Political News

బొత్స‌కు ఫ్రీహ్యాండ్ ఇవ్వ‌లేదా… వైసీపీలో ఏం జ‌రుగుతోంది..?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, శాస‌న మండ‌లిలో విపక్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ గ‌త రెండు రోజులుగా మండ‌లిలో త‌న స్వ‌రం జోరుగా వినిపిస్తున్నారు. నిజానికి అసెంబ్లీలో ప‌ట్టులేకున్నా.. స‌భ‌కు వెళ్ల‌కపోయినా.. వైసీపీ గ‌ళం మంఢ‌లిలో వినిపిస్తోంది. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి ప‌క్షంగా ఉండ‌డంతో ఇక్క‌డ వైసీపీ వాద‌న‌కు అవ‌కాశం ఏర్ప‌డింది. అయితే.. మండ‌లిలో విప‌క్ష నేత‌గా ఉన్న బొత్స‌కు పార్టీ అధిష్టానం ఫ్రీహ్యాండ్ ఇవ్వ‌లేదా? ఆయ‌న ఏం మాట్లాడాల‌న్నా.. ఒకింత ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ నాయ‌కులు.

రెండు కీల‌క విష‌యాల‌ను లేవ‌నెత్తిన బొత్స మండ‌లిలో అధికార ప‌క్షానికి స‌వాళ్లు రువ్వారు. వీటిలో ప్ర‌ధానంగా.. అమ‌రావ‌తి రాజ‌ధాని వ్య‌వ‌హారం. రెండోది విశాఖ‌లో రుషికొండ వ్య‌వ‌హారం. ఈ రెండు అంశాల‌ను కూడా.. బొత్స సీరియ‌స్‌గానే తీసుకున్నా రు. వీటిపై మండ‌లిలో అధికార పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న సూటి ప్ర‌శ్న‌లు సంధించారు. అమ‌రావ‌తిపై తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డ్డాన‌ని చెబుతూనే.. ఇక్క‌డ తాత్కాలిక నిర్మాణాలు చేశార‌న్నారు. అయితే.. ఇదేస‌మ‌యంలో అప్ప‌ట్లో వైసీపీ స్టాండ్ మూడు రాజ‌ధానుల‌ని చెప్పారు. కానీ, ఇప్పుడు త‌మ పార్టీ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు.

ఇదే స‌మ‌యంలో బొత్స రుషి కొండ‌పై జ‌రిగిన నిర్మాణాలు అక్ర‌మం ఎలా అవుతాయ‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ అవ‌స‌రాల కోసం వాటిని నిర్మించిన‌ట్టు చెప్పారు. ఒక‌వేళ అవి అక్ర‌మ నిర్మాణాల‌ను ప్ర‌భుత్వం భావిస్తే.. వాటిపై విచార‌ణ‌కు ఆదేశించుకోవ‌చ్చ న్నారు. ఈ రెండు అంశాల‌పై ప్ర‌భుత్వ పక్షం కూడా గ‌ట్టిగానే బ‌దులిచ్చింది. క‌ట్ చేస్తే.. ఈ రెండు అంశాల‌పై పార్టీ అధిష్టానం బొత్స‌పై ఫైరైన‌ట్టు స‌మాచారం. ఈ రెండు విషయాల‌ను అస‌లు ప్ర‌స్తావించ‌కుండా ఉండి.. నిర‌స‌న తెలిపి ఉంటే బాగుండేద‌ని పార్టీ అధినేత జ‌గ‌న్ వ్యాఖ్యానించార‌ని.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ఎందుకు ప్ర‌స్తావించార‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించిన‌ట్టు పార్టీ వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది.

ఇక‌, రుషికొండ విష‌యాన్ని అన‌వ‌స‌రంగా లేవ‌నెత్తార‌ని.. దీనిపై చర్చ చేప‌ట్టి లేని విష‌యాన్ని మండ‌లిలో చ‌ర్చ‌కు పెట్టార‌ని కూడా జ‌గ‌న్ వ్యాఖ్యానించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇవి కాకుండా.. ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల‌ను ప్ర‌స్తావించ‌డం ద్వారా.. వైసీపీ దూకుడుగా ఉండాల‌ని.. ఇష్టానుసారంగా స‌భ‌ల్లో వ్యాఖ్యానించి పార్టీని ఇరుకున పడేలా చేస్తే ఎలా అన్న‌ది జ‌గ‌న్ చెప్పిన మాటగా తెలుస్తోంది. దీంతో బొత్స కూడా సైలెంట్ అయ్యార‌ని.. తాను అన‌కుండానే అధికార ప‌క్షం నేత‌లు రెచ్చ‌గొట్టార‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చినా.. ఇక నుంచి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. మొత్తానికి బొత్స‌కు ఫ్రీహ్యాండ్ లేద‌న్న చ‌ర్చ అయితే జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 5, 2025 9:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

8 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

8 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

11 hours ago