ఈ మధ్య తమిళ కథానాయిక ప్రియా భవాని శంకర్.. హరీష్ కళ్యాణ్ అనే తమిళ నటుడితో కలిసి చాలా క్లోజ్గా ఫొటోలు దిగి తామిద్దరం ప్రేమలో ఉన్నట్లుగా లవ్ సింబల్స్ పెట్టి సోషల్ మీడియాలో సందడి చేసింది. ఈ అమ్మాయి అతడితో ప్రేమలో పడిందా.. ఇది నిజమా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. తమిళ మీడియాలో కూడా ఈ మేరకు వార్తలొచ్చేశాయి. కానీ తీరా చూస్తే అదంతా ఓ సినిమా ప్రమోషన్లో భాగం అని తర్వాత తేలింది. ‘పెళ్ళిచూపులు’ రీమేక్ అనౌన్స్మెంట్ ముంగిట ఆ చిత్రానికి హైప్ తేవడానికి ప్రియ, హరీష్ కలిసి ఆడిన డ్రామా అది.
ఇప్పుడు ఓ తెలుగమ్మాయి కూడా ఇదే తరహా డ్రామా ప్లే చేసి అందరినీ ఫూల్స్ను చేసింది. ఆమె తాజాగా ఎంగేజ్మెంట్ రింగ్ ఉన్న చేతిని చూపిస్తూ తాను ఎంగేజ్ అయిపోయాననే సంకేతాలు ఇచ్చింది. దీంతో ఆమెకు కాబోయే వరుడెవరు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
ఓవైపు రాహుల్ సిప్లిగంజ్తో అంత సన్నిహితంగా మెలిగి, ఇప్పుడు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటోందేంటి అనే చర్చ కూడా నడిచింది. కానీ ఆ చర్చకు త్వరగానే తెరదించేసిందామె. తాను ఎవరితో రింగు తొడిగించుకుందో ఈ రోజు ఆమె వెల్లడించింది. పునర్ణవికి జోడీగా ఒక వెబ్ సిరీస్లో నటిస్తున్న ఉద్భవ్ రఘునందనే ఆ వ్యక్తి అని ఈ రోజు అసలు విషయం బయటపెట్టింది. వీళ్లిద్దరూ కలిసి ‘ఆహా’ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ‘రింగ్’ డ్రామాను ప్లే చేశారన్నమాట.
యూట్యూబ్లో చికాగో సుబ్బారావుగా రఘునందన్ జనాలకు బాగానే పరిచయం. అతను పునర్ణవి నటిస్తున్న వెబ్ సిరీస్తో డిజిటల్ డెబ్యూ చేయబోతున్నాడు. దీని గురించి ఇంతకుముందే సమాచారం బయటికొచ్చింది. త్వరలోనే ఆ వెబ్ సిరీస్కు ప్రిమియర్స్ పడనున్న నేపథ్యంలో దానికి హైప్ తీవడానికి ఈ ‘రింగ్’ డ్రామాను ప్లే చేసి అందరినీ ఫూల్స్ను చేసింది పునర్ణవి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…