‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’పై ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ ఆ అంచనాల్ని అందుకోవడంలో సినిమా పూర్తిగా విఫలమైంది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. విడుదలకు ముందు ఉన్న హైప్ వల్ల భారీగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. వీకెండ్ తర్వాత సినిమా నిలబడలేదు. ఆ తర్వాత అమేజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ సినిమాకు అక్కడా ఆశించిన స్పందన లేనట్లే కనిపించింది. ఈ సినిమాను ఇప్పుడు టీవీలో రిలీజ్ చేస్తే ఇక్కడా చేదు అనుభవమే ఎదురైంది. కేవలం 5.8 టీఆర్పీ రేటింగ్తో ‘సాహో’ టీవీ ప్రిమియర్ తుస్సుమనిపించింది.
కొత్త సినిమాను వేడి మీద టీవీల్లో రిలీజ్ చేస్తే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుంది కానీ.. ఏడాది తర్వాత, అది కూడా ఒక డిజాస్టర్ సినిమాను టీవీలో రిలీజ్ చేస్తే జనాలకు ఏం ఆసక్తి ఉంటుంది. లాక్ డౌన్ మొదలైన కొత్తలో అయితే సినిమా ఎలాంటిదైనా విరగబడి చూశారు జనం. కానీ ఇప్పుడు టీవీల్లో ప్రిమియర్స్గా పడుతున్న సినిమాలకు ఆశించిన రెస్పాన్స్ ఉండట్లేదు. ఈ క్రమంలోనే ‘సాహో’కు మరీ లో రేటింగ్స్ వచ్చాయి. దీంతో పోలిస్తే కార్తికేయ సినిమా ‘గుణ 369’కు ఎక్కువ రేటింగ్ రావడం గమనార్హం.
టీవీల్లో సినిమాలు చూసేది ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్సే. ఆ తరహా ప్రేక్షకులకు ‘సాహో’ అసలేమాత్రం ఎక్కే సినిమా కాదు. పైగా టీవీ ప్రిమియర్ వేయడానికి ఇంతగా ఎందుకు ఆలస్యం చేశారో ఏంటో మరి. రిలీజైన 15 నెలలకు సినిమాను టీవీలో వేస్తూ దాని గురించి తెగ ప్రచారం చేశారు. స్వయంగా ప్రభాస్ సైతం టీవీ ప్రిమియర్ గురించి ప్రమోట్ చేశాడు. అయినా సరే.. అభిమానులు పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. ఓటీటీల దెబ్బకు అసలే శాటిలైట్ మార్కెట్ దెబ్బ తింటున్న నేపథ్యంలో కొత్త సినిమాల ప్రిమియర్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా అడుగులేయాల్సిందే.
This post was last modified on October 29, 2020 3:31 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…