తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు సభల్లోనూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో ఓ మోస్తరుగా సమావేశాలు జరుగుతుండగా… తెలంగాణ సమావేశాలు మాత్రం రసవత్తరంగా సాగుతున్నాయి. అదికార కాంగ్రెస్ తో…ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఢీ అంటే డీ అన్నట్లుగా సాగుతోంది. సీఎం రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ నేతలు అన్నట్టుగా సభ సాగుతోంది. ఇలాంటి సమయంలో సోమవారం రెండు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న వైరివర్గం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కనిపించారు. కేటీఆర్, హరీశ్ రావులతో కలిసి ఓ విషయంపై ఆయన చర్చలు జరిపి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని మరిచిపోకముందే…అసెంబ్లీ ఆవరణలో మరో ఆసక్తికర దృశ్యం కనిపించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డితో కలిసి కేటీఆర్ ఫొటోలకు ఫోజు ఇచ్చారు. ఈ ఇద్దరు నేతల కలయిక ఇప్పుడు తెలంగాణలో ఆసక్తి రేకెత్తించింది.
అసెంబ్లీ సమావేశాల నుంచి కేటీఆర్ బయటకు వెళ్లిపోతున్న సమయంలో… జానా రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద జానా రెడ్డి కారు దిగుతున్న సమయంలోనే అదే గేటు ద్వారా కేటీఆర్ బయటకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో జానాను చూసినంతనే ‘హాయ్ అంకుల్” అంటూ కేటీఆర్ ఆయనను పలకరించారు. జానా కూడా కేటీఆర్ కు విష్ చేశారు. ఈ సందర్భంగా జానా వద్దకు వెళ్లిన కేటీఆర్… ఆయనను ఆలింగనం చేసుకుని…”మీకెక్కడ వయసు అయిపోయింది…మీరు సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నా” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో జానాతో సహా అక్కడి వారిలో నవ్వులు విరిశాయి.
This post was last modified on March 17, 2025 9:19 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…