తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు సభల్లోనూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో ఓ మోస్తరుగా సమావేశాలు జరుగుతుండగా… తెలంగాణ సమావేశాలు మాత్రం రసవత్తరంగా సాగుతున్నాయి. అదికార కాంగ్రెస్ తో…ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఢీ అంటే డీ అన్నట్లుగా సాగుతోంది. సీఎం రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ నేతలు అన్నట్టుగా సభ సాగుతోంది. ఇలాంటి సమయంలో సోమవారం రెండు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న వైరివర్గం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కనిపించారు. కేటీఆర్, హరీశ్ రావులతో కలిసి ఓ విషయంపై ఆయన చర్చలు జరిపి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని మరిచిపోకముందే…అసెంబ్లీ ఆవరణలో మరో ఆసక్తికర దృశ్యం కనిపించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డితో కలిసి కేటీఆర్ ఫొటోలకు ఫోజు ఇచ్చారు. ఈ ఇద్దరు నేతల కలయిక ఇప్పుడు తెలంగాణలో ఆసక్తి రేకెత్తించింది.
అసెంబ్లీ సమావేశాల నుంచి కేటీఆర్ బయటకు వెళ్లిపోతున్న సమయంలో… జానా రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద జానా రెడ్డి కారు దిగుతున్న సమయంలోనే అదే గేటు ద్వారా కేటీఆర్ బయటకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో జానాను చూసినంతనే ‘హాయ్ అంకుల్” అంటూ కేటీఆర్ ఆయనను పలకరించారు. జానా కూడా కేటీఆర్ కు విష్ చేశారు. ఈ సందర్భంగా జానా వద్దకు వెళ్లిన కేటీఆర్… ఆయనను ఆలింగనం చేసుకుని…”మీకెక్కడ వయసు అయిపోయింది…మీరు సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నా” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో జానాతో సహా అక్కడి వారిలో నవ్వులు విరిశాయి.
This post was last modified on March 17, 2025 9:19 pm
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం... ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం.…
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా…
ఎప్పుడూ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటూ హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంత…
టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కొడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిపోయాడు.…
కొన్ని డిమాండ్ల గురించి చర్చకు తీసుకొచ్చినప్పుడు.. ఒకవైపు వాదన విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. అదే విషయాన్ని మరో…
పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో…