ఈ మధ్య తమిళ కథానాయిక ప్రియా భవాని శంకర్.. హరీష్ కళ్యాణ్ అనే తమిళ నటుడితో కలిసి చాలా క్లోజ్గా ఫొటోలు దిగి తామిద్దరం ప్రేమలో ఉన్నట్లుగా లవ్ సింబల్స్ పెట్టి సోషల్ మీడియాలో సందడి చేసింది. ఈ అమ్మాయి అతడితో ప్రేమలో పడిందా.. ఇది నిజమా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. తమిళ మీడియాలో కూడా ఈ మేరకు వార్తలొచ్చేశాయి. కానీ తీరా చూస్తే అదంతా ఓ సినిమా ప్రమోషన్లో భాగం అని తర్వాత తేలింది. ‘పెళ్ళిచూపులు’ రీమేక్ అనౌన్స్మెంట్ ముంగిట ఆ చిత్రానికి హైప్ తేవడానికి ప్రియ, హరీష్ కలిసి ఆడిన డ్రామా అది.
ఇప్పుడు ఓ తెలుగమ్మాయి కూడా ఇదే తరహా డ్రామా ప్లే చేసి అందరినీ ఫూల్స్ను చేసింది. ఆమె తాజాగా ఎంగేజ్మెంట్ రింగ్ ఉన్న చేతిని చూపిస్తూ తాను ఎంగేజ్ అయిపోయాననే సంకేతాలు ఇచ్చింది. దీంతో ఆమెకు కాబోయే వరుడెవరు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
ఓవైపు రాహుల్ సిప్లిగంజ్తో అంత సన్నిహితంగా మెలిగి, ఇప్పుడు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటోందేంటి అనే చర్చ కూడా నడిచింది. కానీ ఆ చర్చకు త్వరగానే తెరదించేసిందామె. తాను ఎవరితో రింగు తొడిగించుకుందో ఈ రోజు ఆమె వెల్లడించింది. పునర్ణవికి జోడీగా ఒక వెబ్ సిరీస్లో నటిస్తున్న ఉద్భవ్ రఘునందనే ఆ వ్యక్తి అని ఈ రోజు అసలు విషయం బయటపెట్టింది. వీళ్లిద్దరూ కలిసి ‘ఆహా’ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ‘రింగ్’ డ్రామాను ప్లే చేశారన్నమాట.
యూట్యూబ్లో చికాగో సుబ్బారావుగా రఘునందన్ జనాలకు బాగానే పరిచయం. అతను పునర్ణవి నటిస్తున్న వెబ్ సిరీస్తో డిజిటల్ డెబ్యూ చేయబోతున్నాడు. దీని గురించి ఇంతకుముందే సమాచారం బయటికొచ్చింది. త్వరలోనే ఆ వెబ్ సిరీస్కు ప్రిమియర్స్ పడనున్న నేపథ్యంలో దానికి హైప్ తీవడానికి ఈ ‘రింగ్’ డ్రామాను ప్లే చేసి అందరినీ ఫూల్స్ను చేసింది పునర్ణవి.
This post was last modified on October 29, 2020 6:10 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన విషయం తెలిసిందే.…