‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’పై ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ ఆ అంచనాల్ని అందుకోవడంలో సినిమా పూర్తిగా విఫలమైంది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. విడుదలకు ముందు ఉన్న హైప్ వల్ల భారీగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. వీకెండ్ తర్వాత సినిమా నిలబడలేదు. ఆ తర్వాత అమేజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ సినిమాకు అక్కడా ఆశించిన స్పందన లేనట్లే కనిపించింది. ఈ సినిమాను ఇప్పుడు టీవీలో రిలీజ్ చేస్తే ఇక్కడా చేదు అనుభవమే ఎదురైంది. కేవలం 5.8 టీఆర్పీ రేటింగ్తో ‘సాహో’ టీవీ ప్రిమియర్ తుస్సుమనిపించింది.
కొత్త సినిమాను వేడి మీద టీవీల్లో రిలీజ్ చేస్తే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుంది కానీ.. ఏడాది తర్వాత, అది కూడా ఒక డిజాస్టర్ సినిమాను టీవీలో రిలీజ్ చేస్తే జనాలకు ఏం ఆసక్తి ఉంటుంది. లాక్ డౌన్ మొదలైన కొత్తలో అయితే సినిమా ఎలాంటిదైనా విరగబడి చూశారు జనం. కానీ ఇప్పుడు టీవీల్లో ప్రిమియర్స్గా పడుతున్న సినిమాలకు ఆశించిన రెస్పాన్స్ ఉండట్లేదు. ఈ క్రమంలోనే ‘సాహో’కు మరీ లో రేటింగ్స్ వచ్చాయి. దీంతో పోలిస్తే కార్తికేయ సినిమా ‘గుణ 369’కు ఎక్కువ రేటింగ్ రావడం గమనార్హం.
టీవీల్లో సినిమాలు చూసేది ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్సే. ఆ తరహా ప్రేక్షకులకు ‘సాహో’ అసలేమాత్రం ఎక్కే సినిమా కాదు. పైగా టీవీ ప్రిమియర్ వేయడానికి ఇంతగా ఎందుకు ఆలస్యం చేశారో ఏంటో మరి. రిలీజైన 15 నెలలకు సినిమాను టీవీలో వేస్తూ దాని గురించి తెగ ప్రచారం చేశారు. స్వయంగా ప్రభాస్ సైతం టీవీ ప్రిమియర్ గురించి ప్రమోట్ చేశాడు. అయినా సరే.. అభిమానులు పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. ఓటీటీల దెబ్బకు అసలే శాటిలైట్ మార్కెట్ దెబ్బ తింటున్న నేపథ్యంలో కొత్త సినిమాల ప్రిమియర్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా అడుగులేయాల్సిందే.
This post was last modified on October 29, 2020 3:31 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…