆయన మరీ అంత పిరికి వాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలామంది. అభిమానులే ఆయనపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. కానీ రజినీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా చూస్తే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం తప్పేమీ కనిపించదు. రజినీ రాజకీయాల్లోకి వచ్చి విజయవంతం కావాలా.. లేక ఆయన క్షేమంగా ఉండాలా అని అభిమానులు కొంచెం మనసుపెట్టి ఆలోచిస్తే రెండోదానికే ఓటేస్తారు.

రజినీ ఒకటికి రెండుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఒక సందర్భంలో అయితే ఆయన ప్రాణాలు నిలవవేమో అన్న పరిస్థితి తలెత్తింది. అప్పుడే రెండు నెలలకు పైగా సింగపూర్‌లో ఉండి చికిత్స చేయించుకున్నారు రజినీ. అప్పటి పరిస్థితి చూస్తే రజినీ మళ్లీ సినిమాల్లో నటించరేమో అన్న సందేహాలు కూడా కలిగాయి. అలాంటిది మళ్లీ కోలుకుని సినిమాలు అయితే చేశారు. రాజకీయాల్లోకి రావడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ ఇంతలో కరోనా వచ్చింది. ఈ వైరస్ ధాటికి యుక్త వయసులో ఉన్న వాళ్లు కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. శరీరంలో వేరే సమస్యలు ఉన్న వాళ్లు.. కరోనా బారిన పడితే ప్రాణాలు నిలవడం కష్టంగా ఉంది. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సైతం ఇలాగే ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పుడు రజినీ రాజకీయాల కోసం జనాల్లోకి వచ్చాడంటే కరోనా సోకకుండా ఉండదు. ఎంత డబ్బున్నా, ఎంత అత్యుత్తమ చికిత్స ఉన్నా.. ఎంతటి వారైనా తేడా వస్తే కరోనాకు బలి కావాల్సిందే అన్నది చాలామంది విషయంలో అనుభవమైంది. కాబట్టి తనకున్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా రజినీ అత్యంత జాగ్రత్తతో ఉంటున్నారు. సినిమా షూటింగ్ కూడా ఆపేశారు. వ్యాక్సిన్ వచ్చి కరోనా ఆనవాళ్లు పోవడానికి ఇంకా ఆర్నెల్లో సంవత్సరమో పడుతుంది. ఈ లోపు తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తాయి.

ఎలాంటి ఫలితాలొస్తాయో తెలియని ఎన్నికల కోసం జనాల్లోకి వెళ్లి కరోనా తెచ్చుకుని తన ప్రాణాల మీదికి వస్తే.. అప్పుడు అభిమానులే తట్టుకోలేరు. అందుకే రాజకీయాల్లో విజయవంతం కావడం కంటే.. మనిషిగా మిగిలి ఉండటం మంచిదని రజినీ రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది చూసి ఆయన పిరికి వాడు అని కొందరు అనుకుంటే అనుకోవచ్చు కానీ.. ప్రమాదం అని తెలిసి కూడా మృత్యువుకు ఎదురెళ్లడానికి ఇదేమీ సినిమా కాదు కాబట్టి రజినీ నిర్ణయం సరైందనే అనుకోవాలి.

This post was last modified on October 29, 2020 3:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్యాన్ ఇండియా ‘డెవిల్’ టాక్ ఏంటి

మనకు డెవిల్ అంటే ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ సినిమా గుర్తొస్తుంది కానీ ఇటీవలే కన్నడలో విడుదలైన భారీ…

5 minutes ago

మెగా ఛాన్స్ వదిలేసిన విశ్వంభర

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఫలితాన్ని విశ్వంభర క్యాష్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అభిమానులను బాధ…

43 minutes ago

హార్దిక్ పాండ్య ఏం సాధించాడు?

గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు…

1 hour ago

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

2 hours ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

4 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

5 hours ago