Movie News

భాగ్యశ్రీ ని బ్లాక్ చేసిన తల్లి

సినిమాల పట్ల ముందుతరం తల్లిదండ్రుల్లో చాలా వరకు ప్రతికూల అభిప్రాయమే ఉంటుంది. తమ పిల్లల్లో ఎవరైనా సినిమాల్లోకి వెళ్తామంటే.. కంగారు పడేవాళ్లే ఎక్కువ. అక్కడ స్థిరమైన కెరీర్ ఉండదనే భయానికి తోడు.. ఆ ఇండస్ట్రీ గురించి ఉండే చెడు అభిప్రాయం తమ పిల్లల్ని సినిమాల వైపు వెళ్లనివ్వదు.

ముఖ్యంగా అమ్మాయిలను ఇండస్ట్రీలోకి పంపించడానికి మరింతగా భయపడతారన్నది వాస్తవం. ఇప్పుడు టాలీవుడ్లో అగ్ర కథానాయికగా ఎదుగుతున్న భాగ్యశ్రీ బోర్సేకు సినిమాల్లోకి వెళ్తానంటే.. కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందలేదట. స్వయంగా ఆమె తల్లి తనను వాట్సాప్‌లో బ్లాక్ చేసిందట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది భాగ్యశ్రీ.

తాను సినిమాల్లోకి వెళ్తానని ముందుగా తన తల్లికి చెప్పానని, కానీ ఆమె వెంటనే వద్దని చెప్పిందని భాగ్యశ్రీ తెలిపింది. తర్వాత తండ్రికి ఫోన్ చేస్తే.. అమ్మ వద్దన్న పని ఎలా చేస్తావని ప్రశ్నించినట్లు చెప్పింది. కనీసం తన అక్క అయినా తనను సపోర్ట్ చేస్తుందేమో అని ఆమెకు కాల్ చేశానని.. కానీ ఆమె కూడా తల్లిదండ్రులు వద్దంటున్నారు కదా అని తనకు మద్దతుగా నిలబడలేదని భాగ్యశ్రీ వాపోయింది.

ఇలా అందరూ నో చెప్పినా.. తాను మాత్రం ప్రయత్నాలు ఆపలేదని, సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఆడిషన్లు ఇచ్చానని భాగ్యశ్రీ తెలిపింది. దీంతో ఇంట్లో వాళ్లు తనను శత్రువులా చూడడం మొదలుపెట్టారని.. తన తల్లి వాట్సాప్‌లో తనను బ్లాక్ చేసిందని, ఆరు నెలల పాటు తనతో మాట్లాడలేదని వెల్లడించింది.

ఇప్పుడు తాను నవ్వుతూ ఈ విషయం చెప్పా కానీ.. ఆ సమయంలో తల్లి అలా చేయడం చాలా బాధ పెట్టిందని భాగ్యశ్రీ పేర్కొంది. ఫిలిం ఇండస్ట్రీ అనగానే తల్లిదండ్రులకు కొన్ని భయాలుంటాయని.. కానీ జీవితంలో ఎలాంటి రిగ్రెట్ ఉండకూడదంటే కెరీర్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అని, మనపై మనకు నమ్మకం ఉండడం చాలా ముఖ్యమని ఆమె వ్యాఖ్యానించింది. ‘మిస్టర్ బచ్చన్’తో మొదలుపెట్టి వరుసగా నాలుగు ఫ్లాపులు ఇచ్చిన భాగ్యశ్రీ.. ఇటీవలే ‘లెనిన్’ మూవీతో మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

This post was last modified on July 28, 2026 10:48 am

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

21 minutes ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

1 hour ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

8 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

9 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

10 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

11 hours ago